Trends

ఇండిగో ఎఫెక్ట్: టెక్కీల ‘డిజిటల్’ రిసెప్షన్!

కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక వింత సంఘటన జరిగింది. రిసెప్షన్ వేదిక రెడీ, బంధువులంతా వచ్చేశారు, విందు భోజనాలు సిద్ధం. కానీ స్టేజ్ మీద ఉండాల్సిన పెళ్లికొడుకు, పెళ్లికూతురు మాత్రం లేరు. వాళ్లు ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉండి, వీడియో కాల్ ద్వారా తమ సొంత రిసెప్షన్‌కు హాజరయ్యారు. టెక్నాలజీ యుగంలో ‘వర్చువల్ రిసెప్షన్’ అంటే ఇదేనేమో అనిపించేలా జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ “డిజిటల్ తిప్పలకు” కారణం ఇండిగో విమానయాన సంస్థ. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మేధా, సంగమ దాస్ అనే జంటకు నవంబర్ 23న భువనేశ్వర్‌లో పెళ్లి జరిగింది. డిసెంబర్ 3న హుబ్బళ్లిలో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. కానీ, దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దవుతుండటంతో వీళ్లు భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌లోనే చిక్కుకుపోయారు. డిసెంబర్ 2న ఎక్కాల్సిన ఫ్లైట్, పదే పదే వాయిదా పడి చివరకు రద్దవడంతో వాళ్లకు దిక్కుతోచలేదు.

అప్పటికే బంధుమిత్రులంతా గుజరాత్ భవన్ ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు. చివరి నిమిషంలో ఫంక్షన్ క్యాన్సిల్ చేయడం సాధ్యం కాదు. దీంతో వధువు తల్లిదండ్రులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వధూవరులు కూర్చోవాల్సిన కుర్చీల్లో వాళ్లే కూర్చుని పూజలు, రిసెప్షన్ తంతు నడిపించారు. అటు భువనేశ్వర్‌లో ఉన్న కొత్త జంట, పెళ్లి బట్టల్లో ముస్తాబై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్క్రీన్ మీద దర్శనమిచ్చారు. వచ్చిన అతిథులు ఆశీర్వాదాలు స్క్రీన్ వైపు చూసే అందించాల్సి వచ్చింది.

“మేము తెల్లవారుజామున 4 గంటల వరకు ఫ్లైట్ వస్తుందేమో అని ఆశగా ఎదురుచూశాం. కానీ సడెన్‌గా క్యాన్సిల్ అని మెసేజ్ వచ్చింది. ఇంతమందిని పిలిచి వెనక్కి పంపలేక, ఫ్యామిలీ అంతా చర్చించుకుని ఇలా ఆన్‌లైన్ పద్ధతిని ఎంచుకున్నాం” అని వధువు తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వధూవరులే కాదు, ముంబై మీదుగా రావాల్సిన చాలామంది బంధువులు కూడా ఫ్లైట్స్ లేక ఈ వేడుకకు రాలేకపోయారు.

నిజానికి ఇది ఒక్క జంట సమస్య కాదు. కొత్త డీజీసీఏ నిబంధనల వల్ల పైలట్ల రోస్టర్ ప్లానింగ్ దెబ్బతిని, ఇండిగో సంస్థ దేశవ్యాప్తంగా వందల విమానాలను రద్దు చేస్తోంది. గురువారం ఒక్కరోజే 500కు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్స్ మళ్లీ గాడిన పడటానికి ఫిబ్రవరి వరకు సమయం పడుతుందని ఇండిగో చెబుతోంది. అప్పటివరకు ప్రయాణికులకు ఇలాంటి తిప్పలు తప్పేలా లేవు.

This post was last modified on December 5, 2025 2:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

2 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

2 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

5 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

7 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

8 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

8 hours ago