ఐ బొమ్మ రవి…ఈ మధ్యకాలంలో ఈ పేరు చాలా పాపులర్ అయింది. పేద, మధ్య తరగతి సినీ ప్రేక్షకులు రవిని సినీ రాబిన్ హుడ్ అంటున్నారు. అయితే, నిర్మాతలు మాత్రం అతడో సైబర్ నేరగాడని, చట్టవిరుద్ధంగా పైరసీ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చాడని మండిపడుతున్నారు. అయితే, టెక్నాలజీని వాడడంలో రవి నిష్ణాతుడని, కానీ, దానిని తప్పుడు పనులకు ఉపయోగించాడన్నది వాస్తవం. ఈ క్రమంలో ఐ బొమ్మ రవికి పోలీసులు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారని కొన్ని తెలుగు దిన పత్రికల్లో కథనాలు వచ్చాయి.
పోలీసు శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయాలని, మంచి జీతం ఇస్తామని పోలీసులు ఆఫర్ చేశారని కొన్ని పత్రికలు కథనాలు రాశాయి. అయితే, రవి మాత్రం ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట. కరీబియన్ దీవుల్లో ఐ బొమ్మ రెస్టారెంట్ పెట్టి ఆంధ్రా, తెలంగాణ, భారతీయ వంటకాలను అక్కడి ప్రజలకు రుచిచూపిస్తానని పోలీసులతో రవి అన్నాడట. ఆ రెస్టారెంట్ ద్వారా సంపాదించిన డబ్బుతో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతానని రవి చెప్పాడట.
దీంతో, పోలీసులు ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్న కథనాలపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రవి తనకున్న టాలెంట్ ను సద్వినియోగం చేసే చాన్స్ పోలీసులు ఇచ్చారని, దానిని రవి రిజెక్ట్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇలా సైబర్ నేరాలు చేసిన వారిని పోలీసులు ఎంకరేజ్ చేస్తే తప్పుడు సందేశం వెళుతుందని మరికొందరు అంటున్నారు. దొరికినా దొరే..దొరక్కపోయినా దొరే అన్న రీతిలో..టాలెంట్ ఉన్నంత మాత్రాన సైబర్ క్రైమ్ చేసి పట్టుబడి పోలీసు శాఖలో పనిచేస్తే ఇంక నేరం-శిక్ష అనే భయం సైబర్ నేరగాళ్లకు ఉండదని చెబుతున్నారు.
ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…
టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ…
ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన…
టాలీవుడ్ లో జూన్ నెలలో పెద్ది, మా ఇంటి బంగారం తమ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాయి. తెలుగు రాష్ట్రాల…
రిషికొండ పాలెస్ లను వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా ఎట్టకేలకు ఓ కీలక అడుగు అయితే.పడింది. సాగర నగరం విశాఖ పర్యాటక…
బాలీవుడ్ మూవీ అల్ఫా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. అలియా భట్ టైటిల్ రోల్ పోషించగా శార్వరి వాఘ్ మరో…