ఐ బొమ్మ రవి…ఈ మధ్యకాలంలో ఈ పేరు చాలా పాపులర్ అయింది. పేద, మధ్య తరగతి సినీ ప్రేక్షకులు రవిని సినీ రాబిన్ హుడ్ అంటున్నారు. అయితే, నిర్మాతలు మాత్రం అతడో సైబర్ నేరగాడని, చట్టవిరుద్ధంగా పైరసీ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చాడని మండిపడుతున్నారు. అయితే, టెక్నాలజీని వాడడంలో రవి నిష్ణాతుడని, కానీ, దానిని తప్పుడు పనులకు ఉపయోగించాడన్నది వాస్తవం. ఈ క్రమంలో ఐ బొమ్మ రవికి పోలీసులు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారని కొన్ని తెలుగు దిన పత్రికల్లో కథనాలు వచ్చాయి.
పోలీసు శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయాలని, మంచి జీతం ఇస్తామని పోలీసులు ఆఫర్ చేశారని కొన్ని పత్రికలు కథనాలు రాశాయి. అయితే, రవి మాత్రం ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట. కరీబియన్ దీవుల్లో ఐ బొమ్మ రెస్టారెంట్ పెట్టి ఆంధ్రా, తెలంగాణ, భారతీయ వంటకాలను అక్కడి ప్రజలకు రుచిచూపిస్తానని పోలీసులతో రవి అన్నాడట. ఆ రెస్టారెంట్ ద్వారా సంపాదించిన డబ్బుతో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతానని రవి చెప్పాడట.
దీంతో, పోలీసులు ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్న కథనాలపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రవి తనకున్న టాలెంట్ ను సద్వినియోగం చేసే చాన్స్ పోలీసులు ఇచ్చారని, దానిని రవి రిజెక్ట్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇలా సైబర్ నేరాలు చేసిన వారిని పోలీసులు ఎంకరేజ్ చేస్తే తప్పుడు సందేశం వెళుతుందని మరికొందరు అంటున్నారు. దొరికినా దొరే..దొరక్కపోయినా దొరే అన్న రీతిలో..టాలెంట్ ఉన్నంత మాత్రాన సైబర్ క్రైమ్ చేసి పట్టుబడి పోలీసు శాఖలో పనిచేస్తే ఇంక నేరం-శిక్ష అనే భయం సైబర్ నేరగాళ్లకు ఉండదని చెబుతున్నారు.
This post was last modified on December 3, 2025 5:02 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…