ఐ బొమ్మ రవి…ఈ మధ్యకాలంలో ఈ పేరు చాలా పాపులర్ అయింది. పేద, మధ్య తరగతి సినీ ప్రేక్షకులు రవిని సినీ రాబిన్ హుడ్ అంటున్నారు. అయితే, నిర్మాతలు మాత్రం అతడో సైబర్ నేరగాడని, చట్టవిరుద్ధంగా పైరసీ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చాడని మండిపడుతున్నారు. అయితే, టెక్నాలజీని వాడడంలో రవి నిష్ణాతుడని, కానీ, దానిని తప్పుడు పనులకు ఉపయోగించాడన్నది వాస్తవం. ఈ క్రమంలో ఐ బొమ్మ రవికి పోలీసులు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారని కొన్ని తెలుగు దిన పత్రికల్లో కథనాలు వచ్చాయి.
పోలీసు శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయాలని, మంచి జీతం ఇస్తామని పోలీసులు ఆఫర్ చేశారని కొన్ని పత్రికలు కథనాలు రాశాయి. అయితే, రవి మాత్రం ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట. కరీబియన్ దీవుల్లో ఐ బొమ్మ రెస్టారెంట్ పెట్టి ఆంధ్రా, తెలంగాణ, భారతీయ వంటకాలను అక్కడి ప్రజలకు రుచిచూపిస్తానని పోలీసులతో రవి అన్నాడట. ఆ రెస్టారెంట్ ద్వారా సంపాదించిన డబ్బుతో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతానని రవి చెప్పాడట.
దీంతో, పోలీసులు ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్న కథనాలపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రవి తనకున్న టాలెంట్ ను సద్వినియోగం చేసే చాన్స్ పోలీసులు ఇచ్చారని, దానిని రవి రిజెక్ట్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇలా సైబర్ నేరాలు చేసిన వారిని పోలీసులు ఎంకరేజ్ చేస్తే తప్పుడు సందేశం వెళుతుందని మరికొందరు అంటున్నారు. దొరికినా దొరే..దొరక్కపోయినా దొరే అన్న రీతిలో..టాలెంట్ ఉన్నంత మాత్రాన సైబర్ క్రైమ్ చేసి పట్టుబడి పోలీసు శాఖలో పనిచేస్తే ఇంక నేరం-శిక్ష అనే భయం సైబర్ నేరగాళ్లకు ఉండదని చెబుతున్నారు.
This post was last modified on December 3, 2025 5:02 pm
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…