Trends

విమానాలకు ‘బ్లూ స్క్రీన్’ ఎఫెక్ట్.. ఆగిపోయిన ఫ్లైట్లు!

దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో మళ్లీ గందరగోళం మొదలైంది. ప్రయాణికులు చెక్ ఇన్ చేసుకోవడానికి కౌంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఎందుకంటే, విమానాశ్రయ వ్యవస్థలను నడిపించే ‘మైక్రోసాఫ్ట్ విండోస్’ సడెన్‌గా మొరాయించింది. దీనివల్ల కంప్యూటర్లు పనిచేయక, బోర్డింగ్ పాస్‌లు ఇవ్వడం, బ్యాగేజ్ ట్యాగింగ్ చేయడం కష్టమైపోయింది. ఫలితంగా అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని పూర్తిగా రద్దయ్యాయి.

ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దీని ప్రభావం గట్టిగా పడింది. ఢిల్లీ, బెంగళూరు, గోవా, మదురై వంటి నగరాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు కూడా ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. బుధవారం ఒక్క శంషాబాద్ నుంచే 19 సర్వీసులు (7 వెళ్లాల్సినవి, 12 రావాల్సినవి) రద్దయినట్లు అధికారులు తెలిపారు.

కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది పాత పద్ధతిలో ‘మాన్యువల్’గా చెక్ ఇన్ చేస్తున్నారు. చేతితో బోర్డింగ్ పాస్‌లు రాసి ఇవ్వడం వల్ల ఎక్కువ సమయం పడుతోంది. ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రధాన సంస్థలన్నింటిపైనా ఈ ఎఫెక్ట్ పడింది. అయితే, మైక్రోసాఫ్ట్ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇటీవల జీపీఎస్ స్పూఫింగ్ కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త టెక్నికల్ గ్లిచ్ ప్రయాణికులను మరింత బెంబేలెత్తిస్తోంది. విమానాశ్రయానికి వెళ్లే ముందు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిదని ఎయిర్‌లైన్స్ సూచిస్తున్నాయి. టెక్నాలజీ మీద అతిగా ఆధారపడటం వల్ల ఒక్కోసారి ఇలాంటి ‘బ్లూ స్క్రీన్’ కష్టాలు తప్పవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

This post was last modified on December 3, 2025 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

56 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

4 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago