Trends

కొత్త ఫోన్ కొంటున్నారా… ఐతే ఈ యాప్ ఉండాల్సిందే!

కొత్తగా ఫోన్ కొంటున్నారా? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఇకపై మీరు కొనే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్లో ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi) అనే గవర్నమెంట్ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేసి రావాల్సిందే. ఆపిల్, శాంసంగ్, షావోమీ, వివో, ఒప్పో వంటి మొబైల్ తయారీ సంస్థలన్నింటికీ కేంద్ర టెలికాం శాఖ DoT ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కొత్త నిబంధనను పాటించడానికి కంపెనీలకు 90 రోజుల గడువు ఇచ్చారు. ఫోన్ బాక్స్ ఓపెన్ చేసి ఆన్ చేయగానే ఈ యాప్ స్క్రీన్ మీద కనిపించాలి. దీనివల్ల లాభం ఏంటంటే.. సైబర్ మోసాలు, ఫోన్ దొంగతనాలు జరిగినప్పుడు వేగంగా ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఇప్పటివరకు ‘సంచార్ సాథీ’ పోర్టల్‌కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ యాప్ ఉంటే ఒక్క క్లిక్‌తో పని అయిపోతుంది. దీనికి ఓటీపీ వెరిఫికేషన్ కూడా అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

అయితే, ఈ యాప్‌ను డిలీట్ చేయలేము అనే వార్తలు వస్తున్నాయి. కానీ అది అబద్ధమని, కావాలంటే యూజర్లు దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని టెలికాం శాఖ అధికారి ఒకరు క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం యూజర్ల సేఫ్టీ కోసమే తప్ప, వారిని ఇబ్బంది పెట్టడానికి కాదని స్పష్టం చేశారు.

ఈ యాప్ ద్వారా మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు, ఫోన్ పోతే వెంటనే బ్లాక్ చేయించవచ్చు, మీకు వచ్చే ఫేక్ మెసేజ్‌లు, కాల్స్‌పై ఫిర్యాదు చేయవచ్చు. గత మూడు, నాలుగేళ్లలో సైబర్ మోసాల వల్ల జనం దాదాపు 35 వేల కోట్లు నష్టపోయారు. ఈ ఫ్రాడ్స్‌కి చెక్ పెట్టడానికే ప్రభుత్వం ఈ సీరియస్ స్టెప్ తీసుకుంది.

మీ ఫోన్ పోయినా సరే, ఈ పోర్టల్ ఎంత అడ్వాన్స్‌డ్ అంటే.. మీరు IMEI నంబర్ గుర్తుపెట్టుకోకపోయినా కంప్లైంట్ ఇవ్వొచ్చు. మోసగాళ్లు రెచ్చిపోతున్న ఈ టైంలో, ఇలాంటి గవర్నమెంట్ యాప్ ప్రతి ఫోన్లో ఉండటం యూజర్లకు ఒక అదనపు రక్షణ కవచం లాంటిదే.

This post was last modified on December 2, 2025 7:41 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

41 minutes ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

2 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

7 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

7 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

7 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

8 hours ago