Trends

కొత్త ఫోన్ కొంటున్నారా… ఐతే ఈ యాప్ ఉండాల్సిందే!

కొత్తగా ఫోన్ కొంటున్నారా? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఇకపై మీరు కొనే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్లో ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi) అనే గవర్నమెంట్ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేసి రావాల్సిందే. ఆపిల్, శాంసంగ్, షావోమీ, వివో, ఒప్పో వంటి మొబైల్ తయారీ సంస్థలన్నింటికీ కేంద్ర టెలికాం శాఖ DoT ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కొత్త నిబంధనను పాటించడానికి కంపెనీలకు 90 రోజుల గడువు ఇచ్చారు. ఫోన్ బాక్స్ ఓపెన్ చేసి ఆన్ చేయగానే ఈ యాప్ స్క్రీన్ మీద కనిపించాలి. దీనివల్ల లాభం ఏంటంటే.. సైబర్ మోసాలు, ఫోన్ దొంగతనాలు జరిగినప్పుడు వేగంగా ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఇప్పటివరకు ‘సంచార్ సాథీ’ పోర్టల్‌కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ యాప్ ఉంటే ఒక్క క్లిక్‌తో పని అయిపోతుంది. దీనికి ఓటీపీ వెరిఫికేషన్ కూడా అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

అయితే, ఈ యాప్‌ను డిలీట్ చేయలేము అనే వార్తలు వస్తున్నాయి. కానీ అది అబద్ధమని, కావాలంటే యూజర్లు దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని టెలికాం శాఖ అధికారి ఒకరు క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం యూజర్ల సేఫ్టీ కోసమే తప్ప, వారిని ఇబ్బంది పెట్టడానికి కాదని స్పష్టం చేశారు.

ఈ యాప్ ద్వారా మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు, ఫోన్ పోతే వెంటనే బ్లాక్ చేయించవచ్చు, మీకు వచ్చే ఫేక్ మెసేజ్‌లు, కాల్స్‌పై ఫిర్యాదు చేయవచ్చు. గత మూడు, నాలుగేళ్లలో సైబర్ మోసాల వల్ల జనం దాదాపు 35 వేల కోట్లు నష్టపోయారు. ఈ ఫ్రాడ్స్‌కి చెక్ పెట్టడానికే ప్రభుత్వం ఈ సీరియస్ స్టెప్ తీసుకుంది.

మీ ఫోన్ పోయినా సరే, ఈ పోర్టల్ ఎంత అడ్వాన్స్‌డ్ అంటే.. మీరు IMEI నంబర్ గుర్తుపెట్టుకోకపోయినా కంప్లైంట్ ఇవ్వొచ్చు. మోసగాళ్లు రెచ్చిపోతున్న ఈ టైంలో, ఇలాంటి గవర్నమెంట్ యాప్ ప్రతి ఫోన్లో ఉండటం యూజర్లకు ఒక అదనపు రక్షణ కవచం లాంటిదే.

This post was last modified on December 2, 2025 7:41 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

44 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago