బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కానీ ఆ ఇష్టమే కొందరికి పిచ్చిగా మారుతుంది. ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారం వేసుకుని తిరిగితే చూసేవాళ్లకు ముచ్చటగా ఉండొచ్చు కానీ, దొంగలకు, గ్యాంగ్స్టర్లకు మాత్రం అది ఒక టార్గెట్లా కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి ఒక ‘గోల్డ్ మ్యాన్’ ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు. తన మెడలోని బంగారమే తన మెడకు చుట్టుకునేలా మారింది.
రాజస్థాన్ లోని చిత్తోర్గఢ్ లో ఇతను చాలా ఫేమస్. ఎందుకంటే ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి లాగా ఎప్పుడూ భారీగా నగలు వేసుకుని కనిపిస్తాడు. స్థానికులు ఆయన్ను ‘చిత్తోర్గఢ్ బప్పీ లహరి’ అని పిలుచుకుంటారు. అయితే రెండు రోజుల క్రితం వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్, ఆడియో మెసేజ్ అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. అడిగినంత ఇవ్వకపోతే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరికలు వచ్చాయి.
అసలు వివరాల్లోకి వెళ్తే.. ఇతని పేరు కన్హయ్యలాల్ ఖటిక్. పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. తాజాగా ఇతనికి అంతర్జాతీయ గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. మొదట మిస్డ్ కాల్స్, ఆ తర్వాత వాట్సాప్ కాల్స్ వచ్చాయి. లిఫ్ట్ చేయకపోవడంతో ఒక ఆడియో రికార్డింగ్ పంపించారు. అందులో ఏకంగా 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆ ఆడియో మెసేజ్ లో ఉన్న కంటెంట్ వింటే షాక్ అవ్వాల్సిందే. “డబ్బులు ఇవ్వకపోతే.. నువ్వు ఇకపై బంగారం వేసుకునే స్థితిలో ఉండవు” అంటూ గ్యాంగ్స్టర్లు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా సైలెంట్ గా సెటిల్ చేసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో భయపడిపోయిన కన్హయ్యలాల్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
ఒకప్పుడు తోపుడు బండిపై కూరగాయలు అమ్మిన కన్హయ్యలాల్, ఆ తర్వాత పండ్ల వ్యాపారంలో స్థిరపడి సంపన్నుడయ్యాడు. బప్పీ లహరి ఇన్స్పిరేషన్ తో దాదాపు 3.5 కిలోల బంగారాన్ని ఒంటిపై ధరించి ‘గోల్డ్ మ్యాన్’ గా మారాడు. ఇక బెదిరించిన రోహిత్ గోదారా సామాన్యుడు కాదు. సిద్దు మూసేవాలా హత్య కేసులో ఇతను కూడా ఒక నిందితుడు. కెనడాలో తలదాచుకుని ఇలాంటి దందాలు నడిపిస్తున్నాడు. పోలీసులు గోదారా గ్యాంగ్ లింకులపై ఆరా తీస్తున్నారు. 5 కోట్ల డిమాండ్ అనేది చిన్న విషయం కాదు కాబట్టి, అధికారులు దీనిని సీరియస్ గా తీసుకున్నారు.
This post was last modified on November 29, 2025 10:50 am
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…