ఎవరి ఆకలి వారికే తెలుస్తుంది.. అడగందే అమ్మైనా పెట్టదనే సామెత కూడా ఉంది. కానీ ఈ పరికరానికి మన ఆకలి తెలుస్తుంది. అంతేకాదు.. ఏకంగా ఫుడ్ కూడా ఆర్డర్ చేస్తుంది. మంగుళూరు కు చెందిన యువకుడు తయారుచేసిన డివైస్ మన కడుపులోని ఆకలి కేకలను కూడా పసికడుతుంది. మనకు ఎంత ఆహారం కావాలో కూడా అదే డిసైడ్ చేసుకుని ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ చేస్తుంది.
నూతన పరిశోధనల ద్వారా సరికొత్త ఆవిష్కరణలతో మన దేశ యువత దూసుకు వెళుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీని అందుకుని కొత్త పరికరాలను రూపొందిస్తుంది. అటువంటిదే ఈ మంగుళూరు కు చెందిన యువకుడి ఆవిష్కరణ.
మంగళూరు ప్రాంతానికి చెందిన యువకుడు సోహన్ ఎం రాయ్ రూపొందించిన ఈ ఏఐ పరికరం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కడుపు ఖాళీ అయితే వెంటనే భోజనాన్ని ఆర్డర్ చేసే ఈ పరికరాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సోహన్ తయారు చేసిన ఈ పరికరం కడుపు శబ్దాలను గుర్తించి, వెంటనే ఆ శబ్దాన్ని ఆకలిగా భావించి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లో ఆర్డర్ వేస్తుంది.
కడుపు శబ్దాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషిస్తుంది. ఆ వెంటనే యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. సోషల్ మీడియాలో దీనిపై పలు కామెంట్లు చేస్తున్నారు. టెస్ట్ చేయడానికి రోజు మొత్తం ఆకలితో కూర్చున్నాడట… అదేనండి అసలు ఇన్నోవేషన్! అని ఒకరు కామెంట్ చేశారు.
This post was last modified on November 28, 2025 10:00 pm
డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు.. తమపై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ…
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం…
మతపరంగా రిజర్వేషన్లను కల్పించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో తెగేసి చెప్పారు. మహిళా బిల్లు…
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటిగట్టు ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఫిలిం…
మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని,…