ఎవరి ఆకలి వారికే తెలుస్తుంది.. అడగందే అమ్మైనా పెట్టదనే సామెత కూడా ఉంది. కానీ ఈ పరికరానికి మన ఆకలి తెలుస్తుంది. అంతేకాదు.. ఏకంగా ఫుడ్ కూడా ఆర్డర్ చేస్తుంది. మంగుళూరు కు చెందిన యువకుడు తయారుచేసిన డివైస్ మన కడుపులోని ఆకలి కేకలను కూడా పసికడుతుంది. మనకు ఎంత ఆహారం కావాలో కూడా అదే డిసైడ్ చేసుకుని ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ చేస్తుంది.
నూతన పరిశోధనల ద్వారా సరికొత్త ఆవిష్కరణలతో మన దేశ యువత దూసుకు వెళుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీని అందుకుని కొత్త పరికరాలను రూపొందిస్తుంది. అటువంటిదే ఈ మంగుళూరు కు చెందిన యువకుడి ఆవిష్కరణ.
మంగళూరు ప్రాంతానికి చెందిన యువకుడు సోహన్ ఎం రాయ్ రూపొందించిన ఈ ఏఐ పరికరం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కడుపు ఖాళీ అయితే వెంటనే భోజనాన్ని ఆర్డర్ చేసే ఈ పరికరాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సోహన్ తయారు చేసిన ఈ పరికరం కడుపు శబ్దాలను గుర్తించి, వెంటనే ఆ శబ్దాన్ని ఆకలిగా భావించి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లో ఆర్డర్ వేస్తుంది.
కడుపు శబ్దాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషిస్తుంది. ఆ వెంటనే యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. సోషల్ మీడియాలో దీనిపై పలు కామెంట్లు చేస్తున్నారు. టెస్ట్ చేయడానికి రోజు మొత్తం ఆకలితో కూర్చున్నాడట… అదేనండి అసలు ఇన్నోవేషన్! అని ఒకరు కామెంట్ చేశారు.
This post was last modified on November 28, 2025 10:00 pm
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…