Trends

భారత ఎకానమీ: Q2లో 8.2% గ్రోత్.. రికార్డుల మోత!

భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. అంచనాలకు మించి రాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా విడుదలైన ప్రభుత్వ డేటా ప్రకారం, జులై సెప్టెంబర్ త్రైమాసికం (Q2)లో ఇండియా జీడీపీ ఏకంగా 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత ఆరు త్రైమాసికాల్లోనే అత్యధికం కావడం విశేషం. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల వినియోగం పెరుగుతుందని ఊహించి ఫ్యాక్టరీలు భారీగా ఉత్పత్తులను పెంచడం వల్లే ఈ అద్భుతమైన గ్రోత్ సాధ్యమైంది.

ముఖ్యంగా మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఈసారి హీరోగా నిలిచింది. దేశ జీడీపీలో 14 శాతం వాటా ఉన్న ఈ రంగం, ఈ క్వార్టర్‌లో ఏకంగా 9.1 శాతం వృద్ధిని సాధించింది. పోయిన ఏడాది ఇదే సమయంలో ఇది కేవలం 2.2 శాతంగా ఉండేది. అంటే ఏ రేంజ్‌లో పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. గత త్రైమాసికంలో (ఏప్రిల్ జూన్) 7.8 శాతంగా ఉన్న వృద్ధి రేటు, ఇప్పుడు 8.2 శాతానికి చేరడం భారత ఆర్థిక పటిష్టతకు నిదర్శనం. నామినల్ జీడీపీ కూడా 8.7 శాతం గ్రోత్ రేట్ నమోదు చేసింది.

ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫుల్ ఖుషీ అయ్యారు. “ఇది చాలా ప్రోత్సాహకరమైన ఫలితం. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజల కష్టానికి ఇది నిదర్శనం” అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. సంస్కరణలను కొనసాగిస్తూనే, సామాన్యుడి జీవన ప్రమాణాలను పెంచడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

అయితే, అసలు టార్గెట్ ఇక్కడితో అయిపోలేదు. 2047 నాటికి భారత్‌ను ‘విక్షిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)గా మార్చాలనేది పెద్ద కల. ఈ కల నిజం కావాలంటే, రాబోయే రెండు దశాబ్దాల పాటు మనం సగటున 8 శాతం వృద్ధి రేటును మెయింటైన్ చేయాల్సి ఉంటుందని ఎకనామిక్ సర్వే చెబుతోంది. వరల్డ్ బ్యాంక్ కూడా ఇదే మాట చెప్పింది. వచ్చే 22 ఏళ్ల పాటు ఇండియా కనీసం 7.8 శాతం వృద్ధి సాధిస్తేనే మనం అనుకున్న ఆ సూపర్ పవర్ స్టేటస్ దక్కుతుంది.

ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారత్, ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. గత పదేళ్లలో ఎన్నో దేశాలను వెనక్కి నెట్టి మనం ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు మన ముందున్న సవాలు.. తలసరి ఆదాయాన్ని కూడా పెంచుకోవడం. ఈ 8.2% గ్రోత్ రేట్ చూస్తుంటే, భారత్ సరైన ట్రాక్‌లోనే వెళ్తోందని, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

Kumar

Recent Posts

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

3 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

3 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

5 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

5 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

6 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

6 hours ago