Trends

పాన్ మసాలా కింగ్ కోడలి మృతి.. షాకింగ్ ఆరోపణలు

ఢిల్లీలోని వసంత్ విహార్‌లో జరిగిన పాన్ మసాలా టైకూన్ కమలా పసంద్ కోడలి ఆత్మహత్య కేసులో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు ఇదొక సాదాసీదా ఆత్మహత్య అనుకున్నారు. డైరీలో రాసిన మాటలను బట్టి భార్యాభర్తల గొడవలే కారణమని భావించారు. కానీ, మృతురాలి సోదరుడు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలు వింటే అసలు కథ వేరే ఉందనిపిస్తోంది.

మృతురాలి సోదరుడి ఆరోపణల ప్రకారం, ఆమెను అత్తింటివారు చిత్రహింసలు పెట్టేవారు. కేవలం మాటలతో వేధించడమే కాదు, భర్త, అత్త కలిసి ఆమెను కొట్టేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ బాధలు భరించలేక ఆమెను కోల్‌కతాలోని పుట్టింటికి తీసుకెళ్తే, అత్తింటివారు వచ్చి మళ్ళీ ఇలా జరగదు, బాగా చూసుకుంటాం అని నమ్మబలికి ఢిల్లీ తీసుకెళ్లారట. కానీ అక్కడ సీన్ మళ్ళీ రిపీట్ అయ్యింది. వాళ్ళ మాటలు నమ్మి వచ్చినందుకు ఆమె ప్రాణాలే తీసుకోవాల్సి వచ్చింది.

అసలు విషయం ఏంటంటే.. ఆమె భర్తకు వేరే మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని సోదరుడు ఆరోపించాడు. అంతటితో ఆగకుండా, భర్త రహస్యంగా రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని, ముంబైలో అతనికి ఒక బిడ్డ కూడా ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అత్తింటివారు ఈ విషయాన్ని దాచిపెట్టి, కొడుకును వెనకేసుకురావడంతో ఆమె మానసికంగా కృంగిపోయిందని వాపోయాడు. భర్తకు అక్రమ సంబంధాలు, ఇంట్లో వేధింపులే ఆమెను చంపేశాయని సోదరుడు కన్నీరుమున్నీరయ్యాడు.

అయితే, ఈ ఆరోపణలను పాన్ మసాలా వ్యాపారి ఫ్యామిలీ లాయర్ రాజేందర్ సింగ్ పూర్తిగా ఖండించారు. ఇవన్నీ అబద్ధాలని, నిరాధారమైనవని కొట్టిపారేశారు. రెండు కుటుంబాలు ఇప్పుడు బాధలో ఉన్నాయని, మృతురాలికి గౌరవంగా అంత్యక్రియలు జరగాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఆమె రాసిన నోట్‌లో ఎవరి పేరు లేదని, ఎవరినీ నిందించలేదని, ఇదొక దురదృష్టకరమైన ఘటన అని ఆయన వాదిస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఘటనా స్థలంలో దొరికిన డైరీలో ‘రిలేషన్ షిప్ ఇష్యూస్’ అని రాసి ఉండటం, ఇప్పుడు సోదరుడు చేసిన సీరియస్ ఆరోపణలు కేసును కొత్త మలుపు తిప్పాయి. భర్త జిమ్‌కు వెళ్లిన సమయంలో, పిల్లలు స్కూల్‌కు వెళ్లినప్పుడు ఆమె ఒంటరిగా ఉండి ఈ ఘోరానికి ఒడిగట్టింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్, కుటుంబ సభ్యుల విచారణ తర్వాత ఈ హై ప్రొఫైల్ కేసులో అసలు దోషులు ఎవరో తేలనుంది.

This post was last modified on November 28, 2025 6:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

4 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

8 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

8 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

10 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

11 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

12 hours ago