స్టార్ వార్స్ లాంటి సినిమాల్లో లేజర్ గన్నులను అందరూ చూసే ఉంటారు, అందులోంచి ఒక లైట్ వస్తుంది, అవతలి వాళ్ల విమానాలు పేలిపోతాయి. అది అప్పుడు గ్రాఫిక్స్, కానీ ఇప్పుడు నిజం. బ్రిటన్ సరిగ్గా అలాంటి ఆయుధాన్నే తయారు చేసింది. దీని పేరు ‘డ్రాగన్ ఫైర్’. ఇది తుపాకీ గుండులాగా శబ్దం చేయదు, కంటికి కనిపించదు. కానీ ఆకాశంలో ఎంత వేగంగా వెళ్తున్న డ్రోన్నైనా, బాంబునైనా క్షణాల్లో కాల్చి బూడిద చేస్తుంది.
దీని గురి ఎంత పర్ఫెక్ట్ అంటే.. ఒక కిలోమీటర్ దూరంలో మనం వాడే చిన్న 5 రూపాయల కాయిన్ నిలబెట్టినా, దాన్ని కచ్చితంగా కాల్చగలదట. మామూలుగా గాలిలో వేగంగా వెళ్లే వస్తువులను కొట్టడం చాలా కష్టం. కానీ ఈ లేజర్ సిస్టమ్ మాత్రం గురి అస్సలు తప్పదు. స్కాట్లాండ్లో చేసిన టెస్టుల్లో ఇది డ్రోన్లను గాల్లోనే ముక్కలు చేసింది.
అసలు ఈ వెపన్ ఎందుకు అంత స్పెషల్ అంటే.. దీనికయ్యే ఖర్చే కారణం. మామూలుగా శత్రువు పంపే క్షిపణిని కూల్చాలంటే, మనం కూడా ఒక క్షిపణిని వాడాలి. దాని ఖరీదు కొన్ని కోట్లలో ఉంటుంది. కానీ ఈ లేజర్ గన్ నుంచి ఒక్కసారి ఫైర్ చేయడానికి కేవలం 10 పౌండ్లు.. అంటే మన డబ్బుల్లో సుమారు 1000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. కోట్లు ఎక్కడ? వెయ్యి రూపాయలు ఎక్కడ? అందుకే ఇది గేమ్ ఛేంజర్.
ఇది ఎలా పనిచేస్తుందంటే.. కరెంట్ సాయంతో శక్తివంతమైన కాంతి కిరణాన్ని తయారు చేస్తుంది. టార్చ్ లైట్ వేసినంత ఈజీగా ఇది వెళ్తుంది. ఇది కాంతి వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి శత్రువు తప్పించుకునే ఛాన్స్ ఉండదు. ఆ లేజర్ కిరణం టార్గెట్ మీద పడగానే, విపరీతమైన వేడి పుట్టి ఆ వస్తువు అక్కడికక్కడే కాలిపోతుంది లేదా కరిగిపోతుంది. ఇందులో బుల్లెట్లు అయిపోతాయనే భయం కూడా ఉండదు. పవర్ ఉంటే చాలు, ఎంతమందినైనా కొట్టొచ్చు.
మరో ఐదేళ్లలో, అంటే 2027 నాటికి దీన్ని బ్రిటన్ నేవీ షిప్స్లో వాడబోతున్నారు. తక్కువ ఖర్చుతో దేశాన్ని కాపాడుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో ఇక బాంబుల మోత కంటే, ఇలాంటి సైలెంట్ లేజర్ దాడులే ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on November 28, 2025 6:38 am
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…