బంగాళాఖాతంలో వాతావరణం ఇప్పుడు హాట్ హాట్గా మారింది. అరుదైన తుఫాను ‘సెన్యార్’ ముప్పు మన దేశానికి తప్పింది అనుకునేలోపే, మరో కొత్త ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా బలపడింది. రాబోయే 12 గంటల్లో ఇది కచ్చితంగా తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ IMD లేటెస్ట్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఒకవేళ ఇది తుఫానుగా మారితే దానికి ‘దిత్వ’ అని పేరు పెట్టనున్నారు.
ప్రస్తుతం ఈ వాయుగుండం శ్రీలంక తీరానికి దగ్గరలో ఉంది. ఇది నెమ్మదిగా ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావం కేవలం తమిళనాడుకే పరిమితం కాదు, దక్షిణ కోస్తా ఆంధ్రాపై కూడా గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. వచ్చే 48 గంటల్లో ఇది తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉండటంతో రెండు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇప్పటికే చెన్నైతో పాటు నాగపట్నం, తిరువళ్లూరు, తంజావూరు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లను ఐఎండీ జారీ చేసింది. నవంబర్ 28, 29 తేదీల్లో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ అయ్యాయి. ‘దిత్వ’ తుఫానుగా మారాక గాలుల వేగం పెరిగితే, తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉంది.
ఇదిలా ఉంటే, దీనికి ముందు ఏర్పడిన ‘సెన్యార్’ తుఫాను వాతావరణ నిపుణులను ఆశ్చర్యపరిచింది. మలేషియా, ఇండోనేషియా మధ్య ఉన్న మలక్కా జలసంధిలో తుఫాను ఏర్పడటం చరిత్రలో ఇదే తొలిసారి అని, అందుకే దీన్ని “రేరెస్ట్ ఆఫ్ రేర్” తుఫానుగా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా అక్కడ తుఫానులు పుట్టవు. అదృష్టవశాత్తూ ఈ సెన్యార్ భారత తీరానికి దూరంగా, మలేషియా వైపు వెళ్లిపోవడంతో మనకు పెను ప్రమాదం తప్పింది.
ఒకే సమయంలో రెండు వేర్వేరు సిస్టమ్స్ యాక్టివ్గా ఉండటం, అందులోనూ ఒకటి అత్యంత అరుదైన ప్రాంతంలో పుట్టడం చూస్తుంటే వాతావరణ మార్పులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతోంది. ‘సెన్యార్’ వెళ్లిపోయినా, ఇప్పుడు ‘దిత్వ’ రూపంలో వస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి. రాబోయే రెండు, మూడు రోజులు వాతావరణంపై కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం.
This post was last modified on November 27, 2025 3:51 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…