ఏషియన్ వరల్డ్ సిటీగా పిలుచుకునే హాంకాంగ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 44 మంది అగ్నికీలలకు ఆహుతి కాగా 250 మందికిపైగా ఆచూకీ తెలియలేదు. న్యూ టెరిటరీస్లోని థాయ్ పో జిల్లాలో ఉన్న ఒక పెద్ద నివాస సముదాయంలో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే మిగతా అపార్ట్మెంట్ లకు విస్తరించాయి.
మొదట 32 అంతస్తుల భవనం బయట మంటలు అంటుకున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన బాంబూ స్కాఫోల్డింగ్ వద్ద మంట రేగి.. అక్కడ ఉన్న ప్లాస్టిక్ నెట్టింగ్, కాన్వాస్ కవర్, నిర్మాణ సామగ్రి మంటలను వేగంగా వ్యాపింపజేశాయి. బలమైన గాలి వీచడంతో మంటలు వెంటనే ఇతర టవర్లకు పాకినట్లు స్థానికులు చెబుతున్నారు.
అక్కడ స్థానికంగా ఎనిమిది భవనాలు, వాటిలో రెండు వేల పైగా ఇల్లు ఉన్నాయి. ప్రమాదం సంభవించిన సమయంలో పై అంతస్తులు కొంత మంది చిక్కుకుపోయారు. వారిలో వృద్ధులు కూడా ఉన్నట్లు సమాచారం. 140 ఫైరింజన్లు, 60 అంబులెన్స్లు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. వందలాది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది చేరుకున్నారు. భారీ అగ్ని ప్రమాదం హాంకాంగ్లో దాదాపు 30 ఏళ్లలో అత్యంత ఘోరమైనదిగా గుర్తిస్తున్నారు. ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
This post was last modified on November 27, 2025 10:38 am
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…