పిల్లలకు ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించాలి. వారికి చదువు నేర్పుతూ భవిష్యత్తుకు బాటలు వేయాలి. అటువంటి టీచర్లు తమ విద్యార్ధిని చెట్టుకు వేలాడదీశారు. హోమ్ వర్క్ చేయలేదంటూ దారుణానికి ఒడిగట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛత్తీస్గఢ్లో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సూరజ్పూర్ జిల్లా నారాయణపూర్లోని హంసవాణి విద్యామందిర్లో ఈ దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదని ఐదేళ్ల వయసున్న బాలుడిని చెట్టుకు టీచర్లు వేలాడదీశారు. సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు.
చిన్నారిని చెట్టుకు వేలాడదీసిన దృశ్యాలను స్కూలు పక్కనే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని రేపటంతో విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించారు. వారు అక్కడికి చేరుకున్నారు. వికాస్ ఖండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డి.సి. లాక్డా మాట్లాడుతూ, తాను ఘటన స్థలానికి వచ్చి విచారణ చేపట్టానన్నారు.
సాయంత్రం జిల్లా కలెక్టర్కి నివేదిక సమర్పిస్తాను. తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. వీడియో ఆధారంగా.. విద్యార్థిని చిత్రహింసలు పెట్టిన టీచర్లను కాజల్ సాహు, అనురాధ దేవాంగన్గా గుర్తించి వారిపై వేటు వేశారు. పాఠశాల యాజమాన్యం తన తప్పును అంగీకరించి బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని స్కూల్ యాజమాన్యాన్ని ఉన్నతాధికారులు ఆదేశించారు.
This post was last modified on November 25, 2025 2:15 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…