కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న తెలుగు యువతి హత్యకు గురైంది. ఆమె స్నేహితుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బిక్కింవారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, జగదాంబ దంపతుల కుమార్తె దేవశ్రీ(21) ఆచార్య కళాశాలలో బీబీఏ డిగ్రీ నాలుగో సంవత్సరం కళాశాలలో చదువుతోంది.
స్థానికంగా అక్కడే ఓ అద్దె గదిలో ఉంటోంది. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం పెద్దకొండమర్రికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడు ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఏమైందో కానీ ఆమె గదిలో గాయాలతో విగత జీవిగా పడి ఉంది
స్నేహితుడైన ప్రేమవర్ధన్ ఆమె తలపై కొట్టి హత్య చేసినట్లు మాదనాయనకహళ్లి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేవశ్రీ హత్యకు గురైన సమాచారాన్ని ఆమె తల్లిదండ్రులకు చేరవేశారు. వెంటనే వారు అక్కడికి బయలుదేరి వెళ్లారు. చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి వస్తుందన్న కుమార్తె హత్యకు గురికావడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…