కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న తెలుగు యువతి హత్యకు గురైంది. ఆమె స్నేహితుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బిక్కింవారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, జగదాంబ దంపతుల కుమార్తె దేవశ్రీ(21) ఆచార్య కళాశాలలో బీబీఏ డిగ్రీ నాలుగో సంవత్సరం కళాశాలలో చదువుతోంది.
స్థానికంగా అక్కడే ఓ అద్దె గదిలో ఉంటోంది. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం పెద్దకొండమర్రికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడు ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఏమైందో కానీ ఆమె గదిలో గాయాలతో విగత జీవిగా పడి ఉంది
స్నేహితుడైన ప్రేమవర్ధన్ ఆమె తలపై కొట్టి హత్య చేసినట్లు మాదనాయనకహళ్లి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేవశ్రీ హత్యకు గురైన సమాచారాన్ని ఆమె తల్లిదండ్రులకు చేరవేశారు. వెంటనే వారు అక్కడికి బయలుదేరి వెళ్లారు. చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి వస్తుందన్న కుమార్తె హత్యకు గురికావడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు.
This post was last modified on November 25, 2025 10:40 am
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…