కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న తెలుగు యువతి హత్యకు గురైంది. ఆమె స్నేహితుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బిక్కింవారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, జగదాంబ దంపతుల కుమార్తె దేవశ్రీ(21) ఆచార్య కళాశాలలో బీబీఏ డిగ్రీ నాలుగో సంవత్సరం కళాశాలలో చదువుతోంది.
స్థానికంగా అక్కడే ఓ అద్దె గదిలో ఉంటోంది. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం పెద్దకొండమర్రికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడు ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఏమైందో కానీ ఆమె గదిలో గాయాలతో విగత జీవిగా పడి ఉంది
స్నేహితుడైన ప్రేమవర్ధన్ ఆమె తలపై కొట్టి హత్య చేసినట్లు మాదనాయనకహళ్లి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేవశ్రీ హత్యకు గురైన సమాచారాన్ని ఆమె తల్లిదండ్రులకు చేరవేశారు. వెంటనే వారు అక్కడికి బయలుదేరి వెళ్లారు. చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి వస్తుందన్న కుమార్తె హత్యకు గురికావడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు.
This post was last modified on November 25, 2025 10:40 am
వచ్చే వారం ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథం అండ్ సన్స్ మీద ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బజ్…
వరుణ్ తేజ్ గత సినిమాల ఓపెనింగ్స్ ఒకసారి తవ్వి తీస్తే రిలీజ్ రోజు మార్నింగ్ షోకు చాలా చోట్ల ఫుల్స్…
న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…
సోషల్ మీడియా ఎప్పుడు ఎవరికి ఎలా ఫేమ్ తెచ్చిపెడుతుందో ఊహించలేం. మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ అనుకోకుండా అలాగే…
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…