Trends

సంక్రాంతి జర్నీ ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, లేదంటే…

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పక్క రాష్ట్రాల్లో ఉన్నవారు, ఇతర దేశంలో ఉన్నవారు సైతం సొంతూరికి చేరుకోవాలని భావిస్తారు. ఈ సంక్రాంతి జర్నీకి ముందుగా ప్లాన్ చేసుకోకపోతే కష్టమే మరి..! ఏటా తెలంగాణ నుంచి ఏపీకి సంక్రాంతి సమయంలో లక్షల మంది తరలి వెళ్తారు. సొంత వాహనాలతో ప్రయాణం చేస్తున్న వారితో టోల్ గేట్లు, హైవే రద్దీగా మారిపోవడం మనకు తెలిసిందే. అయితే బస్సులు రైళ్లు విమానాల్లో ప్రయాణించే వారికి మాత్రం ముందుగానే ప్లానింగ్ ఉండాలని సూచిస్తున్నారు. 

వచ్చే సంక్రాంతికి ఇంకా దాదాపు ఆరువారాలపైగా సమయం ఉంది. ఇప్పటికే రైళ్లలో రిజర్వేషన్లు భర్తీ అయిపోయాయి. చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్టు 500 కు పైగా ఉందంటే ఆశ్చర్య పోవాల్సిందే. గోదావరి, నారాయణాద్రి, శబరి, పద్మావతి ఎక్స్ప్రెస్ లలో ఇప్పటికే రిజర్వేషన్లు నిండిపోయాయి. ముఖ్యంగా 2026 జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఫుల్ డిమాండ్ ఉంది. పండగ సమయంలో తెలంగాణ ఏపీలోని ఆర్టీసీ సర్వీసులు ప్రత్యేక బస్సులు నడుపుతాయి.

రైళ్లలో ఖాళీ లేకపోవడంతో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ప్రైవేటు బస్సు సర్వీసులు ఆ సమయంలో అధిక ధరలు వసూలు చేస్తూ ఉంటారు. విమాన సర్వీసులో కూడా 10, 11, 13 తేదీల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ప్రైవేట్ విమాన సర్వీసులు టికెట్ ధరలు పెంచేశాయి. హైదరాబాదు రాజమండ్రి విమాన సర్వీ సు సాధారణ రోజుల్లో 5000 లోపే ఉండగా.. సంక్రాంతి సమయంలో రూ.10000 కు పెంచేశారు. 

ఎంత కష్టమైనా ఖర్చైనా పండుగకు సొంత ఊరికి వెళ్లి రావాల్సిందే. ఉన్నత వర్గాల వారు, ఏదోరకంగా తమ గ్రామాలకు వెళ్ళిపోతారు. సామాన్య మధ్యతరగతి వారికి సంక్రాంతి ప్రయాణం భారంగా మారనుంది. దీంతో ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్లాలని సూచిస్తున్నారు.

This post was last modified on November 23, 2025 12:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆయ‌నో మ‌ర్రి చెట్టు: టీడీపీ కామెంట్‌.. !

కొంద‌రు నాయ‌కులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా స‌హ‌క‌రిస్తారు. ఇది ఎక్క‌డైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో…

5 hours ago

ఒకేసారి 2 స‌మ‌స్య‌లు.. చంద్ర‌బాబు సీరియ‌స్ డెసిష‌న్‌!

ఏపీలో ఒకేసారి రెండు కీల‌క స‌మ‌స్య‌లు రాష్ట్రంలో అల‌జ‌డి రేపుతున్నాయి. ఈ రెండు కూడా సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాలు…

6 hours ago

భారత్ భారీ విజయం.. కానీ…

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వేపై 72 పరుగుల…

6 hours ago

కుంభకోణంలో ఈ అవినాష్ రెడ్డి ఎవరు?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం అక్ర‌మాల‌కు సంబంధించి ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు తాజాగా మ‌రో…

8 hours ago

‘నీటి’ రాజకీయాలకు చంద్రబాబు నో!!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి స‌మ‌స్య‌ను రాజకీయం చేయ‌ద‌ల్చుకోలేద‌ని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు…

10 hours ago

`లెస్స‌న్`పై నిప్పులు చెరిగిన సుప్రీం… అసలేంటిది?

కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఎన్ సీఈఆర్‌టీ సంస్థ‌.. 8వ త‌ర‌గ‌తి పాఠ్య పుస్త‌కంలో కొత్తగా చేర్చిన ఓ పాఠం దేశాన్ని…

10 hours ago