Trends

దుబాయ్ తేజస్ ప్రమాదం.. ఎవరీ నమాంశ్‌ స్యాల్?

దుబాయ్ ఎయిర్ షోలో ఊహించని విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారత్ గర్వంగా ప్రదర్శించిన ‘తేజస్’ యుద్ధ విమానం విన్యాసాలు చేస్తూ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వేల అడుగుల ఎత్తులో సాహసోపేతమైన విన్యాసాలు చేస్తుండగా, క్షణాల్లోనే విమానం అదుపు తప్పి నేలకూలింది. దురదృష్టవశాత్తూ, పైలట్ ఎజెక్ట్ అయ్యే అవకాశం కూడా దక్కలేదు.

అసలు ఎవరీ నమాంశ్‌ స్యాల్?

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా, పటియాల్కర్ గ్రామానికి చెందిన నమన్ష్ వయసు 34 ఏళ్లు. చిన్నప్పటి నుంచే దేశ సేవ చేయాలనే తపనతో సైనిక్ స్కూల్‌లో చదివారు. అంచెలంచెలుగా ఎదిగి వింగ్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం స్క్వాడ్రన్ లీడర్‌గా ఉన్న ఆయనకు త్వరలోనే ప్రమోషన్ కూడా రాబోతోందని బంధువులు చెబుతున్నారు. కానీ, అంతలోనే విధి చిన్నచూపు చూసింది.

నమాంశ్‌ కుటుంబం మొత్తం దేశ సేవకే అంకితమైంది. ఆయన భార్య కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఆఫీసరే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె కోల్‌కతాలో ఉన్నారు. వీరికి ఆరేళ్ల చిన్న పాప ఉంది. ఇక నమాంశ్‌ తండ్రి జగన్నాథ్ స్యాల్ కూడా గతంలో ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత ప్రిన్సిపాల్‌గా సేవలు అందించారు. కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు ప్రస్తుతం తమిళనాడులోని సూలూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నెగటివ్ జి మ్యాన్యువర్’ అనే అత్యంత క్లిష్టమైన విన్యాసం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. తక్కువ ఎత్తులో విమానాన్ని నియంత్రించలేకపోవడంతో, వేగంగా వచ్చి నేలను ఢీకొట్టింది. ఇంపాక్ట్ జరగడానికి కొన్ని క్షణాల ముందు విమానం లెవల్‌గానే ఉన్నా, వర్టికల్ స్పీడ్ ఎక్కువగా ఉండటంతో ప్రమాదాన్ని నివారించలేకపోయారు. దేశ రక్షణ కోసం, దేశ కీర్తిని పెంచడం కోసం ప్రాణాలర్పించిన ఈ వీర సైనికుడి మరణం పట్ల యావత్ దేశం కన్నీటి వీడ్కోలు పలుకుతోంది.

This post was last modified on November 22, 2025 11:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

26 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

39 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago