తొమ్మిదేళ్లు సంబంధంలో ఉండి, పెళ్లికి నిరాకరించాడంటూ ఓ యువకుడిపై నమోదైన కేసును కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు – తిరునెల్వేలికి చెందిన దేవా విజయ్ తాను కాలేజీ రోజుల నుండి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నామని ఓ యువతి తెలిపింది. పెళ్లి చేసుకుంటానని తనతో లైంగిక సంబంధంలో ఉండి, తర్వాత నిరాకరించాడని ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని మద్రాస్ హైకోర్టులో దేవా విజయ్ పిటిషన్ వేశాడు. విచారణ జరిపిన హైకోర్టు పెళ్లి చేసుకుంటానని చెప్పి విజయ్ మోసం చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఇద్దరు ప్రేమలో పడి, శారీరకంగా కలిశాక సమస్యలు ఏర్పడితే క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదని వ్యాఖ్యలు చేసింది.
ఇద్దరి మధ్య శారీరక బంధం ప్రేమ వల్ల ఏర్పడిందా, వివాహం కోసం చూశారా, కేవలం ఆనందం కోసమే జరిగిందా అనేది వారికి మాత్రమే తెలుసంటూ, ఇలాంటి విషయాల్లో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడం అసాధ్యమంటూ కేసును కొట్టివేసింది. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను కోర్టులు విస్మరించలేవని వెల్లడించింది. బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెట్టడం సరికాదంటూ పేర్కొంది.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…