తొమ్మిదేళ్లు సంబంధంలో ఉండి, పెళ్లికి నిరాకరించాడంటూ ఓ యువకుడిపై నమోదైన కేసును కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు – తిరునెల్వేలికి చెందిన దేవా విజయ్ తాను కాలేజీ రోజుల నుండి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నామని ఓ యువతి తెలిపింది. పెళ్లి చేసుకుంటానని తనతో లైంగిక సంబంధంలో ఉండి, తర్వాత నిరాకరించాడని ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని మద్రాస్ హైకోర్టులో దేవా విజయ్ పిటిషన్ వేశాడు. విచారణ జరిపిన హైకోర్టు పెళ్లి చేసుకుంటానని చెప్పి విజయ్ మోసం చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఇద్దరు ప్రేమలో పడి, శారీరకంగా కలిశాక సమస్యలు ఏర్పడితే క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదని వ్యాఖ్యలు చేసింది.
ఇద్దరి మధ్య శారీరక బంధం ప్రేమ వల్ల ఏర్పడిందా, వివాహం కోసం చూశారా, కేవలం ఆనందం కోసమే జరిగిందా అనేది వారికి మాత్రమే తెలుసంటూ, ఇలాంటి విషయాల్లో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడం అసాధ్యమంటూ కేసును కొట్టివేసింది. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను కోర్టులు విస్మరించలేవని వెల్లడించింది. బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెట్టడం సరికాదంటూ పేర్కొంది.
This post was last modified on November 19, 2025 10:50 am
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…