సౌదీ అరేబియాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబంలో 8 మంది మృతిని చెందగా వారిలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతని పేరు షేక్ అబ్దుల్ షోయబ్. ప్రమాద సమయంలో అతను బస్సు డ్రైవర్ సమీపంలో కూర్చున్నాడు. షోయబ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మక్కా నుంచి మదీనాకు యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 46 మందితో ప్రయాణిస్తున్న ఆ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో 45 మంది మరణించారు.
ప్రముఖుల దిగ్ర్భాంతి
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని అధికారులకు సీఎం సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో తన సంతాపాన్ని తెలిపారు. సౌదీ అరేబియాలో జరిగిన దారుణ ప్రమాదంలో ఉమ్రా యాత్రకు వెళ్లిన తెలంగాణకు చెందిన వారు ప్రాణాలు కోల్పోయిన విషాద వార్త హృదయాన్ని కలచివేసిందన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. సౌదీ అరేబియా దేశంలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు దుర్మరణం చెందడం బాధాకరం అన్నారు. మృతి చెందిన వారిలో అత్యధిక మంది హైదరాబాద్ కు చెందిన ముస్లిం యాత్రికులు ఉన్నట్లు తెలిసిందన్నారు. వారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…