Trends

సౌదీలో ఘోరం… బస్సులో 42 మంది భారతీయులు సజీవ దహనం!

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో దాదాపు 42 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.

మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా.. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సులో ఉన్న యాత్రికులు నిద్రలో ఉండడంతో అంతా అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం.

మృతుల్లో 20 మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. బదర్ మదీనా మధ్య ముషారఫత్ ప్రాంతంలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

కొంత మంది తీవ్ర గాయాలతో మదీనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈ యాత్రికులు స్థానిక ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఏర్పాటు చేసిన ఉమ్రా ప్యాకేజీలో భాగంగా మక్కా వెళ్ళి మదీనాకు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. చాలామంది కుటుంబాలతో కలిసి వెళ్లారు. మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి

This post was last modified on November 17, 2025 10:29 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

26 minutes ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

1 hour ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

1 hour ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago