Trends

సౌదీలో ఘోరం… బస్సులో 42 మంది భారతీయులు సజీవ దహనం!

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో దాదాపు 42 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.

మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా.. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సులో ఉన్న యాత్రికులు నిద్రలో ఉండడంతో అంతా అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం.

మృతుల్లో 20 మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. బదర్ మదీనా మధ్య ముషారఫత్ ప్రాంతంలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

కొంత మంది తీవ్ర గాయాలతో మదీనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈ యాత్రికులు స్థానిక ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఏర్పాటు చేసిన ఉమ్రా ప్యాకేజీలో భాగంగా మక్కా వెళ్ళి మదీనాకు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. చాలామంది కుటుంబాలతో కలిసి వెళ్లారు. మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి

This post was last modified on November 17, 2025 10:29 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

57 minutes ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

2 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

2 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

2 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

4 hours ago

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

4 hours ago