Trends

6 ఏళ్ల పోరాటం.. పరిహారంగా రూ.317 కోట్లు

ఆరేళ్ల న్యాయ పోరాటం, ఒక గ్లోబల్ విమానయాన దిగ్గజంతో యుద్ధం, చివరకు దిమ్మతిరిగే విజయం. ఇది 2019 విమాన ప్రమాదంలో చనిపోయిన శిఖా గార్గ్ కుటుంబం సాధించిన విజయం. బోయింగ్ 737 MAX విమాన డిజైన్ లోపం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆ కుటుంబం చేసిన పోరాటానికి, అమెరికాలోని షికాగో ఫెడరల్ కోర్టు రూ. 317 కోట్లు (35.85 మిలియన్ డాలర్లు) పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

అసలు ఎవరీ శిఖా గార్గ్?

2019, మార్చిలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం (బోయింగ్ 737 MAX) కూలిపోయిన ఘటనలో 150 మందికి పైగా చనిపోయారు. వారిలో శిఖా గార్గ్ ఒకరు. ఆమె ఐక్యరాజ్యసమితి (UN)లో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ, పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. యూఎన్ ఎన్విరాన్‌మెంట్ అసెంబ్లీ మీటింగ్‌లో పాల్గొనడానికి నైరోబీ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. భారతీయ సంప్రదాయాలంటే ఎంతో ఇష్టపడే శిఖ, ఆ రోజు చీరకట్టులోనే విమానం ఎక్కారని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు.

ఈ ప్రమాదానికి 5 నెలల ముందే ఇండోనేసియాలో మరో బోయింగ్ 737 MAX విమానం కూలిపోయింది. ఈ రెండు ప్రమాదాల్లో కలిపి 340 మంది మరణించారు. దీనికి కారణం విమానం మోడల్ డిజైన్‌లో ఉన్న తీవ్రమైన లోపమే. ఈ భయంకరమైన లోపం గురించి బోయింగ్ సంస్థ ప్రజలను హెచ్చరించడంలో విఫలమైందని శిఖ కుటుంబం ఆరోపించింది. చాలా మంది బాధితులు పరిహారం తీసుకుని సెటిల్ అయినా, శిఖ కుటుంబం మాత్రం బోయింగ్‌ను కోర్టుకీడ్చింది.

ఈ కేసులో ఆరేళ్లపాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. విమాన తయారీ సంస్థ నిర్లక్ష్యం వల్లే అమాయకులు చనిపోయారని శిఖ కుటుంబం తరఫు న్యాయవాదులు బలంగా వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన షికాగో ఫెడరల్ జ్యూరీ, శిఖ కుటుంబానికి నష్టపరిహారంగా రూ. 317 కోట్లు చెల్లించాలని బోయింగ్‌ను ఆదేశించింది. ఈ రెండు వరుస ప్రమాదాల తర్వాతే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేగింది. అన్ని దేశాలూ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కార్యకలాపాలను వెంటనే నిలిపివేశాయి. లోపాలను సరిదిద్దిన తర్వాత, దాదాపు 20 నెలల విరామం అనంతరం 2020 డిసెంబర్‌లో ఈ విమానాలు మళ్లీ గాల్లోకి ఎగరడం మొదలుపెట్టాయి.

This post was last modified on November 17, 2025 10:26 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago