Trends

నిజామాబాద్‌లో ఎన్‌కౌంట‌ర్‌: రియాజ్ హ‌తం

తెలంగాణ‌లో దీపావ‌ళి వేళ తీవ్ర సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిజామాబాద్‌లో పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో కానిస్టేబుల్‌ను హ‌త్య చేసిన నిందితుడు రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. ఆత్మ ర‌క్ష‌ణ కోసం పోలీసులు ఈ కాల్పులు జ‌రిపినట్టు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి చెప్పారు. ఎన్ కౌంట‌ర్ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తం గా సంచ‌ల‌నం సృష్టించిన నేప‌థ్యంలో డీజీపీ స్పందించారు. నిజామాబాద్‌లోని ఆసుప‌త్రిలో రియాజ్‌ను వైద్య ప‌రీక్ష‌ల కోసం తీసుకువెళ్లామ‌న్నారు.

అయితే.. ఈ స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న ఆర్మ్‌డ్ రిజ‌ర్వ్‌ కానిస్టేబుల్  నుంచి రియాజ్ తుపాకీని లాక్కునే ప్ర‌య‌త్నం చేశాడ‌ని డీజీపీ తెలిపారు. ఈ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన పోలీసుల నుంచి అత‌ను త‌ప్పించు కుని పారిపోయే ప్ర‌య‌త్నం చేయ‌గా.. పోలీసులు ఆత్మ ర‌క్ష‌ణ కోసం కాల్పులు జ‌రిపిన‌ట్టు డీజీపీ తెలిపారు. రియాజ్‌కు నేర చ‌రిత్ర ఉంద‌న్నారు. ఆదివారం.. మ‌రో వ్య‌క్తిపై కూడా అత‌ను హ‌త్యాయ‌త్నం చేసిన‌ట్టు వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉండి ఉండ‌క‌పోతే.. మ‌రింత మంది ప్రాణాల‌కు ముప్పు వ‌చ్చి ఉండేద‌ని డీజీపీ వ్యాఖ్యానించారు.

ఎవ‌రీ రియాజ్‌..

నిజామాబాద్ పట్టణానికి చెందిన మైనారిటీ యువ‌కుడు రియాజ్ జులాయిగా తిరిగేవాడ‌ని పోలీసులు తెలిపారు. గ‌తంలోనే అత‌నిపై 40కి పైగా కేసులు ఉన్నాయి. వాహ‌నాల‌ దొంగ‌త‌నం కేసులో కొంద‌రు వ్య‌క్తుల‌ను ప‌ట్టుకునేందుకు వ‌చ్చిన సీసీ ఎస్ పోలీసుల‌పై రియాజ్ ఈ నెల 17న దాడి చేశాడు. అత‌నిని కూడా అనుమానించి పోలీసులు ప‌ట్టుకుని వెళ్తున్న క్ర‌మంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌పై రియాజ్ దాడి చేసి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.

ఈ ఘ‌ట‌న అనంత‌రం పోలీసులు రియాజ్‌ను అదుపులోకి తీసుకునే క్ర‌మంలో అప్పుడు కూడా వారిపై తిర‌గ‌బ‌డ్డాడు. అయితే.. అతి క‌ష్టం మీద రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గ‌త రాత్రి స్టేష‌న్లోనే ఉంచారు. సోమ‌వారం ఉద‌యం స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం.. కోర్టులో హాజ‌రుప‌ర‌చాల్సి ఉంది. అయితే..ఈ క్ర‌మంలో రియాజ్‌.. పోలీసు తుపాకీని అప‌హ‌రించి వారిపైనే కాల్పులు జ‌రిపే ప్ర‌య‌త్నం చేయ‌డంతో పోలీసులు ఎన్ కౌంట‌ర్ చేశారు.

Kumar

Recent Posts

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

28 minutes ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

3 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

7 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

7 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

9 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

9 hours ago