Trends

స్వామీజీ కోసం కిడ్నీలు ఇస్తామంటున్న సెలబ్రెటీలు

​రాధాకృష్ణుల భక్తితో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శిష్యులను సంపాదించుకున్న ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌ జీ మహరాజ్‌ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఆయనకు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలియడంతో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోనే కాకుండా అంతటా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆయనకు తమ కిడ్నీలు దానం చేస్తామని పలువురు సెలబ్రెటీలు, సాధారణ భక్తులు ముందుకు రావడం వలన ఆయన పేరు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతోంది.

​ప్రేమానంద్‌ జీ మహరాజ్‌ తన ఆరోగ్యం గురించి ఇటీవల స్వయంగా వెల్లడించారు. బిగ్‌బాస్ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్‌తో మాట్లాడే సమయంలో ఆయన “నాకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. నా ఆరోగ్యాన్ని సరిచేయడానికి ఛాన్స్ లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా నేను వెళ్లిపోవాలి” అని చెప్పడం భక్తులలో ఆందోళన పెంచింది. ఆయన ముఖం కొద్దిగా ఉబ్బి కనిపించడం, వాయిస్ వణుకుతుండటం వంటి వీడియోలు ఆయన అనారోగ్య పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి.  

​ప్రేమానంద్‌కు కిడ్నీ దానం చేయడానికి అనేక మంది సెలబ్రెటీలు కూడా ముందుకు వచ్చారు. బాలీవుడ్ నటుడు శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా స్వయంగా వృందావన్‌లోని ఆశ్రమానికి వెళ్లి తమ కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే మహరాజ్ అందుకు నిరాకరించారు. అంతేకాకుండా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ముస్లిం వ్యక్తి, ఆరిఫ్ ఖాన్ చిష్తి కూడా ఈ గురువు హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక అని పేర్కొంటూ, తన కిడ్నీని దానం చేస్తానని లేఖ రాయడం విశేషం. నటుడు అజాజ్ ఖాన్ కూడా ఈయన కోలుకోవాలని కోరుకుంటూ, తన కిడ్నీ దానం చేస్తానని ప్రకటించారు.

​అసలు ఈ ప్రేమానంద్‌ జీ మహరాజ్‌ ఎవరు? 

భక్తులు ఆరాధించే ఈ గురువు అసలు పేరు అనిరుద్ధ కుమార్ పాండే. చిన్నప్పటి నుంచే భక్తి, పూజలపై ఆసక్తి చూపేవారు. గీత పఠనం చేస్తూ, దైవభక్తిలో మునిగిపోయేవారు. ఇదే ఆయనను ఇంటిని వదిలి సన్యాసం స్వీకరించేలా చేసింది. వారణాసికి వెళ్లి అక్కడ చాలా మంది సాధువులతో కలిసి పూజలు, ధ్యానం చేశారు. ​ఒకరోజు ఆయనకు వృందావన్‌కు వెళ్లాలనే ఆలోచన వచ్చింది. అక్కడే ఆయనకు రాధాకృష్ణులపై లోతైన భక్తి భావన మొదలైంది. 

రాధా వల్లభ్ సెక్ట్‌లో చేరి, సాధువు మోహిత్ గోస్వామి నుంచి దీక్ష తీసుకున్న తర్వాతే ఆయన ప్రేమానంద్‌గా మారారు. అక్కడి నుంచి ఆయన తన ప్రవచన యాత్రను మొదలుపెట్టారు.

​ఆయన చెప్పే మాటలు సాధారణ ప్రజలనే కాదు, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వంటి ప్రముఖులను కూడా బాగా ప్రభావితం చేశాయి. చాలా కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహరాజ్ తరచూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మార్నింగ్ వాక్‌లను కూడా రద్దు చేసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు.

This post was last modified on October 16, 2025 6:52 am

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

2 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

3 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago