Trends

రెండు ‘యాప్‌’లు.. బోలెడు అద్భుతాలు!

తెలివి ఎవరి సొంతం కాదు అన్నట్టుగా మన వారిలోనూ మంచి మంచి ఆలోచనలు ఉండడంతో పాటు దేశాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఆలోచనలు చేయగల యువత ఉన్నారని మరోసారి నిరూపితం అవుతుంది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు సృష్టించిన రెండు యాప్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచడంతోపాటు చర్చకు కూడా దారితీసాయి. ఇటీవల సుప్రీంకోర్టు సైతం కీలకమైన ‘అర‌ట్టై’ యాప్‌ను ప్రమోట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించింది.

నిజానికి సుప్రీంకోర్టు ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీచ‌ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా తమిళనాడు లోని యువకులు సృష్టించిన ‘అర‌ట్టై’ యాప్‌.. వాట్సాప్ ఫీచర్ల కన్నా ఎక్కువ ఫీచర్లను అందించడంతోపాటు వినియోగదారులకు సులభంగా చేరువైంది. ఈ నేపద్యంలో ఇది ఎక్కువమందికి ప్రయోజనకరంగా మారుతోంది అన్నది సర్వత్ర వినిపిస్తున్న మాట. అంతే కాదు వాట్సాప్ నుంచి త్వరలోనే ఇది రికార్డు సృష్టిస్తుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.

వాట్సాప్ లో ఉన్న ఫ్యూచర్ లే ఇందులో కూడా ఉన్నాయి. ఫోటోలు, వీడియోలు, సందేశాలు, ఫోన్ కాల్స్ ఇలా అన్ని రకాలుగా ఇప్పుడు వేగంగా వినియోగదారులకు చేరువవుతోంది. ఈ యాప్ గురించి గత కొన్ని రోజులుగా చర‌చ్చ‌నడుస్తున్న క్రమంలో ఇప్పుడు తాజాగా మరో యాప్ వెలుగులోకి వచ్చింది. ఇది కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తి సృష్టించారన్నది ఆసక్తిగా మారింది. కడలూరు జిల్లా చిదంబరం ప్రాంతానికి చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి రూపొందించిన ‘జారోజ్’ యాప్ ఇప్పుడు తమిళనాడు సహా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాసులను సైతం ముగ్ధులను చేస్తోంది.

ఈ యాప్ ద్వారా క్షణాల్లోనే ఆహార పదార్థాలను ఆర్డర్ పెట్టుకోవడం వాటిని తెప్పించుకునే సౌలభ్యం ఉంది. ఇప్పటివరకు జొమాటో, స్విగ్గి వంటి యాపుల ద్వారా ఉదయం టిఫిన్ నుంచి అర్ధరాత్రి తెల్లవారుజామున వరకు కూడా ఆహార డెలివరీలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా తమిళనాడుకు చెందిన రాంప్రసాద్ రూపొందించిన జారోజ్ యాప్ మరింత ఎక్కువగా వినియోగదారులకు చేరువవుతోంది.

దీనికి ప్రధాన కారణం జొమాటో, స్విగ్గిలు ఇటీవల జిఎస్టితో పాటు రుసుములు కూడా పెంచారు. ఇది హోటల్ యజమానులకు అదే విధంగా వినియోగదారులకు కూడా ఇబ్బందికరంగా మారింది. ధరలు పెంచితే వినియోదారులు దూరమవుతారని హోటల్ యజమానులు భావిస్తున్నారు. ధరలు పెంచకపోతే డెలివరీ కష్టమని స్విగ్గి జొమాటోలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కొన్నాళ్లుగా వివాదంగా నడుస్తోంది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన రాంప్రసాద్ సృష్టించిన జారోజ్ యాప్ తమిళనాడు వాసులకు చేరువైంది.

ప్రస్తుతం ఇది ఐదు జిల్లాలకు విస్తరించింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ యాప్ మరింత మందికి చేరువవ‌టం ఖాయంగా కనిపిస్తుంది. అటువైపు అర‌ట్టై మ‌రోవైపు జారోజ్ యాప్ లు కూడా స్వదేశీవి కావడం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం విశేషం. ఏదేమైనా ఇప్పటివరకు విదేశాల కు చెందిన యాప్‌లపై ఆధారపడిన పరిస్థితుల నుంచి స్వదేశీ పరంగా యాప్‌లు రూపొందడం అవి చేరువ కావడం విశేషం.

This post was last modified on October 14, 2025 10:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

21 minutes ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

1 hour ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

4 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

4 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

7 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

9 hours ago