Trends

కుల వివ‌క్ష‌కు ఏపీ ఐపీఎస్ `బ‌లి`.. దేశాన్ని కుదిపేస్తున్న `పూర‌ణ్‌` ఇన్సిడెంట్‌!

ఆయ‌న ఐపీఎస్ అధికారి. పైగా ఏపీకి చెందిన వ్య‌క్తి. తాజాగా ఈ నెల 7న ఆయ‌న త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దీనికి కార‌ణం.. ప‌ని వ‌త్తిడి, మానసిక స్థితి స‌రిగా లేద‌ని తొలుత రోజు రోజంతా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ.. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న రాసిన 8 పేజీల సూసైడ్ నోట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో ఏకంగా జిల్లా ఎస్పీని స‌స్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం దేశంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం కావ‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రు?  ఏం జ‌రిగింది?

ఏపీకి చెందిన పి. పూర‌ణ్‌కుమార్‌.. ఇంజ‌నీరింగ్ చ‌దివారు. అఖిల భార‌త స‌ర్వీసు ప‌రీక్ష‌లు రాసి.. 2001లో ఐపీఎస్‌కు సెల‌క్ట్ అయ్యారు. అయితే.. ఆయన ఏపీకి చెందిన వ్య‌క్తే అయినా.. హ‌రియాణా కోటాలో ఎంపిక కావ‌డంతో ఆ రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందారు. అదేస‌మ‌యంలో మ‌రో ఐఏఎస్ అధికారి అమ్నీత్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇరువురు కూడా రోహ్‌త‌క్ జిల్లాలోనే విధులు నిర్వ‌హిస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఈ నెల 7న త‌న నివాసంలోనే పూర‌ణ్‌కుమార్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

తొలుత ప‌ని ఒత్తిడి, రాజ‌కీయాలే కార‌ణ‌మ‌ని అనుకున్నా.. త‌ర్వాత కొన్ని గంట‌ల‌కు 8 పేజీల సూసైడ్ లేఖ ల‌భించింది. దీనిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన అధికారులు నిజాలు నిర్ధారించుకున్నారు. ఈలోగా పూర‌ణ్ కుమార్ స‌తీమ‌ణి, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి.. అమ్నీత్‌.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న భ‌ర్త మ‌ర‌ణం వెనుక‌.. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారులు ఉన్నార‌ని, వారి వేధింపులు, వివ‌క్ష కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని వివ‌రించారు. కానీ, పోలీసులు ఎవ‌రూ స్పందించ‌లేదు. క‌నీసం కేసు కూడా క‌ట్ట‌లేదు.

ఈ నేప‌థ్యంలో తాజా సూసైడ్ నోట్ వెలుగులోకి వ‌చ్చింది. దీనిలో పూర‌ణ్ కుమార్ ఆరోప‌ణ‌లు చేసిన వారిని త‌క్ష‌ణ‌మే ఉద్యోగాల నుంచి తొల‌గించ‌గా.. ఎస్పీని మాత్రం సస్పెన్ష‌న్‌తో స‌రిపుచ్చారు. ఇక‌, ఈ సూసైడ్ నోట్‌లో పూర‌ణ్ కుమార్ సంచ‌ల‌న విష‌యాలు రాశారు. కులం ఆధారంగా, మ‌తం ఆధారంగా తాను వివ‌క్ష‌కు గుర‌య్యాన‌ని చెప్పారు. ఎప్పుడో రావాల్సిన ప్ర‌మోష‌న్‌ను కూడా నిలువ‌రించి.. ద‌యాధ ర్మానికి ఇస్తున్న‌ట్టుగా వేధించార‌ని తెలిపారు. ప‌దే ప‌దే కులం పేరుతో వివ‌క్ష‌కు గుర‌య్యాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో సుమారు 8 మంది పేర్ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. దీని ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న స‌తీమ‌ణి డిమాండ్ చేశారు. 

This post was last modified on October 11, 2025 6:19 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Puran Kumar

Recent Posts

కేసీఆర్‌ కావాల‌నే మౌనంగా ఉన్నారా?

తెలంగాణ రాష్ట్ర సేన‌.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన క‌విత వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.…

1 hour ago

దాగుడుమూతల దృశ్యానికి మోక్షం దక్కింది

మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…

2 hours ago

మనసు మారిందా వీరభద్రుడా

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…

3 hours ago

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

3 hours ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

5 hours ago

చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు

వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…

5 hours ago