Trends

కుల వివ‌క్ష‌కు ఏపీ ఐపీఎస్ `బ‌లి`.. దేశాన్ని కుదిపేస్తున్న `పూర‌ణ్‌` ఇన్సిడెంట్‌!

ఆయ‌న ఐపీఎస్ అధికారి. పైగా ఏపీకి చెందిన వ్య‌క్తి. తాజాగా ఈ నెల 7న ఆయ‌న త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దీనికి కార‌ణం.. ప‌ని వ‌త్తిడి, మానసిక స్థితి స‌రిగా లేద‌ని తొలుత రోజు రోజంతా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ.. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న రాసిన 8 పేజీల సూసైడ్ నోట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో ఏకంగా జిల్లా ఎస్పీని స‌స్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం దేశంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం కావ‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రు?  ఏం జ‌రిగింది?

ఏపీకి చెందిన పి. పూర‌ణ్‌కుమార్‌.. ఇంజ‌నీరింగ్ చ‌దివారు. అఖిల భార‌త స‌ర్వీసు ప‌రీక్ష‌లు రాసి.. 2001లో ఐపీఎస్‌కు సెల‌క్ట్ అయ్యారు. అయితే.. ఆయన ఏపీకి చెందిన వ్య‌క్తే అయినా.. హ‌రియాణా కోటాలో ఎంపిక కావ‌డంతో ఆ రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందారు. అదేస‌మ‌యంలో మ‌రో ఐఏఎస్ అధికారి అమ్నీత్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇరువురు కూడా రోహ్‌త‌క్ జిల్లాలోనే విధులు నిర్వ‌హిస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఈ నెల 7న త‌న నివాసంలోనే పూర‌ణ్‌కుమార్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

తొలుత ప‌ని ఒత్తిడి, రాజ‌కీయాలే కార‌ణ‌మ‌ని అనుకున్నా.. త‌ర్వాత కొన్ని గంట‌ల‌కు 8 పేజీల సూసైడ్ లేఖ ల‌భించింది. దీనిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన అధికారులు నిజాలు నిర్ధారించుకున్నారు. ఈలోగా పూర‌ణ్ కుమార్ స‌తీమ‌ణి, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి.. అమ్నీత్‌.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న భ‌ర్త మ‌ర‌ణం వెనుక‌.. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారులు ఉన్నార‌ని, వారి వేధింపులు, వివ‌క్ష కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని వివ‌రించారు. కానీ, పోలీసులు ఎవ‌రూ స్పందించ‌లేదు. క‌నీసం కేసు కూడా క‌ట్ట‌లేదు.

ఈ నేప‌థ్యంలో తాజా సూసైడ్ నోట్ వెలుగులోకి వ‌చ్చింది. దీనిలో పూర‌ణ్ కుమార్ ఆరోప‌ణ‌లు చేసిన వారిని త‌క్ష‌ణ‌మే ఉద్యోగాల నుంచి తొల‌గించ‌గా.. ఎస్పీని మాత్రం సస్పెన్ష‌న్‌తో స‌రిపుచ్చారు. ఇక‌, ఈ సూసైడ్ నోట్‌లో పూర‌ణ్ కుమార్ సంచ‌ల‌న విష‌యాలు రాశారు. కులం ఆధారంగా, మ‌తం ఆధారంగా తాను వివ‌క్ష‌కు గుర‌య్యాన‌ని చెప్పారు. ఎప్పుడో రావాల్సిన ప్ర‌మోష‌న్‌ను కూడా నిలువ‌రించి.. ద‌యాధ ర్మానికి ఇస్తున్న‌ట్టుగా వేధించార‌ని తెలిపారు. ప‌దే ప‌దే కులం పేరుతో వివ‌క్ష‌కు గుర‌య్యాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో సుమారు 8 మంది పేర్ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. దీని ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న స‌తీమ‌ణి డిమాండ్ చేశారు. 

This post was last modified on October 11, 2025 6:19 pm

Share

Recent Posts

బాధితులను వదిలేసి నిందితులకు పరమార్శేంటి జగన్?

శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును జైల్లో ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అప్ప‌ల‌రాజును…

7 hours ago

న‌న్ను రాజీనామా కోరే హ‌క్కు ఎవ‌రికీ లేదు: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల‌పైనా తాను ముఖ్య‌మంత్రిని కాలేద‌ని.. 4 కోట్ల మంది ఓట‌ర్లు ఓటేసి త‌న‌ను గెలిపించుకున్నార‌ని.. వారి ఆశీర్వాదం,…

7 hours ago

‘పిల్లలను హాస్టల్లో వేస్తే… వాళ్ళు పెద్దలను ఓల్డేజ్ హోమ్ లలో వేస్తారు’

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…

8 hours ago

చంద్రబాబు అన్నం తింటున్నాడా.. గడ్డి తింటున్నాడా: జగన్

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…

9 hours ago

ప్రమోషన్లకు పిలవలేదని హర్టయిన హీరోయిన్

తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…

10 hours ago

ఆదిపురుష్ పోలిక ఇప్పుడు అనవసరం

ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…

11 hours ago