మధ్యప్రదేశ్లోని చిన్నద్వారా జిల్లాలో పిల్లల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సిరప్ వాడిన తర్వాత 11 మంది చిన్నారులు మరణించడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సదరు మందును సూచించిన పీడియాట్రిషన్ డాక్టర్ ప్రవీణ్ సోనీని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆయన ప్రభుత్వ వైద్యుడే అయినప్పటికీ తన ప్రైవేట్ క్లినిక్లో పిల్లలకు ఈ కఫ్ సిరప్ వాడమని సూచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. మరణించిన పిల్లల్లో ఎక్కువమంది సోనీ ప్రైవేట్ క్లినిక్లోనే చికిత్స పొందినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రీశాన్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీపై కూడా కేసు నమోదు చేశారు.
ఇదే కంపెనీ కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ తయారీదారు. నమూనాలను పరిశీలించిన అధికారులు, ఆ సిరప్లో 48.6 శాతం డైఇథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత విషపూరిత పదార్థం ఉన్నట్లు గుర్తించారు. దీనివల్లే పిల్లల కిడ్నీలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. చెన్నై డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లో పరీక్షించిన తర్వాత తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ఈ మందును “నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ”గా ప్రకటించింది.
దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్ విక్రయాన్ని నిషేధించింది. అదనంగా, అదే కంపెనీ తయారు చేసిన నెక్ట్రో-డీఎస్ కఫ్ సిరప్ విక్రయాన్నీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ రెండు మందులపై మరిన్ని పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. పిల్లల కుటుంబాల పరిస్థితి మరింత బాధాకరంగా ఉంది. సెప్టెంబర్ ప్రారంభంలో కొందరు పిల్లలకు జలుబు, జ్వరం వచ్చిన తర్వాత ఈ మందు వాడారు. మొదట బాగానే కనిపించినా కొద్ది రోజులకే మూత్ర విసర్జన తగ్గడం, కిడ్నీ ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల్లో డైఇథిలీన్ గ్లైకాల్ వల్లే కిడ్నీలు పాడైనట్లు నిర్ధారించబడింది. పిల్లల మరణాలతో ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
This post was last modified on October 5, 2025 2:06 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…