Trends

దగ్గుమందుతో మరణాలు.. సర్కార్ సీరియస్ స్టెప్!

మధ్యప్రదేశ్‌లోని చిన్నద్వారా జిల్లాలో పిల్లల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్‌ కఫ్‌ సిరప్‌ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సిరప్‌ వాడిన తర్వాత 11 మంది చిన్నారులు మరణించడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సదరు మందును సూచించిన పీడియాట్రిషన్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ సోనీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఆయన ప్రభుత్వ వైద్యుడే అయినప్పటికీ తన ప్రైవేట్‌ క్లినిక్‌లో పిల్లలకు ఈ కఫ్‌ సిరప్‌ వాడమని సూచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది. మరణించిన పిల్లల్లో ఎక్కువమంది సోనీ ప్రైవేట్‌ క్లినిక్‌లోనే చికిత్స పొందినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రీశాన్‌ ఫార్మాస్యూటికల్స్‌ అనే కంపెనీపై కూడా కేసు నమోదు చేశారు. 

ఇదే కంపెనీ కోల్డ్రిఫ్‌ కఫ్‌ సిరప్‌ తయారీదారు. నమూనాలను పరిశీలించిన అధికారులు, ఆ సిరప్‌లో 48.6 శాతం డైఇథిలీన్‌ గ్లైకాల్‌ అనే అత్యంత విషపూరిత పదార్థం ఉన్నట్లు గుర్తించారు. దీనివల్లే పిల్లల కిడ్నీలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. చెన్నై డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత తమిళనాడు డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టరేట్‌ ఈ మందును “నాట్‌ ఆఫ్‌ స్టాండర్డ్‌ క్వాలిటీ”గా ప్రకటించింది. 

దీంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కోల్డ్రిఫ్ విక్రయాన్ని నిషేధించింది. అదనంగా, అదే కంపెనీ తయారు చేసిన నెక్ట్రో-డీఎస్‌ కఫ్‌ సిరప్‌ విక్రయాన్నీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ రెండు మందులపై మరిన్ని పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. పిల్లల కుటుంబాల పరిస్థితి మరింత బాధాకరంగా ఉంది. సెప్టెంబర్‌ ప్రారంభంలో కొందరు పిల్లలకు జలుబు, జ్వరం వచ్చిన తర్వాత ఈ మందు వాడారు. మొదట బాగానే కనిపించినా కొద్ది రోజులకే మూత్ర విసర్జన తగ్గడం, కిడ్నీ ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల్లో డైఇథిలీన్‌ గ్లైకాల్‌ వల్లే కిడ్నీలు పాడైనట్లు నిర్ధారించబడింది. పిల్లల మరణాలతో ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

This post was last modified on October 5, 2025 2:06 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Syrup Deaths

Recent Posts

అనిల్ సర్ప్రైజ్… దగ్గుబాటి + నందమూరి

దర్శకుడు అనిల్ రావిపూడి అందరి అంచనాలకు ఝలక్ ఇస్తూ తన కొత్త సినిమా ప్రకటన ఇచ్చేశారు. హీరో వెంకటేష్ తో…

3 hours ago

కొలిక్కి రాబోతున్న విశ్వంభర వ్యవహారం

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎంజాయ్ చేశాక మెగాస్టార్ ఫ్యాన్స్ దృష్టి క్రమంగా విశ్వంభర వైపు వెళ్తోంది.…

3 hours ago

రామ్ అయోమయం తీరేది ఎప్పుడు

ఎనర్జినే ఇంటి పేరుగా మార్చుకున్న రామ్ కు గత ఏడాది ఆంధ్రకింగ్ తాలూకా ఊహించని షాక్ ఇచ్చింది. కంటెంట్ బాగానే…

5 hours ago

వివాదాస్పద సినిమాకు కోర్టు బ్రేకు

రేపు విడుదల కావాల్సిన కేరళ స్టోరీ 2 హఠాత్తుగా వాయిదా పడింది. పలువురు పిటీషనర్లు వేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న…

7 hours ago

మరో తమిళ స్టార్ తో పూరి మూవీ?

విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ పూర్తి చేసుకుని కొత్త కాంబో కోసం ఎదురు చూస్తున్న టైంలో దర్శకుడు పూరి జగన్నాథ్…

8 hours ago