Trends

ప‌సిడి ధ‌ర.. ప‌ర్సులు పిసికేస్తోంది.. రీజ‌నేంటి?

ప‌సిడి.. బంగారం.. స్వ‌ర్ణం.. పేర్లు ఏవైనా.. ప్రతి ఒక్క‌రూ పండుగ‌ల సీజ‌న్‌లో అంతో ఇంతో కొనుగోలు చేయాల‌ని భావిస్తారు. ముఖ్యంగా కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌ల‌కు అత్త‌మామ‌లు.. పుట్టింటివారు కూడా కానుక‌గా స్వ‌ర్ణాభర‌ణాల‌నే ఇవ్వాల‌ని త‌ల‌పోస్తారు. ఇక‌, ఇళ్ల‌లో జ‌రిగే శుభ‌కార్యాల‌కు కూడా ప‌సిడి ఆభ‌రణాల‌కే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తారు. అలాంటిది.. తాజాగా ప‌సిడి ధ‌ర అమాంతం పైపైకి పెరిగిపోయింది. జీఎస్టీ త‌గ్గింపుతో నిత్యావ‌స‌ర ధ‌ర‌లు దిగి వ‌చ్చినా.. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల స‌మ‌యంలో స‌ర్ణం ధ‌ర స‌ల‌స‌ల‌మంటోంది.

ఎందుకిలా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో స్టాక్ మార్కెట్లు ఎప్పుడు కొలాప్స్ అవుతాయో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రీ ముఖ్యంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఏ రాత్రి ఏ నిర్ణ‌యం తీసుకుంటారో.. ఎవ‌రిపై సుంకాలు బాదేస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు సుర‌క్షి త‌మైన పెట్టుబ‌డుల కోసం చూస్తున్నారు. అలాగ‌ని భూముల‌పై పెట్ట‌డం లేదు. ప్ర‌భుత్వాలు తీసుకునే నిర్ణయాల‌తో త‌మ భూముల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంద‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా 60 శాతం మంది ప్ర‌జ‌లు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అంద‌రికీ విలువైంది.. అంద‌రూ పెట్టుకునేది బంగార‌మే. అంతేకాదు.. బంగారంపై పెట్టుబ‌డులు పెడితే.. ప్ర‌భుత్వాల‌కు కూడా లాభ‌మే. దీనిని గ‌మ‌నించిన ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లు బంగారంపై ఎక్కువ‌గా పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొనుగోళ్ల‌కు భారీ డిమాండ్ పెరిగింది. ఫ‌లితంగా బంగారం ధ‌ర‌లు ఉవ్వెత్తున చెల‌రేగుతున్నాయ‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ద‌శాబ్ద కాలంగా .. బంగారం ధ‌ర పైసా కూడా త‌గ్గ‌లేద‌ని.. ఎప్పటిక‌ప్పుడు పెరుగుతున్నాయ‌ని చెబుతున్నారు. అందుకే బంగారం ధ‌ర‌ల‌కు రెక్కలు మొలిచాయ‌ని అంటున్నారు.

ఈ రోజు ఎంతెంత‌?

+ ఏపీ, తెలంగాణ‌ల్లో ప‌ది గ్రాములు 22 క్యారెంట్ల బంగారం.. 1,08,500(+3% జీఎస్టీ) రూపాయ‌లు

+ ఏపీ, తెలంగాణ‌ల్లో ప‌ది గ్రాములు 24 క్యారెంట్ల బంగారం.. 1,18,500(+3% జీఎస్టీ) రూపాయ‌లు

+ ఏపీ, తెలంగాణ‌ల్లో కిలో వెండి: 1,62,000(+3% జీఎస్టీ) రూపాయ‌లు

కొస‌మెరుపు: దీపావ‌ళి, ధ‌న్‌తేర‌స్ చేరువ అయ్యే మ‌రో 20 రోజుల నాటికి ప‌దిగ్రాముల ఆర్న‌మెంటు బంగారం.. 1,35,000ల‌కు చేరుకునే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

This post was last modified on September 30, 2025 6:19 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago