Trends

ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న ఆ జెట్‌కు వీడ్కోలు

భారత వైమానిక దళానికి ఆరు దశాబ్దాలుగా తోడుగా నిలిచిన మిగ్ 21 జెట్‌కు శుక్రవారం వీడ్కోలు పలికారు. 1963లో సేవలు ప్రారంభించిన ఈ యుద్ధవిమానం ఎన్నో యుద్ధాల్లో భారత గగనతలాన్ని కాపాడింది. పాకిస్థాన్‌తో జరిగిన నాలుగు యుద్ధాల్లోనూ మిగ్ 21 కీలక పాత్ర పోషించింది. తన వేగం, శక్తి, చురుకుదనంతో ఇది దేశ రక్షణలో నిజమైన యోధుడిగా నిలిచింది.

చండీగఢ్‌లో మిగ్ 21 చివరి ఫ్లైట్ నిర్వహించారు. ఎందుకంటే ఇదే ప్రదేశంలో మొదటిసారి ఈ జెట్ భారత వైమానిక దళంలో చేరింది. ఆరు బైసన్ వేరియంట్లు చివరి సారి ఎగిరాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ ఫ్లైట్‌కు వాటర్  కానన్ సెల్యూట్ ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.

1963 నుంచి ఇప్పటివరకు 1,200కుపైగా మిగ్ 21లు భారత వైమానిక దళంలో సేవలందించాయి. యుద్ధం, రక్షణ, గూఢచారి మిషన్లు, పైలట్ శిక్షణ ఇలా అనేక రంగాల్లో ఇవి వాడబడ్డాయి. ఒక దశలో భారత వైమానిక దళాన్ని ‘మిగ్ ఎయిర్ ఫోర్స్’ అని కూడా పిలిచేవారు. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఎన్నో మార్పులు చేసుకుంటూ మిగ్ 21 చాలా కాలం కొనసాగింది. ఇది ఇండో రష్యా రక్షణ సంబంధాల ప్రతీకగా కూడా నిలిచింది.

అయితే చివరి దశలో ఈ విమానానికి ‘ఫ్లయింగ్ కాఫిన్’ అనే ముద్ర పడింది. తరచూ జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం కారణంగా విమర్శలు వచ్చాయి. 2023లో రాజస్థాన్‌లో జరిగిన ఒక ప్రమాదంలో ముగ్గురు గ్రామస్తులు మృతి చెందారు. ఇలాంటి ఘటనల కారణంగా ఓల్డ్ అయ్యిందని ఈ విమానాన్ని రిటైర్ చేయాల్సిన అవసరం వచ్చింది.

అయినా మిగ్ 21 చేసిన సేవలను మరవలేం. ఒకప్పుడు కొత్తగా ఎదుగుతున్న భారత వైమానిక దళానికి ఇది ప్రధాన బలం. ఎన్నో తరాల పైలట్లకు ఇది శిక్షణ ఇచ్చింది. ఇప్పుడిది ఆకాశాన్ని విడిచిపెడుతున్నా, దాని వారసత్వాన్ని తేజస్‌ వంటి స్వదేశీ జెట్లు కొనసాగించనున్నాయి. మిగ్ 21 ఇక ఎగరదు కానీ, భారత రక్షణ చరిత్రలో దీని పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పవచ్చు.

This post was last modified on September 26, 2025 5:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

3 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

6 hours ago