Trends

గ‌ణ‌ప‌తి ‘ల‌డ్డూ’ పాట‌ల‌కు.. ‘ఈడీ’ బ్యాండు!

దేశ‌వ్యాప్తంగా వినాయ‌క‌చ‌వితి ఉత్స‌వాలు శ‌నివారంతో ముగిశాయి. ఆదివారం.. చంద్ర‌గ్ర‌హ‌ణం ఉండడంతో దేశ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన గ‌ణ‌ప‌తి పందిళ్ల నుంచి విఘ్న‌నాయ‌కులు.. నిమ‌జ్జ‌నానికి క‌దిలారు. శ‌నివారం సాయంత్రం నాటికి దాదాపు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ.. నిమ‌జ్జ‌న ఘ‌ట్టాలు ముగియ‌నున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వినాయ‌కుడు ఖ‌ర‌తాబాద్ గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం శ‌నివారం మ‌ధ్యాహ్నం ముగిసింది. ఇలా.. దేశ‌వ్యాప్తంగా గ‌ణ‌ప‌తి భ‌క్తులు భ‌క్తిలో ఓల‌లాడుతున్నారు.

ఇదేస‌మ‌యంలో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల కోసం ప్ర‌త్యేకంగా త‌యారు చేయించిన ల‌డ్డూల‌ను నిర్వాహ‌కులు వేలం వేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా కూడా ఈ వేలం పాట‌లు సాగుతున్నాయి. తాజాగా బాలాపూర్ ల‌డ్డూను ఒక‌రు 35 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇదే హైద‌రాబాద్‌లోని బండ్ల గూడ‌లో ఉన్న విల్లాలో నిర్వ‌హించిన ల‌డ్డూ వేలంలో పాల్గొన్న ఓ వ్య‌క్తి ఏకంగా 2 కోట్ల రూపాయ‌ల‌కు పైగా సొమ్ములు వెచ్చించి.. గ‌ణ‌ప‌తి ల‌డ్డూను ద‌క్కించుకున్నారు.

ముంబైలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో 3 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ల‌డ్డూ వేలం సాగింది. ఇలా.. దేశంలో ల‌క్ష‌ల రూపాయ‌లు వెచ్చించి.. గ‌ణ‌ప‌తి ల‌డ్డూను సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న భ‌క్తులకు తాజాగా ఈడీ షాకిచ్చేందుకు రెడీ అయింది. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను ఆధారంగా చేసుకుని.. ల‌డ్డూల‌ను సొంతం చేసుకున్న‌వారి ఆదాయ‌ప‌న్ను వివ‌రాల‌తోపాటు.. అంత సొమ్ము ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌న్న వివ‌రాల‌ను కూడా రాబ‌ట్టే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు జాతీయ మీడియా పేర్కొంది.

ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌క్క‌ర్లేదు!

కొన్నాళ్ల కింద‌ట క‌ర్ణాట‌క‌లో ఓ వ్య‌క్తి విదేశీ జాతి కుక్క అంటూ.. ఓ శున‌కంతో రోడ్డు మీద‌కు వ‌చ్చాడు. దీని ఖ‌రీదు కోటిరూపాయ‌ల‌ని ప్ర‌చారం చేశాడు. దీంతో ఈడీ అత‌ని ఇంటిపై దాడి చేసిన విష‌యం గుర్తుండే ఉంటుంది. అలానే.. ఇప్పుడు కూడా ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌కుండానే రూ.10 ల‌క్ష‌ల‌కు పైగా వెచ్చించి ల‌డ్డూలు వేలంలో ద‌క్కించుకున్న‌వారిపై త‌నిఖీలు త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా కోట్ల రూపాయ‌లు వెచ్చించడంపై మ‌రింత ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌నుంది.

This post was last modified on September 6, 2025 6:02 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

11 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

4 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

8 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

8 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

9 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

9 hours ago