దేశవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ఆదివారం.. చంద్రగ్రహణం ఉండడంతో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన గణపతి పందిళ్ల నుంచి విఘ్ననాయకులు.. నిమజ్జనానికి కదిలారు. శనివారం సాయంత్రం నాటికి దాదాపు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ.. నిమజ్జన ఘట్టాలు ముగియనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వినాయకుడు ఖరతాబాద్ గణపతి నిమజ్జనం శనివారం మధ్యాహ్నం ముగిసింది. ఇలా.. దేశవ్యాప్తంగా గణపతి భక్తులు భక్తిలో ఓలలాడుతున్నారు.
ఇదేసమయంలో గణపతి ఉత్సవాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన లడ్డూలను నిర్వాహకులు వేలం వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ వేలం పాటలు సాగుతున్నాయి. తాజాగా బాలాపూర్ లడ్డూను ఒకరు 35 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఇక, ఇదే హైదరాబాద్లోని బండ్ల గూడలో ఉన్న విల్లాలో నిర్వహించిన లడ్డూ వేలంలో పాల్గొన్న ఓ వ్యక్తి ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా సొమ్ములు వెచ్చించి.. గణపతి లడ్డూను దక్కించుకున్నారు.
ముంబైలో నిర్వహించిన వేడుకల్లో 3 కోట్ల రూపాయల వరకు లడ్డూ వేలం సాగింది. ఇలా.. దేశంలో లక్షల రూపాయలు వెచ్చించి.. గణపతి లడ్డూను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న భక్తులకు తాజాగా ఈడీ షాకిచ్చేందుకు రెడీ అయింది. మీడియాలో వస్తున్న వార్తలను ఆధారంగా చేసుకుని.. లడ్డూలను సొంతం చేసుకున్నవారి ఆదాయపన్ను వివరాలతోపాటు.. అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలను కూడా రాబట్టే ప్రయత్నంలో ఉన్నట్టు జాతీయ మీడియా పేర్కొంది.
ఎవరూ ఫిర్యాదు చేయక్కర్లేదు!
కొన్నాళ్ల కిందట కర్ణాటకలో ఓ వ్యక్తి విదేశీ జాతి కుక్క అంటూ.. ఓ శునకంతో రోడ్డు మీదకు వచ్చాడు. దీని ఖరీదు కోటిరూపాయలని ప్రచారం చేశాడు. దీంతో ఈడీ అతని ఇంటిపై దాడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అలానే.. ఇప్పుడు కూడా ఎవరూ ఫిర్యాదు చేయకుండానే రూ.10 లక్షలకు పైగా వెచ్చించి లడ్డూలు వేలంలో దక్కించుకున్నవారిపై తనిఖీలు తప్పదని తెలుస్తోంది. ముఖ్యంగా కోట్ల రూపాయలు వెచ్చించడంపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టనుంది.
This post was last modified on September 6, 2025 6:02 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…