బెంగళూరులో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన అందరినీ షాక్కు గురి చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న 41 ఏళ్ల మన్జు ప్రకాశ్ తన ఇంటి వద్ద చెప్పులు వేసుకునే క్రమంలో పాముకాటు బారిన పడ్డాడు. అయితే అతనికి కాలి స్పర్శజ్ఞానం లేకపోవడంతో ప్రమాదాన్ని గుర్తించలేకపోయాడు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయాడు.
ప్రకాశ్ టీసీఎస్లో పని చేస్తున్నాడు. ఆ రోజు ఇంటికి వచ్చి చెప్పులు (crocs) బయటే ఉంచి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు. చెప్పులో దూరిన రక్తపింజర అనే పాము పిల్ల అతన్ని కరిచింది. కానీ అతనికి 2016లో జరిగిన బస్ ప్రమాదం కారణంగా ఒక కాలులో స్పర్శ తగ్గిపోయింది. దీంతో పాముకాటు వేసినా కూడా అతనికి ఏం జరిగిందో తెలియలేదు. కొద్ది సేపటికే అస్వస్థతకు గురై మంచంపై పడిపోయాడు.
కొంతసేపటి తర్వాత ఇంటి వద్దకు వచ్చిన కార్మికుడు చెప్పుల దగ్గర చనిపోయిన పామును చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. ఆందోళన చెందిన వారు ప్రకాశ్ గదికి వెళ్లి చూడగా ఆయన నోటినుంచి నురగ రావడంతోపాటు కాలి వద్ద రక్తస్రావం కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
పాముకాటు గుర్తించలేకపోవడం ఈ ఘటనలో ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. పాము కరిచిన తర్వాత కొంతసేపు అది చెప్పులోనే చిక్కుకుపోయి చనిపోయింది. కాటు వేసిన వాస్తవం తెలిసినప్పటికీ, అప్పటికే ఆలస్యమైంది. ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదై దర్యాప్తు జరుగుతోంది. చెప్పులు వేసే ముందు చెక్ చేయడం అలవాటు చేసుకోవాలని, పాముల కాటుతో ప్రాణాలు దురదృష్టవశాత్తూ ఇలా కోల్పోకుండా ఉండాలనే పోలీసులు సూచనలు చేస్తున్నారు.
This post was last modified on September 1, 2025 7:59 am
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…