Trends

స్పర్శ తెలియక పాము కాటుకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతి

బెంగళూరులో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 41 ఏళ్ల మన్జు ప్రకాశ్‌ తన ఇంటి వద్ద చెప్పులు వేసుకునే క్రమంలో పాముకాటు బారిన పడ్డాడు. అయితే అతనికి కాలి స్పర్శజ్ఞానం లేకపోవడంతో ప్రమాదాన్ని గుర్తించలేకపోయాడు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయాడు.

ప్రకాశ్‌ టీసీఎస్‌లో పని చేస్తున్నాడు. ఆ రోజు ఇంటికి వచ్చి చెప్పులు (crocs) బయటే ఉంచి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు. చెప్పులో దూరిన రక్తపింజర అనే పాము పిల్ల అతన్ని కరిచింది. కానీ అతనికి 2016లో జరిగిన బస్‌ ప్రమాదం కారణంగా ఒక కాలులో స్పర్శ తగ్గిపోయింది. దీంతో పాముకాటు వేసినా కూడా అతనికి ఏం జరిగిందో తెలియలేదు. కొద్ది సేపటికే అస్వస్థతకు గురై మంచంపై పడిపోయాడు.

కొంతసేపటి తర్వాత ఇంటి వద్దకు వచ్చిన కార్మికుడు చెప్పుల దగ్గర చనిపోయిన పామును చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. ఆందోళన చెందిన వారు ప్రకాశ్‌ గదికి వెళ్లి చూడగా ఆయన నోటినుంచి నురగ రావడంతోపాటు కాలి వద్ద రక్తస్రావం కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.

పాముకాటు గుర్తించలేకపోవడం ఈ ఘటనలో ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. పాము కరిచిన తర్వాత కొంతసేపు అది చెప్పులోనే చిక్కుకుపోయి చనిపోయింది. కాటు వేసిన వాస్తవం తెలిసినప్పటికీ, అప్పటికే ఆలస్యమైంది. ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. బన్నేరుఘట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదై దర్యాప్తు జరుగుతోంది. చెప్పులు వేసే ముందు చెక్‌ చేయడం అలవాటు చేసుకోవాలని, పాముల కాటుతో ప్రాణాలు దురదృష్టవశాత్తూ ఇలా కోల్పోకుండా ఉండాలనే పోలీసులు సూచనలు చేస్తున్నారు.

This post was last modified on September 1, 2025 7:59 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

15 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

28 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

6 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

6 hours ago