ప్రతి ఏడాది యాపిల్ కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ చేస్తే టెక్ ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఈసారి కూడా అదే పరిస్థితి. సెప్టెంబర్ 9న జరగబోయే యాపిల్ బిగ్ ఈవెంట్లో ఐఫోన్ 17 సిరీస్ను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. అయితే, ఈసారి ఫోన్లలో భారీ అప్గ్రేడ్లు రాబోతున్నాయనే కారణంగా ధరలు కూడా పెరగనున్నాయన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
లీకైన సమాచారం ప్రకారం, ఐఫోన్ 17 సిరీస్లో నాలుగు మోడల్స్ రాబోతున్నాయి.
ఐఫోన్ 17
ఐఫోన్ 17 ఎయిర్
ఐఫోన్ 17 ప్రో
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్.
గతంలో ఐఫోన్ 16 మోడల్స్తో పోలిస్తే, ఈసారి సుమారు 50 డాలర్ల వరకు పెరుగుదల ఉంటుందని అంచనా. ఇది టెక్ ప్రియుల్లో చర్చనీయాంశమైంది.
అమెరికా మార్కెట్లో లీకైన ధరల ప్రకారం, ఐఫోన్ 17 బేస్ మోడల్ (128జీబీ) ధర $849గా ఉండొచ్చని, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.84,990గా అంచనా వేస్తున్నారు.
ఇక ఐఫోన్ 17 ప్రో మోడల్ ధర $1,049గా ఉండే అవకాశం ఉంది. ఇది సుమారు రూ.1,24,990 అవుతుంది.
టాప్ వేరియంట్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర $1,249 (దాదాపు రూ.1,50,000) వరకు చేరవచ్చని సమాచారం.
యాపిల్ ఇప్పటి వరకు ధరలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, ఈ లీకులు వినియోగదారుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఎందుకంటే, గతంలో కూడా లీకైన ధరలు చాలా సార్లు నిజమయ్యాయి. అదనంగా, ఈ సిరీస్లో కొత్త ఫీచర్లు, మెరుగైన కెమెరా పనితనం, అధునాతన చిప్సెట్ ఉండబోతున్నాయని సమాచారం.
ఫైనల్ గా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న, ఐఫోన్ 17 సిరీస్ లాంచ్కి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో టెక్ ప్రపంచం అంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 9 రాత్రి 10.30 గంటలకు జరిగే ఈవెంట్ను Apple.com, Apple TV ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ధరలు పెరిగినా, ఫీచర్లలో వచ్చే అప్గ్రేడ్ల కారణంగా ఈ ఫోన్లు మరోసారి రికార్డు బుకింగ్స్ సాధిస్తాయన్న అంచనాలు ఉన్నాయి.
This post was last modified on August 29, 2025 1:20 pm
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…