అమెరికాలో వలసదారులకు షాక్ ఇస్తున్న కొత్త బిల్లు చర్చనీయాంశంగా మారింది. ఒకే ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ (DUI) కేసు ఉన్నా, అది ఏళ్ల క్రితం జరిగినదైనా, గ్రీన్కార్డ్ హోల్డర్లు లేదా వీసా కలిగిన వారిని డిపోర్ట్ చేసే అధికారం ఈ బిల్లుతో లభించనుంది. “Protect Our Communities from DUIs Act” అనే ఈ బిల్లు ఇప్పటికే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఆమోదం పొందింది. ప్రస్తుతం ఇది సెనేట్ వద్ద ఉంది.
వైట్హౌస్ కూడా ఈ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఒకసారి చట్టంగా మారితే, అమెరికాలో చదువుతున్న స్టూడెంట్లు, ఉద్యోగాలకు వచ్చిన వారు, గ్రీన్కార్డ్ హోల్డర్లు.. ఎవరైనా పాత DUI కేసుతో బయటకు పంపబడే పరిస్థితి వస్తుంది. న్యాయప్రక్రియ, రీహాబిలిటేషన్ అవకాశాలు లేకుండానే నేరుగా చర్య తీసుకోవడమే ఈ బిల్లులోని కఠిన అంశమని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో వలస కమ్యూనిటీల్లో, ముఖ్యంగా భారతీయులలో ఆందోళన ఎక్కువగా ఉంది. ఎందుకంటే అమెరికాలో ఉన్నత విద్య కోసం, ఉద్యోగాల కోసం ఎక్కువమంది భారతీయులే వెళ్తారు. గ్రీన్కార్డ్ పొందిన వారిలో కూడా భారతీయులే అధికం. చిన్నతప్పిదంగా పరిగణించిన DUI కేసులు ఇప్పుడు జీవితాన్ని తారుమారు చేసే ముప్పు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటివరకు చిన్న స్థాయి DUI కేసులకు ఆటోమేటిక్ డిపోర్టేషన్ ఉండేది కాదు. కానీ ఈ కొత్త బిల్లుతో పరిస్థితి మారిపోనుంది. ఎవరో ఒకరు తాము డ్రంక్ అండ్ డ్రైవ్ చేశామని అంగీకరించినా, అది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగినా, ఆ రికార్డు ఆధారంగా డిపోర్ట్ అవ్వొచ్చని చెబుతున్నారు.
ఇమిగ్రేషన్ యాక్టివిస్టులు, లాయర్లు చెబుతున్నది ఏమిటంటే.. ఈ బిల్లుతో డ్యూ ప్రాసెస్ పూర్తిగా మిస్సవుతుంది. హెచ్చరికలు లేకుండా, కోర్టు విచారణ లేకుండా, నేరుగా డిపోర్ట్ చేసే అవకాశం వస్తుంది. దీనివల్ల అమెరికాలో చట్టబద్ధంగా జీవిస్తున్న అనేక కుటుంబాలు విడిపోవాల్సిన పరిస్థితి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఒక్కసారి ఈ బిల్లు చట్టమైతే, అమెరికాలో ఉన్న లక్షలాది భారతీయుల భవిష్యత్తు సవాలుగా మారనుంది. చిన్న తప్పిదాలు కూడా జీవితాలను మార్చేసే స్థితి రానుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
This post was last modified on August 25, 2025 7:30 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…