Trends

ఆసియా కప్‌ 2025: 10 సెకన్లకు రూ.16 లక్షలు

ఆసియా కప్‌ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. సెప్టెంబర్ 10న భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. టీమ్ఇండియా బరిలోకి దిగుతున్న ప్రతి మ్యాచ్‌కి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుండటంతో, ప్రకటనల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే, యాడ్ రేట్లు రికార్డులు బద్దలుకొట్టే అవకాశం ఉంది.

ఈసారి ఆసియా కప్‌ ప్రసార హక్కులు (170 మిలియన్ డాలర్స్) 2031 వరకు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్‌లన్నీ సోనీ స్పోర్ట్స్‌లో, డిజిటల్‌ ప్లాట్‌ఫాం SonyLIVలో లైవ్‌గా ప్రసారం కానున్నాయి. టోర్నీపై కోట్లాది కళ్లున్నందున, ప్రకటనదారులు తమ ఉత్పత్తులకు బలమైన మార్కెట్ దొరకుతుందని నమ్ముతున్నారు. అందుకే సోనీ నెట్‌వర్క్ ఇండియా మ్యాచ్‌లకు భారీ ధరలు పెట్టింది.

టీమ్ఇండియా మ్యాచ్‌లకు ప్రత్యేక డిమాండ్ ఉండటంతో, 10 సెకన్ల యాడ్‌కే రూ.14 నుంచి రూ.16 లక్షల వరకు రేటు నిర్ణయించారు. ఇది గత టోర్నీలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు, భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ప్రసారమైతే వ్యూయర్‌షిప్ కోట్లు దాటుతుందని అంచనా. ఒక్క యాడ్ ద్వారా ప్రసారకర్తలు వందల కోట్ల ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ ఒక సందేహం కొనసాగుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 14న భారత్ పాకిస్థాన్ తలపడాలి. కానీ ఇటీవల లెజెండ్స్ టోర్నీలో పాక్‌తో ఆడేందుకు భారత జట్టు నిరాకరించడంతో, ఆసియా కప్‌లో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ప్రశ్న తలెత్తింది. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగితే, అది టోర్నీ మొత్తం హైలైట్ అవుతుంది. మొత్తం మీద, ఈసారి ఆసియా కప్‌ కేవలం క్రికెట్ అభిమానుల పండుగ మాత్రమే కాదు, ప్రకటనదారులకు కూడా బంగారు గనిలా మారబోతోంది.

This post was last modified on August 18, 2025 6:14 pm

Share

Recent Posts

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

12 minutes ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

41 minutes ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

54 minutes ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

1 hour ago

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

2 hours ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

3 hours ago