Trends

ఆసియా కప్‌ 2025: 10 సెకన్లకు రూ.16 లక్షలు

ఆసియా కప్‌ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. సెప్టెంబర్ 10న భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. టీమ్ఇండియా బరిలోకి దిగుతున్న ప్రతి మ్యాచ్‌కి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుండటంతో, ప్రకటనల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే, యాడ్ రేట్లు రికార్డులు బద్దలుకొట్టే అవకాశం ఉంది.

ఈసారి ఆసియా కప్‌ ప్రసార హక్కులు (170 మిలియన్ డాలర్స్) 2031 వరకు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్‌లన్నీ సోనీ స్పోర్ట్స్‌లో, డిజిటల్‌ ప్లాట్‌ఫాం SonyLIVలో లైవ్‌గా ప్రసారం కానున్నాయి. టోర్నీపై కోట్లాది కళ్లున్నందున, ప్రకటనదారులు తమ ఉత్పత్తులకు బలమైన మార్కెట్ దొరకుతుందని నమ్ముతున్నారు. అందుకే సోనీ నెట్‌వర్క్ ఇండియా మ్యాచ్‌లకు భారీ ధరలు పెట్టింది.

టీమ్ఇండియా మ్యాచ్‌లకు ప్రత్యేక డిమాండ్ ఉండటంతో, 10 సెకన్ల యాడ్‌కే రూ.14 నుంచి రూ.16 లక్షల వరకు రేటు నిర్ణయించారు. ఇది గత టోర్నీలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు, భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ప్రసారమైతే వ్యూయర్‌షిప్ కోట్లు దాటుతుందని అంచనా. ఒక్క యాడ్ ద్వారా ప్రసారకర్తలు వందల కోట్ల ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ ఒక సందేహం కొనసాగుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 14న భారత్ పాకిస్థాన్ తలపడాలి. కానీ ఇటీవల లెజెండ్స్ టోర్నీలో పాక్‌తో ఆడేందుకు భారత జట్టు నిరాకరించడంతో, ఆసియా కప్‌లో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ప్రశ్న తలెత్తింది. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగితే, అది టోర్నీ మొత్తం హైలైట్ అవుతుంది. మొత్తం మీద, ఈసారి ఆసియా కప్‌ కేవలం క్రికెట్ అభిమానుల పండుగ మాత్రమే కాదు, ప్రకటనదారులకు కూడా బంగారు గనిలా మారబోతోంది.

This post was last modified on August 18, 2025 6:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

26 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

33 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

4 hours ago