Trends

ఎక్కడివారక్కడే!…తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం!

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో గడచిన కొన్ని రోజులుగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. రోజుల తరబడి వర్షం కురుస్తుండగా… తాజాగా బుధవారం నుంచి రానున్న మూడు, నాలుగు రోజుల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బుధవారం రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనం ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. ప్రయాణాలు దాదాపుగా నిలిచిపోయాయి. పలు పట్టణాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్పించి బయటకు రావద్దని ఇరు రాష్ట్రాల ప్రజలకు అధికార యంత్రాంగం సూచించింది.

ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లోని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. వాగులు, వంకలకు దగ్గరగా ఉన్న కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షం తీవ్రంగా కురుస్తోంది. ఫలితంగా రాజధాని అమరావతికి పలు పట్టణాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు విజయవాడ నుంచి కూడా అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలతో చాలా జిల్లాల్లో అధికార యంత్రాంగం రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

మరోవైపు తెలంగాణ విషయానికి వస్తే… రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి మొదలైన వర్షం బుధవారం సాయంత్రం దాకా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా గురువారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే గడచిన రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వర్షపు నీటితో అలుగులు పొంగి పొరలుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా పది జిల్లాలకు పైగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.

రంగంలోకి బాబు, రేవంత్…

భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రంగంలోకి దిగిపోయారు. వర్షం కారణంగా పోటెత్తే వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని వారు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలువురు మంత్రులతో మాట్లాడిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… తాజాగా బుధవారం కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలతో మంత్రులతో పాటుగా అన్ని జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం వర్చువల్ గా పాలుపంచుకోనున్నారు. వర్షం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించే దిశగా ముందస్తు చర్యలకు బాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించనున్నారు. మరోవైపు మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా పలు కీలక శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

This post was last modified on August 13, 2025 5:41 pm

Share

Recent Posts

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

54 minutes ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

4 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

7 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

7 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

9 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

11 hours ago