Trends

ఎక్కడివారక్కడే!…తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం!

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో గడచిన కొన్ని రోజులుగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. రోజుల తరబడి వర్షం కురుస్తుండగా… తాజాగా బుధవారం నుంచి రానున్న మూడు, నాలుగు రోజుల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బుధవారం రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనం ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. ప్రయాణాలు దాదాపుగా నిలిచిపోయాయి. పలు పట్టణాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్పించి బయటకు రావద్దని ఇరు రాష్ట్రాల ప్రజలకు అధికార యంత్రాంగం సూచించింది.

ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లోని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. వాగులు, వంకలకు దగ్గరగా ఉన్న కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షం తీవ్రంగా కురుస్తోంది. ఫలితంగా రాజధాని అమరావతికి పలు పట్టణాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు విజయవాడ నుంచి కూడా అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలతో చాలా జిల్లాల్లో అధికార యంత్రాంగం రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

మరోవైపు తెలంగాణ విషయానికి వస్తే… రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి మొదలైన వర్షం బుధవారం సాయంత్రం దాకా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా గురువారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే గడచిన రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వర్షపు నీటితో అలుగులు పొంగి పొరలుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా పది జిల్లాలకు పైగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.

రంగంలోకి బాబు, రేవంత్…

భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రంగంలోకి దిగిపోయారు. వర్షం కారణంగా పోటెత్తే వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని వారు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలువురు మంత్రులతో మాట్లాడిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… తాజాగా బుధవారం కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలతో మంత్రులతో పాటుగా అన్ని జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం వర్చువల్ గా పాలుపంచుకోనున్నారు. వర్షం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించే దిశగా ముందస్తు చర్యలకు బాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించనున్నారు. మరోవైపు మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా పలు కీలక శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Kumar

Recent Posts

అయ్యగారు ఫ్యాన్ వచ్చాడు… సందడి తెచ్చాడు

ఈ సోషల్ మీడియా కాలంలో ఎవరు ఎప్పుడు పాపులర్ అవుతారో.. వైరల్ అయిపోతారో చెప్పలేం. కొన్నేళ్ళ ముందు అక్కినేని కుర్రాడు…

55 minutes ago

ఈ దెబ్బకు గిరిజన ఓటు బ్యాంకు పవన్ సొంతం

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు.. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఎంత ఇమేజ్ ఉందో.. గిరిజ‌న ప్రాంతాల్లోనూ అంతే ఇమేజ్ ఉంది. సినిమా…

1 hour ago

థియేటర్ల దగ్గర ‘లెనిన్’ పరిస్థితేంటి

ఇవాళ లెనిన్ విడుదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల ఉదయం అయిదు గంటల నుంచే షోలు మొదలైయ్యాయి. చాలా కాలం…

3 hours ago

‘కోట’ చేసిన సంతకం ఎప్పటికీ శాశ్వతం

కొందరు నటులకు మరణం ఉండదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా వాళ్ళ పాత్రలు సజీవంగా ఉంటూ తరాలు గడిచినా నిత్య…

4 hours ago

శ్రీశ్రీ… ఇది కదా కావాల్సింది

సినిమాని ఎంత బాగా తీశామో దానికి అంతే మంచి టైటిల్ పెట్టడం ఎంతో అవసరం. ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయిన…

5 hours ago

గూఢచారి 2 మీద బరువు పెరిగింది

బాలీవుడ్ లో స్పై డ్రామాలకు గడ్డు కాలం వచ్చేసింది. దురంధర్ పుణ్యమాని ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు పెట్టి…

8 hours ago