Trends

ఎక్కడివారక్కడే!…తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం!

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో గడచిన కొన్ని రోజులుగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. రోజుల తరబడి వర్షం కురుస్తుండగా… తాజాగా బుధవారం నుంచి రానున్న మూడు, నాలుగు రోజుల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బుధవారం రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనం ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. ప్రయాణాలు దాదాపుగా నిలిచిపోయాయి. పలు పట్టణాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్పించి బయటకు రావద్దని ఇరు రాష్ట్రాల ప్రజలకు అధికార యంత్రాంగం సూచించింది.

ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లోని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. వాగులు, వంకలకు దగ్గరగా ఉన్న కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షం తీవ్రంగా కురుస్తోంది. ఫలితంగా రాజధాని అమరావతికి పలు పట్టణాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు విజయవాడ నుంచి కూడా అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలతో చాలా జిల్లాల్లో అధికార యంత్రాంగం రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

మరోవైపు తెలంగాణ విషయానికి వస్తే… రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి మొదలైన వర్షం బుధవారం సాయంత్రం దాకా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా గురువారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే గడచిన రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వర్షపు నీటితో అలుగులు పొంగి పొరలుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా పది జిల్లాలకు పైగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.

రంగంలోకి బాబు, రేవంత్…

భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రంగంలోకి దిగిపోయారు. వర్షం కారణంగా పోటెత్తే వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని వారు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలువురు మంత్రులతో మాట్లాడిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… తాజాగా బుధవారం కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలతో మంత్రులతో పాటుగా అన్ని జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం వర్చువల్ గా పాలుపంచుకోనున్నారు. వర్షం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించే దిశగా ముందస్తు చర్యలకు బాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించనున్నారు. మరోవైపు మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా పలు కీలక శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

This post was last modified on August 13, 2025 5:41 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

25 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

39 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago