హైదరాబాద్ మహానగరం అంటే ప్రస్తుతం పెట్టుబడులకు గమ్యస్థానం. రియల్ ఎస్టేట్ రంగానికి పసిడి నగరం. అదేసమయంలో స్టార్టప్లు, మెట్రోలు ఇలా అనేక సంస్థలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ నగరాన్ని ప్రపంచ స్థాయికి చేర్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే అలాంటి నగరంలో పట్టపగలు దోపిడీలు పెరిగిపోతున్నాయి. 24 గంటల కిందట శంషాబాద్లోని ఓ అపార్ట్మెంటులో భారీ దోపిడీ జరిగింది. దీనిపై ప్రభుత్వం, పోలీసులు కూడా విచారణ చేపట్టారు.
ఈ వ్యవహారంపై ఇంకా కోలుకోకముందే తాజాగా చందానగర్లోని ప్రఖ్యాత ఖజానా జ్యువలరీ షోరూంలో దోపిడీకి ప్రయత్నించడం, ఈ క్రమంలో దుండగులు కాల్పులకు సైతం తెగబడడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఖజానా జ్యువలరీ సిబ్బంది దైనందిన వ్యాపార కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో వినియోగదారుల మాదిరిగా లోనికి ప్రవేశించిన దుండగులు ప్రధాన లాకర్ తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీనికి సిబ్బంది నో చెప్పడంతో వెంటనే కాల్పులకు తెగబడ్డారు. ఆకస్మిక పరిణామంతో విస్తుబోయిన ఉద్యోగులు ప్రాణాలు గుప్పిటపట్టి తలోదిక్కుకూ పరుగులు పెట్టారు. ఇంతలో మేనేజర్పై దుండగులు కాల్పులు జరిపారు. ఆయన తప్పించుకునే క్రమంలో తొడలోకి తూటా దూసుకుపోయింది. మరోవైపు సీసీ కెమెరాలను కూడా దుండగులు కాల్చేశారు. ఈ కాల్పుల మోత బయటకు వినిపించగానే అద్దాల కేసుల్లో ఉన్న బంగారు ఆభరణాలను సంచుల్లో వేసుకున్నారు.
ఇంతలో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరుగు పరుగున షోరూం వద్దకు చేరుకునే సరికి దుండగులు సినీ ఫక్కీలో వారి నుంచి తప్పించుకున్నారు. మొత్తం ఆరు గురు దుండగులు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలపై కాల్పులు జరిపినా రికార్డు అయ్యిందన్నారు. దీని ప్రకారం విచారణ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇదిలావుంటే ఈ పరిణామంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు జ్యువలరీ షాపుల వద్ద ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకపోవడం, ఇప్పుడు ఏకంగా కాల్పులకు తెగబడడంతో ప్రజలు భీతిల్లే పరిస్థితి ఏర్పడింది.
This post was last modified on August 12, 2025 1:43 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…