Trends

లైంగిక సమ్మతికి 18ఏళ్లు తప్పనిసరి: కేంద్రం క్లారిటీ

భారతదేశంలో లైంగిక సంబంధాలకు కనీస వయోపరిమితి 18ఏళ్లే తప్పనిసరి అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో, ఈ వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది. పిల్లలను రక్షించేందుకు, మైనారిటీలపై లైంగిక దుర్వినియోగాన్ని అరికట్టేందుకు 18ఏళ్ల వయోపరిమితిని ఉద్దేశపూర్వకంగా, పూర్తిగా ఆలోచించి అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం దేశంలోని పిల్లల భద్రత కోసం ఈ నియమాన్ని ఉంచినట్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి కోర్టుకు లిఖిత పూర్వకంగా సమర్పించారు. యువతలో పెరుగుతున్న శృంగార భావోద్వేగాలు, ప్రేమ పేరుతో చిన్న వయస్సులోనే లైంగిక సంబంధాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ పరిమితి చాలా అవసరం అని ఆమె అన్నారు. పిల్లల మౌనాన్ని, అర్థం చేసుకోలేని భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని లైంగిక దురాగతాలకు పాల్పడే వారిని ఈ నిబంధన కట్టడి చేస్తుందని చెప్పారు.

ఇక వయోపరిమితిని తగ్గిస్తే దాని వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు ఏర్పడే అవకాశముందని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా పిల్లల అక్రమ రవాణా, బాలలపై లైంగిక నేరాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా మహిళల భద్రత, బాలల హక్కులు, పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ఈ వయోపరిమితి అత్యంత కీలకమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇక యువతీ యువకుల మధ్య ప్రేమలో శృంగార భావాలు తక్కువ వయస్సులో పెరగడం, సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వయోపరిమితి తగ్గితే, చిన్నారుల భవిష్యత్ ముప్పులో పడే ప్రమాదం ఉందని న్యాయవాదులు కూడా వాదిస్తున్నారు. పౌరసత్వం పొందే వయస్సు 18ఏళ్లు కాగా, లైంగిక సహజీవనానికి కూడా అదే వయస్సు ఉండడం సమంజసమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on August 10, 2025 5:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

46 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

49 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago