భారతదేశంలో లైంగిక సంబంధాలకు కనీస వయోపరిమితి 18ఏళ్లే తప్పనిసరి అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో, ఈ వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది. పిల్లలను రక్షించేందుకు, మైనారిటీలపై లైంగిక దుర్వినియోగాన్ని అరికట్టేందుకు 18ఏళ్ల వయోపరిమితిని ఉద్దేశపూర్వకంగా, పూర్తిగా ఆలోచించి అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం దేశంలోని పిల్లల భద్రత కోసం ఈ నియమాన్ని ఉంచినట్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి కోర్టుకు లిఖిత పూర్వకంగా సమర్పించారు. యువతలో పెరుగుతున్న శృంగార భావోద్వేగాలు, ప్రేమ పేరుతో చిన్న వయస్సులోనే లైంగిక సంబంధాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ పరిమితి చాలా అవసరం అని ఆమె అన్నారు. పిల్లల మౌనాన్ని, అర్థం చేసుకోలేని భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని లైంగిక దురాగతాలకు పాల్పడే వారిని ఈ నిబంధన కట్టడి చేస్తుందని చెప్పారు.
ఇక వయోపరిమితిని తగ్గిస్తే దాని వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు ఏర్పడే అవకాశముందని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా పిల్లల అక్రమ రవాణా, బాలలపై లైంగిక నేరాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా మహిళల భద్రత, బాలల హక్కులు, పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ఈ వయోపరిమితి అత్యంత కీలకమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక యువతీ యువకుల మధ్య ప్రేమలో శృంగార భావాలు తక్కువ వయస్సులో పెరగడం, సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వయోపరిమితి తగ్గితే, చిన్నారుల భవిష్యత్ ముప్పులో పడే ప్రమాదం ఉందని న్యాయవాదులు కూడా వాదిస్తున్నారు. పౌరసత్వం పొందే వయస్సు 18ఏళ్లు కాగా, లైంగిక సహజీవనానికి కూడా అదే వయస్సు ఉండడం సమంజసమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on August 10, 2025 5:40 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…