Trends

కిరాణా కొట్టు యజమానికి.. కోహ్లీ, పాటిదార్, ABD వరుస కాల్స్!

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ చిన్న గ్రామంలో కిరాణా వ్యాపారి జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. వరుసగా వచ్చే ఫోన్ కాల్స్‌లో ఒక్కొక్కరు నేను విరాట్ కోహ్లీ, నేను ఏబీ డివిలియర్స్ అని చెప్పడం మొదలుపెట్టారు. మొదట ఇది ఫ్రాంక్ కాల్ అనుకున్న వ్యాపారి, ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రాజత్ పాటిదార్ స్వయంగా ఫోన్ చేయడంతో కథ మలుపు తిప్పుకుంది. నిజం తెలియని ఆ వ్యక్తి “నేను సీఎస్‌కే కెప్టెన్ ధోనీ” అని కౌంటర్ తరహాలో జవాబిచ్చాడు. 

కానీ ఈ కాల్స్ వెనుక అసలు నిజం బయటకు రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. విషయం ఏంటంటే, రాజత్ పాటిదార్ వాడిన పాత సిమ్ కార్డ్‌ను మూడు నెలలుగా రీచార్జ్ చేయకపోవడంతో టెలికాం కంపెనీ దాన్ని డీయాక్టివేట్ చేసింది. TRAI నిబంధనల ప్రకారం, ఇలాంటి సిమ్ నంబర్లు కొంతకాలం తర్వాత కొత్త కస్టమర్లకు ఇస్తారు. ఆ విధంగానే ఆ నంబర్ జూన్ 28న మణీష్ అనే వ్యాపారికి రీఅసైన్ అయింది. 

సిమ్ వేసిన వెంటనే వాట్సాప్‌లో పాటిదార్ ఫోటో కనిపించడంతో మొదట యాప్ లోపమని అనుకున్నాడు. కానీ కొద్ది సేపటికే వరుసగా కోహ్లీ నుంచి, ఏబీడీ కాల్స్ రావడం షురూ అయ్యింది. మొదట ఇదంతా సరదాగా తీసుకున్న మణీష్, పాటిదార్ చేసిన అభ్యర్థనను కూడా సరదాగా తిప్పికొట్టాడు. “నా పాత నంబర్ నీకు రీఅసైన్ అయింది, దయచేసి తిరిగి ఇవ్వు” అని పాటిదార్ చెప్పినప్పటికీ, అతను నమ్మలేదు. దీంతో పాటిదర్ మరో మార్గం లేదని భావించి, చివరికి పోలీసులను సంప్రదించాడు.

పోలీసులు మణీష్‌ను కలసి, ఈ నంబర్ నిజంగానే పాటిదార్ వాడినదని, కాల్స్ చేసిన వారు కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నిజమైనవారేనని వివరించారు. అప్పుడే మణీష్‌కు మొత్తం విషయం అర్థమైంది. వెంటనే సిమ్‌ను పోలీసులకే ఇచ్చి, పాటిదర్ కు ఇష్టంతోనే హెల్ప్ చేశాడు. ఇక గ్రామంలో ఈ వార్త తెలిసిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. మణీష్ దగ్గరకు వెళ్లి, అతని అనుభవం గురించి వినాలని ఆసక్తి చూపారు. ఒక్కసారిగా కోహ్లీ, ఏబీడీ, పాటిదార్‌లతో మాట్లాడిన అదృష్టం తనకే దక్కిందని మణీష్ ఆనందంగా చెప్పుకొచ్చాడు.

This post was last modified on August 10, 2025 3:58 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

25 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

39 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago