ఈ రోజుల్లో ‘డేటింగ్ యాప్స్’ పేరుతో యువకులు కొత్త మోసాలకు బలి అవుతున్నారు. సింగిల్స్కు, పెళ్లి కాని ప్రసాదులకు నెట్లో పరిచయాలు పెరుగుతున్నాయి. జూబ్లీహిల్స్కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి డేటింగ్ యాప్ ద్వారా ఓ అమ్మాయితో పరిచయమయ్యాడు. కొన్నాళ్లే కాకుండా ఆ యువతి తనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని చెప్పి రూ.70,000 దక్కించుకుంది. తర్వాత మళ్లీ డబ్బు అడిగినప్పుడు మోసపోయానని గ్రహించాడు. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇదే తరహాలో, కొంతమంది యువకులు అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి డేటింగ్ యాప్లో యువకులను వలలో పడేస్తున్నారు. కలుద్దామని చెప్పి, ఖరీదైన హోటల్లో గది బుక్ చేయించి, చివరకు బెదిరింపులు, డబ్బుల వసూళ్లు చేస్తున్న ఘటనలు ఇటీవల బయటపడుతున్నాయి. అసలు అమ్మాయిలు అని నమ్మించి, ఏకాంతంగా వీడియో కాల్ చేస్తామని ఆశ చూపించి, డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత మాయమవుతున్నారు.
వాస్తవంగా, ఈ డేటింగ్ యాప్స్ పట్ల ముఖ్యంగా యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే లింకులు, ర్యాండమ్ యాప్లను గుడ్డిగా నమ్మకూడదు. మీ వివరాలు, ఫోటోలు ఎవరికైనా పంపకూడదు. డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఈ డేటింగ్ యాప్లు ఎక్కువగా టీనేజ్ పిల్లలు, పెళ్లి కాని ప్రసాదులు వాడుతున్నారు. మగవాళ్ల వీక్నెస్ను క్యాష్ చేసుకునే ముఠాలు మరింత యాక్టివ్గా ఉన్నాయి. పోలీసులు ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేశారు. అయినా రోజుకో కొత్త ఫార్మాట్లో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
This post was last modified on August 8, 2025 10:36 am
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…