ఈ రోజుల్లో ‘డేటింగ్ యాప్స్’ పేరుతో యువకులు కొత్త మోసాలకు బలి అవుతున్నారు. సింగిల్స్కు, పెళ్లి కాని ప్రసాదులకు నెట్లో పరిచయాలు పెరుగుతున్నాయి. జూబ్లీహిల్స్కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి డేటింగ్ యాప్ ద్వారా ఓ అమ్మాయితో పరిచయమయ్యాడు. కొన్నాళ్లే కాకుండా ఆ యువతి తనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని చెప్పి రూ.70,000 దక్కించుకుంది. తర్వాత మళ్లీ డబ్బు అడిగినప్పుడు మోసపోయానని గ్రహించాడు. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇదే తరహాలో, కొంతమంది యువకులు అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి డేటింగ్ యాప్లో యువకులను వలలో పడేస్తున్నారు. కలుద్దామని చెప్పి, ఖరీదైన హోటల్లో గది బుక్ చేయించి, చివరకు బెదిరింపులు, డబ్బుల వసూళ్లు చేస్తున్న ఘటనలు ఇటీవల బయటపడుతున్నాయి. అసలు అమ్మాయిలు అని నమ్మించి, ఏకాంతంగా వీడియో కాల్ చేస్తామని ఆశ చూపించి, డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత మాయమవుతున్నారు.
వాస్తవంగా, ఈ డేటింగ్ యాప్స్ పట్ల ముఖ్యంగా యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే లింకులు, ర్యాండమ్ యాప్లను గుడ్డిగా నమ్మకూడదు. మీ వివరాలు, ఫోటోలు ఎవరికైనా పంపకూడదు. డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఈ డేటింగ్ యాప్లు ఎక్కువగా టీనేజ్ పిల్లలు, పెళ్లి కాని ప్రసాదులు వాడుతున్నారు. మగవాళ్ల వీక్నెస్ను క్యాష్ చేసుకునే ముఠాలు మరింత యాక్టివ్గా ఉన్నాయి. పోలీసులు ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేశారు. అయినా రోజుకో కొత్త ఫార్మాట్లో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…