ఈ రోజుల్లో ‘డేటింగ్ యాప్స్’ పేరుతో యువకులు కొత్త మోసాలకు బలి అవుతున్నారు. సింగిల్స్కు, పెళ్లి కాని ప్రసాదులకు నెట్లో పరిచయాలు పెరుగుతున్నాయి. జూబ్లీహిల్స్కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి డేటింగ్ యాప్ ద్వారా ఓ అమ్మాయితో పరిచయమయ్యాడు. కొన్నాళ్లే కాకుండా ఆ యువతి తనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని చెప్పి రూ.70,000 దక్కించుకుంది. తర్వాత మళ్లీ డబ్బు అడిగినప్పుడు మోసపోయానని గ్రహించాడు. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇదే తరహాలో, కొంతమంది యువకులు అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి డేటింగ్ యాప్లో యువకులను వలలో పడేస్తున్నారు. కలుద్దామని చెప్పి, ఖరీదైన హోటల్లో గది బుక్ చేయించి, చివరకు బెదిరింపులు, డబ్బుల వసూళ్లు చేస్తున్న ఘటనలు ఇటీవల బయటపడుతున్నాయి. అసలు అమ్మాయిలు అని నమ్మించి, ఏకాంతంగా వీడియో కాల్ చేస్తామని ఆశ చూపించి, డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత మాయమవుతున్నారు.
వాస్తవంగా, ఈ డేటింగ్ యాప్స్ పట్ల ముఖ్యంగా యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే లింకులు, ర్యాండమ్ యాప్లను గుడ్డిగా నమ్మకూడదు. మీ వివరాలు, ఫోటోలు ఎవరికైనా పంపకూడదు. డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఈ డేటింగ్ యాప్లు ఎక్కువగా టీనేజ్ పిల్లలు, పెళ్లి కాని ప్రసాదులు వాడుతున్నారు. మగవాళ్ల వీక్నెస్ను క్యాష్ చేసుకునే ముఠాలు మరింత యాక్టివ్గా ఉన్నాయి. పోలీసులు ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేశారు. అయినా రోజుకో కొత్త ఫార్మాట్లో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
This post was last modified on August 8, 2025 10:36 am
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…