“మమ్మీ.. చెల్లిని బాగా చదివించండి. కానీ నాతో మాత్రం ఈ చదువు కాదు. ఎంతగా ట్రై చేసినా నాకు చదువు అర్థం కావడం లేదు. చివరకు చావే నాకు దిక్కయింది,” అని రాసిన ఆ విద్యార్థిని ఆత్మహత్య లేఖ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ విషాద ఘటన హనుమకొండ నయీంనగర్లో చోటు చేసుకుంది. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మిట్టపల్లి శివాని (16) తాను ఎదుర్కొన్న మానసిక వేదన, చదువులోని ఒత్తిడిని భరించలేక చివరికి తనువు చాలించింది.
శివాని లేఖలో స్పష్టంగా తన మనసులో ఉన్న బాధను వివరించింది. “మీరంతా నన్ను మంచిగా చదువుకుంటానని ఆశపడుతున్నారు. కానీ నాకు ఈ చదువు అర్థం కావడం లేదు. ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. ప్రతిసారి చదవలేకపోయినప్పుడు మీకు, టీచర్లకు చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే నేను నలిగిపోతున్నాను,” అంటూ శివాని తన మనస్థితిని ఆ లేఖలో వివరించింది.
తన చెల్లిని కూడా తనలా చేయొద్దని, ఆమెకు బాగా చదువు చెప్పాలని తల్లిదండ్రులను కోరుతూ రాసింది శివాని. చివరి క్షణాల్లో కూడా తన చెల్లెలిపై ఉన్న ప్రేమ, బాధ్యత చూపిస్తూ, తన పరిస్థితి చెల్లికి రాకూడదని కోరింది. తన ఆత్మహత్య ద్వారా తల్లిదండ్రులు తమ పరిస్థితిని గుర్తించాలని ఆమె రాసిన లేఖలో కనిపిస్తోంది.
విద్యార్థులు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం చదువుపై తల్లిదండ్రులు, విద్యాసంస్థలు పెడుతున్న అత్యధిక ఒత్తిడే అని నిపుణులు అంటున్నారు. విద్యార్థులు ఇష్టంలేని కోర్సులను తల్లిదండ్రుల కోరికల మేరకు ఎంచుకుని, ఆ తర్వాత ఆ ఒత్తిడిని తట్టుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. ఇలాంటి విద్యార్థుల మనస్థితిని తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి వారికి మానసిక అండనిస్తే, ఇలాంటి విషాద ఘటనలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. కానీ ఏటా వేల సంఖ్యలో ఇలాంటి ఆత్మహత్యలు ఎక్కడో ఒక చోట కలచివేస్తూనే ఉన్నాయి. చదువు విషయంలో బలవంతం చేయడం కాకుండా, పిల్లల ఆసక్తులను గౌరవించి, వారికి తగినట్లు మద్దతు ఇవ్వడమే సమస్యలకు పరిష్కారం. శివాని లేఖ ప్రతీ తల్లిదండ్రికి ఒక హెచ్చరికగానే మారింది.
This post was last modified on August 4, 2025 10:23 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…