Trends

ఈ చదువు నాతోని కాదు.. చనిపోతున్నా!

“మమ్మీ.. చెల్లిని బాగా చదివించండి. కానీ నాతో మాత్రం ఈ చదువు కాదు. ఎంతగా ట్రై చేసినా నాకు చదువు అర్థం కావడం లేదు. చివరకు చావే నాకు దిక్కయింది,” అని రాసిన ఆ విద్యార్థిని ఆత్మహత్య లేఖ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ విషాద ఘటన హనుమకొండ నయీంనగర్‌లో చోటు చేసుకుంది. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మిట్టపల్లి శివాని (16) తాను ఎదుర్కొన్న మానసిక వేదన, చదువులోని ఒత్తిడిని భరించలేక చివరికి తనువు చాలించింది.

శివాని లేఖలో స్పష్టంగా తన మనసులో ఉన్న బాధను వివరించింది. “మీరంతా నన్ను మంచిగా చదువుకుంటానని ఆశపడుతున్నారు. కానీ నాకు ఈ చదువు అర్థం కావడం లేదు. ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. ప్రతిసారి చదవలేకపోయినప్పుడు మీకు, టీచర్లకు చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే నేను నలిగిపోతున్నాను,” అంటూ శివాని తన మనస్థితిని ఆ లేఖలో వివరించింది.

తన చెల్లిని కూడా తనలా చేయొద్దని, ఆమెకు బాగా చదువు చెప్పాలని తల్లిదండ్రులను కోరుతూ రాసింది శివాని. చివరి క్షణాల్లో కూడా తన చెల్లెలిపై ఉన్న ప్రేమ, బాధ్యత చూపిస్తూ, తన పరిస్థితి చెల్లికి రాకూడదని కోరింది. తన ఆత్మహత్య ద్వారా తల్లిదండ్రులు తమ పరిస్థితిని గుర్తించాలని ఆమె రాసిన లేఖలో కనిపిస్తోంది.

విద్యార్థులు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం చదువుపై తల్లిదండ్రులు, విద్యాసంస్థలు పెడుతున్న అత్యధిక ఒత్తిడే అని నిపుణులు అంటున్నారు. విద్యార్థులు ఇష్టంలేని కోర్సులను తల్లిదండ్రుల కోరికల మేరకు ఎంచుకుని, ఆ తర్వాత ఆ ఒత్తిడిని తట్టుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. ఇలాంటి విద్యార్థుల మనస్థితిని తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి వారికి మానసిక అండనిస్తే, ఇలాంటి విషాద ఘటనలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాంటి ఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. కానీ ఏటా వేల సంఖ్యలో ఇలాంటి ఆత్మహత్యలు ఎక్కడో ఒక చోట కలచివేస్తూనే ఉన్నాయి. చదువు విషయంలో బలవంతం చేయడం కాకుండా, పిల్లల ఆసక్తులను గౌరవించి, వారికి తగినట్లు మద్దతు ఇవ్వడమే సమస్యలకు పరిష్కారం. శివాని లేఖ ప్రతీ తల్లిదండ్రికి ఒక హెచ్చరికగానే మారింది.

This post was last modified on August 4, 2025 10:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

2 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

2 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

5 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

7 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

8 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

8 hours ago