Trends

ఈ చదువు నాతోని కాదు.. చనిపోతున్నా!

“మమ్మీ.. చెల్లిని బాగా చదివించండి. కానీ నాతో మాత్రం ఈ చదువు కాదు. ఎంతగా ట్రై చేసినా నాకు చదువు అర్థం కావడం లేదు. చివరకు చావే నాకు దిక్కయింది,” అని రాసిన ఆ విద్యార్థిని ఆత్మహత్య లేఖ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ విషాద ఘటన హనుమకొండ నయీంనగర్‌లో చోటు చేసుకుంది. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మిట్టపల్లి శివాని (16) తాను ఎదుర్కొన్న మానసిక వేదన, చదువులోని ఒత్తిడిని భరించలేక చివరికి తనువు చాలించింది.

శివాని లేఖలో స్పష్టంగా తన మనసులో ఉన్న బాధను వివరించింది. “మీరంతా నన్ను మంచిగా చదువుకుంటానని ఆశపడుతున్నారు. కానీ నాకు ఈ చదువు అర్థం కావడం లేదు. ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. ప్రతిసారి చదవలేకపోయినప్పుడు మీకు, టీచర్లకు చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే నేను నలిగిపోతున్నాను,” అంటూ శివాని తన మనస్థితిని ఆ లేఖలో వివరించింది.

తన చెల్లిని కూడా తనలా చేయొద్దని, ఆమెకు బాగా చదువు చెప్పాలని తల్లిదండ్రులను కోరుతూ రాసింది శివాని. చివరి క్షణాల్లో కూడా తన చెల్లెలిపై ఉన్న ప్రేమ, బాధ్యత చూపిస్తూ, తన పరిస్థితి చెల్లికి రాకూడదని కోరింది. తన ఆత్మహత్య ద్వారా తల్లిదండ్రులు తమ పరిస్థితిని గుర్తించాలని ఆమె రాసిన లేఖలో కనిపిస్తోంది.

విద్యార్థులు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం చదువుపై తల్లిదండ్రులు, విద్యాసంస్థలు పెడుతున్న అత్యధిక ఒత్తిడే అని నిపుణులు అంటున్నారు. విద్యార్థులు ఇష్టంలేని కోర్సులను తల్లిదండ్రుల కోరికల మేరకు ఎంచుకుని, ఆ తర్వాత ఆ ఒత్తిడిని తట్టుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. ఇలాంటి విద్యార్థుల మనస్థితిని తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి వారికి మానసిక అండనిస్తే, ఇలాంటి విషాద ఘటనలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాంటి ఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. కానీ ఏటా వేల సంఖ్యలో ఇలాంటి ఆత్మహత్యలు ఎక్కడో ఒక చోట కలచివేస్తూనే ఉన్నాయి. చదువు విషయంలో బలవంతం చేయడం కాకుండా, పిల్లల ఆసక్తులను గౌరవించి, వారికి తగినట్లు మద్దతు ఇవ్వడమే సమస్యలకు పరిష్కారం. శివాని లేఖ ప్రతీ తల్లిదండ్రికి ఒక హెచ్చరికగానే మారింది.

Satya

Recent Posts

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

5 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

6 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

8 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

9 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

10 hours ago

పింక్ శారీలో రాశి.. చూపు తిప్పుకోవడం కష్టమే!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…

11 hours ago