Trends

బాపట్ల క్వారీలో ఆరుగురి మృతి… విచారణకు బాబు ఆదేశం

ఏపీలోని బాపట్ల జిల్లాలో ఆదివారం ఓ ఘోర ప్రమాదం సంభవించింది. బాపట్ల జిల్లా బల్లికురువ మండల పరిధిలోని ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్ల కూలిన ఘటనలో ఆరుగురు కూలీలు ఆ బండల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు… ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ప్రమాదం వివరాల్లోకి వెళితే… బల్లికురువ సమీపంలో సత్యకృష్ణ గ్రానైట్స్ సంస్థ ఓ క్వారీని నిర్వహిస్తోంది. ఇందులో పని చేసేందుకు ఒడిశా నుంచి కూలీలను ఆ సంస్థ రప్పించింది. అయితే క్వారీలో గ్రానైట్ తవ్వే సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను పాటించడంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆదివారం మొత్తం 16 మంది కార్మికులు పనిచేస్తుండగా… పై నుంచి బండ రాళ్లు ఉన్నట్టుండి విరిగి పడ్డాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు కూలీలకు అవకాశం లేకుండా పోయింది.

నేరుగా బండరాళ్లు మీద పడ్డ ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా… మిగిలిన పది మంది కూలీలకు బండరాళ్లు గట్టిగానే తగిలాయి. దీంతో వారు గాయపడ్డారు. గాయపడ్డ కూలీలకు యాజమాన్యం హుటాహుటీన నరసరావుపేట ఆసుపత్రికి తరలించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను వేగం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన గురించి తెలుసుకున్న చంద్రబాబు షాక్ కు గురయ్యారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించిన చంద్రబాబు… క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

This post was last modified on August 3, 2025 11:05 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

52 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

2 hours ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

3 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

4 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

5 hours ago