ఏపీలోని బాపట్ల జిల్లాలో ఆదివారం ఓ ఘోర ప్రమాదం సంభవించింది. బాపట్ల జిల్లా బల్లికురువ మండల పరిధిలోని ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్ల కూలిన ఘటనలో ఆరుగురు కూలీలు ఆ బండల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు… ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రమాదం వివరాల్లోకి వెళితే… బల్లికురువ సమీపంలో సత్యకృష్ణ గ్రానైట్స్ సంస్థ ఓ క్వారీని నిర్వహిస్తోంది. ఇందులో పని చేసేందుకు ఒడిశా నుంచి కూలీలను ఆ సంస్థ రప్పించింది. అయితే క్వారీలో గ్రానైట్ తవ్వే సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను పాటించడంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆదివారం మొత్తం 16 మంది కార్మికులు పనిచేస్తుండగా… పై నుంచి బండ రాళ్లు ఉన్నట్టుండి విరిగి పడ్డాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు కూలీలకు అవకాశం లేకుండా పోయింది.
నేరుగా బండరాళ్లు మీద పడ్డ ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా… మిగిలిన పది మంది కూలీలకు బండరాళ్లు గట్టిగానే తగిలాయి. దీంతో వారు గాయపడ్డారు. గాయపడ్డ కూలీలకు యాజమాన్యం హుటాహుటీన నరసరావుపేట ఆసుపత్రికి తరలించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను వేగం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన గురించి తెలుసుకున్న చంద్రబాబు షాక్ కు గురయ్యారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించిన చంద్రబాబు… క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
This post was last modified on August 3, 2025 11:05 pm
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…