ఏపీలోని బాపట్ల జిల్లాలో ఆదివారం ఓ ఘోర ప్రమాదం సంభవించింది. బాపట్ల జిల్లా బల్లికురువ మండల పరిధిలోని ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్ల కూలిన ఘటనలో ఆరుగురు కూలీలు ఆ బండల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు… ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రమాదం వివరాల్లోకి వెళితే… బల్లికురువ సమీపంలో సత్యకృష్ణ గ్రానైట్స్ సంస్థ ఓ క్వారీని నిర్వహిస్తోంది. ఇందులో పని చేసేందుకు ఒడిశా నుంచి కూలీలను ఆ సంస్థ రప్పించింది. అయితే క్వారీలో గ్రానైట్ తవ్వే సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను పాటించడంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆదివారం మొత్తం 16 మంది కార్మికులు పనిచేస్తుండగా… పై నుంచి బండ రాళ్లు ఉన్నట్టుండి విరిగి పడ్డాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు కూలీలకు అవకాశం లేకుండా పోయింది.
నేరుగా బండరాళ్లు మీద పడ్డ ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా… మిగిలిన పది మంది కూలీలకు బండరాళ్లు గట్టిగానే తగిలాయి. దీంతో వారు గాయపడ్డారు. గాయపడ్డ కూలీలకు యాజమాన్యం హుటాహుటీన నరసరావుపేట ఆసుపత్రికి తరలించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను వేగం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన గురించి తెలుసుకున్న చంద్రబాబు షాక్ కు గురయ్యారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించిన చంద్రబాబు… క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
This post was last modified on August 3, 2025 11:05 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…