జూనియర్ ఎన్టీఆర్ చివరి చిత్రం ‘దేవర’ సినిమా రిలీజై పది నెలలు దాటిపోయింది. ఆ సినిమా తర్వాత అతను బాలీవుడ్ మూవీ ‘వార్-2’ పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్నాడు. కానీ ‘దేవర’ తీసిన కొరటాల శివ పరిస్థితి ఏంటి అన్నదే అర్థం కావడం లేదు. ‘ఆచార్య’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఇబ్బంది పడకుండా పెద్ద బడ్జెట్లో ‘దేవర’ తీశాడు కొరటాల. కానీ ఈ సినిమాను సక్సెస్ చేసినా సరే.. తర్వాతి చిత్రాన్ని మాత్రం ఎంతకీ మొదలుపెట్టడం లేదు.
పోనీ ‘దేవర-2’నే ఆయన తర్వాతి ప్రాజెక్టా అంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. తారక్ ఇప్పుడిప్పుడే ఖాళీ అయ్యేలా లేడు. ‘డ్రాగన్’ పూర్తి చేయడానికి ఇంకో ఏడెనిమిది నెలలైనా పట్టొచ్చు. దాని తర్వాత అయినా ‘దేవర-2’ను మొదలుపెడతాడా అంటే సందేహంగానే ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యస్వామి మీద సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మొదలుపెట్టడానికి ప్లాన్ వేసి పెట్టుకున్నారు. ఈ మధ్య ఒక ఈవెంట్లో ‘దేవర-2’ ఉంటుందని తారక్ చెప్పాడు కానీ.. ఆ సినిమాను మాత్రం వెంటనే మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు మాత్రం కనిపించడం లేదు. కాబట్టి కొరటాల దాన్ని నమ్ముకుని వెయిట్ చేసే పరిస్థితి లేదు.
మరి ఆయన తర్వాతి సినిమా ఏది.. ఏ స్టార్తో సినిమా చేస్తాడు అంటే మాత్రం క్లారిటీ లేదు.
ప్రస్తుతం టాలీవుడ్లో ఏ టాప్ స్టార్ కూడా కొరటాలతో వెంటనే సినిమా చేసే స్థితిలో లేడు. అందరూ వాళ్ల వాళ్ల ప్రాజెక్టులతో ఫుల్ బిజీ. ఈ పరిస్థితుల్లో ఆయన చూపు అక్కినేని వారి మీద పడ్డట్లుగా ఓ రూమర్ వినిపిస్తోంది. మరి ఆ కుటుంబంలో ఎవరి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారన్నది ఆసక్తికరం. అఖిల్ అయితే ‘లెనిన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల స్థాయికి తనతో సినిమా చేయడం సందేహమే. నాగార్జున, నాగచైతన్యల్లో ఒకరితోనే ఆయన సినిమా చేసే ఛాన్సుంది. ఎంతకీ తేలని తన వందో సినిమాను నాగ్.. చివరికి కొరటాల చేతుల్లో ఏమైనా పెడతాడా అన్నది క్వశ్చన్ మార్క్.
This post was last modified on August 3, 2025 10:20 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…