అధ్యాత్మ పర్యటన కోసం బయలుదేరిన భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్లోని బఫెలో నగరం నుంచి వెస్ట్ వర్జీనియాలోని ప్రముఖ ఆధ్యాత్మిక స్థలం “ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్” దర్శనానికి వెళ్తున్న వీరు, మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో మరణించారు. బఫెలో దివాన్ కుటుంబానికి చెందిన ఈ ఘటన విషాదం నింపింది.
మృతులను కిషోర్ దివాన్ (89), ఆశా దివాన్ (85), శైలేష్ దివాన్ (86), గీతా దివాన్ (84)గా అధికారులు గుర్తించారు. జులై 29న నలుగురూ కలిసి 2009 మోడల్ టయోటా క్యామ్రీ కారులో వెస్ట్ వర్జీనియాకు బయలుదేరారు. మార్షల్ కౌంటీలోని బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్ వద్ద ఉన్న లోతైన లోయలో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ప్రమాదానికి గురై, అక్కడికక్కడే మరణించినట్లు మార్షల్ కౌంటీ షెరిఫ్ మైక్ డోగర్టీ అధికారికంగా ప్రకటించారు.
ఆ కుటుంబం చివరిసారిగా పెన్సిల్వేనియాలోని బర్గర్ కింగ్ రెస్టారెంట్లో కనిపించారు. సీసీటీవీ ఫుటేజీలో వీరిలో ఇద్దరు రెస్టారెంట్లోకి ప్రవేశించినట్లు, అక్కడే చివరి క్రెడిట్ కార్డు లావాదేవీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత పెన్సిల్వేనియా స్టేట్ పోలీసుల కెమెరా వీరి వాహనం ఐ-79 రహదారిపై పిట్స్బర్గ్ దిశగా వెళ్తున్నట్లు రికార్డ్ అయ్యి ఉంది.
ఆ కుటుంబం అదృశ్యమయ్యాక, నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో రిపోర్ట్ చేయడంతో పాటు, మార్షల్ – ఒహియో కౌంటీల పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చివరకు శనివారం రాత్రి లోయలో వీరి కారును గుర్తించారు. సహాయక బృందాలు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశాయి.
ఈ ఘటనపై న్యూయార్క్లోని “కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా” (CHAI) సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులు సురక్షితంగా తిరిగిరావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని CHAI అధ్యక్షుడు సిబు నాయర్ తెలిపారు. మరోవైపు ఈ విషాద ఘటనపై స్థానిక పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదం అమెరికాలో ఉన్న భారతీయుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
This post was last modified on August 3, 2025 9:33 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…