Trends

అమెరికా మృత్యు లోయలో భారత సంతతి కుటుంబం

అధ్యాత్మ పర్యటన కోసం బయలుదేరిన భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్‌లోని బఫెలో నగరం నుంచి వెస్ట్ వర్జీనియాలోని ప్రముఖ ఆధ్యాత్మిక స్థలం “ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్” దర్శనానికి వెళ్తున్న వీరు, మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో మరణించారు. బఫెలో దివాన్ కుటుంబానికి చెందిన ఈ ఘటన విషాదం నింపింది.

మృతులను కిషోర్ దివాన్ (89), ఆశా దివాన్ (85), శైలేష్ దివాన్ (86), గీతా దివాన్ (84)గా అధికారులు గుర్తించారు. జులై 29న నలుగురూ కలిసి 2009 మోడల్ టయోటా క్యామ్రీ కారులో వెస్ట్ వర్జీనియాకు బయలుదేరారు. మార్షల్ కౌంటీలోని బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్ వద్ద ఉన్న లోతైన లోయలో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ప్రమాదానికి గురై, అక్కడికక్కడే మరణించినట్లు మార్షల్ కౌంటీ షెరిఫ్ మైక్ డోగర్టీ అధికారికంగా ప్రకటించారు.

ఆ కుటుంబం చివరిసారిగా పెన్సిల్వేనియాలోని బర్గర్ కింగ్ రెస్టారెంట్‌లో కనిపించారు. సీసీటీవీ ఫుటేజీలో వీరిలో ఇద్దరు రెస్టారెంట్‌లోకి ప్రవేశించినట్లు, అక్కడే చివరి క్రెడిట్ కార్డు లావాదేవీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత పెన్సిల్వేనియా స్టేట్ పోలీసుల కెమెరా వీరి వాహనం ఐ-79 రహదారిపై పిట్స్‌బర్గ్ దిశగా వెళ్తున్నట్లు రికార్డ్ అయ్యి ఉంది.

ఆ కుటుంబం అదృశ్యమయ్యాక, నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో రిపోర్ట్ చేయడంతో పాటు, మార్షల్ – ఒహియో కౌంటీల పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చివరకు శనివారం రాత్రి లోయలో వీరి కారును గుర్తించారు. సహాయక బృందాలు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశాయి.

ఈ ఘటనపై న్యూయార్క్‌లోని “కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా” (CHAI) సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులు సురక్షితంగా తిరిగిరావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని CHAI అధ్యక్షుడు సిబు నాయర్ తెలిపారు. మరోవైపు ఈ విషాద ఘటనపై స్థానిక పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదం అమెరికాలో ఉన్న భారతీయుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

This post was last modified on August 3, 2025 9:33 pm

Share

Recent Posts

ఆన్ లైన్లో తండ్రి అంత్యక్రియలకు హాజరు

రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…

7 minutes ago

దర్శకుడు చనిపోయినా సినిమా బ్రతుకుతోంది

ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా…

19 minutes ago

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావన

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…

1 hour ago

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…

4 hours ago

రామాయణ 2 కోసం చాలా దాచి పెట్టారు

దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…

5 hours ago

కొత్త జంట‌కు తాళి బొట్లు… ఫ‌స్ట్ బ‌డ్జెట్‌లోనే `విజ‌య్` ముద్ర‌!

త‌మిళ‌నాడులో కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత‌, న‌టుడు విజ‌య్.. నేతృత్వంలోని స‌ర్కారు.. తొలి బ‌డ్జెట్‌ను(2026-27)ను బుధ‌వారం అసెంబ్లీలో…

5 hours ago