కరోనా పుణ్యమా అని ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వేవ్ రావటం.. షాకులు ఇవ్వటం.. వెళ్లిపోయినట్లే వెళ్లిపోయి.. సెకండ్ వేవ్ తో పలు దేశాల్ని అతలాకుతలం చేస్తోంది. తాజాగా మన దేశంలోనూ కేరళ.. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ షురూ కాలేదు. ఇదిలా ఉంటే.. వచ్చే నెలాఖరు నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందన్న అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పలు కంపెనీలు తమ వ్యాక్సిన్ పరీక్షా ఫలితాలు బాగానే వస్తున్నట్లు చెబుతున్నాయి.
అలాంటి కోవలోకే వస్తోంది ఫైజర్ తయారు చేస్తున్న వ్యాక్సిన్. తమ టీకా బాగా పని చేస్తుందని చెప్పిన కంపెనీ మాట పలువురికి ఊరటను ఇచ్చింది. అయితే.. ఈ టీకాను నిల్వ ఉంచటం సామాన్యమైన విషయం కాదంటున్నారు. ఎందుకంటే.. ఫైజర్ వ్యాక్సిన్ ను నిల్వ ఉంచాలంటే మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలన్న మాటకు విస్తుపోతున్నారు. ఎందుకంటే.. భారీ ఎత్తున నిల్వ ఉంచాల్సిన వ్యాక్సిన్ ను.. అలాంటి వాతావరణంలో ఉంచేంత సాంకేతికత చాలా దేశాల్లో లేదు.
ఆ మాటకు వస్తే.. మన దేశంలో అలాంటి పరిస్థితులు ఏ మాత్రం లేవన్న మాట వినిపిస్తోంది. ఉన్నవి చాలా పరిమితమని చెబుతున్నారు. ఇలాంటివేళ.. ఫైజర్ వ్యాక్సిన్ కొనుగోలు చేయటం పెద్ద విషయం కాదని.. దాన్ని నిల్వ ఉంచి ప్రజలకు ఇవ్వటంలోనే అసలు సమస్యగా భావిస్తున్నారు.దీంతో.. ఈ వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని భావించిన కేంద్రం సైతం ఇప్పుడు సందేహంలో పడినట్లు చెబుతున్నారు.
ఫైజర్ టీకా కొనటం తప్పని పరిస్థితుల్లో దాన్ని నిల్వ ఉంచటం ఏలా అన్న అంశం మీద ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్ ను నిల్వ చేయటం ఏ దేశానికైనా సవాలుతో కూడిన అంశంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మోడెర్నా కూడా తాము డెవలప్ చేసిన వ్యాక్సిన్ బాగా పని చేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై పలు దేశాలు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాయి.
This post was last modified on November 18, 2020 6:59 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…