Trends

చరిత్రలో తొలిసారి ఈనాడులో అలా జరిగిందట

ఊహించని పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కరోనా. యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా చేయటంలో ఈ మాయదారి వైరస్ తీరు వేరుగా చెప్పక తప్పదు. ఒక్క బుల్లెట్ పేలకుండా.. ఒక్క బాంబు విసరకుండా ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ లోకి వెళ్లిపోయేలా చేసిన ఘనత కరోనాకే దక్కుతుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోని పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన మీడియా సంస్థలకు ఈనాడుకున్న వ్యత్యాసం ఏమంటే.. తమ ఉద్యోగులకు ఇచ్చే జీతాల్ని నెలాఖరులోనే ఇచ్చేస్తుంటారు.

కొన్ని సందర్భాల్లో అయితే.. నెల చివరి రోజు ఆదివారం అయితే.. ఒకట్రెండు రోజుల ముందే జీతాలు ఇచ్చేయటం జరుగుతుంది. ఈ విషయాన్ని ఈనాడు ఉద్యోగులు మహా గొప్పగా చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే..నెలాఖరుకు మూడు నాలుగు రోజుల ముందే జీతాలు ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి.

అంతే తప్పించి.. క్యాలెండర్లో నెల దాటిన తర్వాత ఉద్యోగుల జీతాలు వేయటం అన్నది లేదు. నాలుగైదేళ్ల క్రితం ఒకసారి సాంకేతి కారణాలతో కొందరు ఉద్యోగుల జీతాలు బ్యాంకు ఖాతాలో ఆలస్యంగా క్రెడిట్ కావటం జరిగింది. అది మినహా ఎప్పుడూ ఆలస్యమైంది లేదు. ఇందుకు భిన్నంగా కరోనావేళ.. చోటు చేసుకుందని చెబుతారు. ఏప్రిల్ చివరి రోజున ఇవ్వాల్సిన జీతాల్ని.. మే పదిన కానీ ఆ తర్వాత కానీ ఇస్తామన్న మాట చెప్పినట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా మీడియా సంస్థల ఆదాయం భారీగా పడిపోవటం.. ప్రకటనలు.. లూజ్ కాపీల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడిన నేపథ్యంలో సంస్థ ఆదాయానికి భారీ ఎత్తున గండి పడిందని చెప్పాలి. ఇప్పటికే పలు మీడియా సంస్థలు జీతాల్లో కోత విధించిన వైనం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటివేళ.. నెలాఖరు రోజున కచ్ఛితంగా జీతాలు ఇచ్చే పేరున్న ఈనాడు సంస్థ చరిత్రలో తొలిసారి ఆలస్యంగా ఇస్తామన్న మాట వచ్చిందంటున్నారు. దీంతో.. జీతాలు పూర్తిగా ఇస్తారా? కొన్ని సంస్థల మాదిరి కోత పెడతారా? అన్నదిప్పుడు ఆ సంస్థలో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు.

This post was last modified on May 1, 2020 12:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇండస్ట్రీ లో కాంపౌండ్ లపై చిరు కామెంట్!,

‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఐక్యతపై, ఫ్యాన్ వార్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు…

6 hours ago

నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన: చిరంజీవి!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను సాక్ష్యాత్తూ ప్రధాని మోదీ పవన్ ను ఏ ఆంధీ…

7 hours ago

సెకండ్ బిగ్గెస్ట్ ఎన్ కౌంటర్… 33 మంది మృతి

నిషేధిత మావోయిస్టులకు నిజంగానే చావు దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు. ఇటీవలి కాలంలో కేంద్ర బలగాలు మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమాన్ని…

14 hours ago

బన్నీకి పాకిస్థాన్‌లో అంత ఫాలోయింగా?

సినిమాలు చూసే విషయంలో రాష్ట్రాలు, దేశాల మధ్య హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. ఓటీటీల్లో ఎక్కడెక్కడి సినిమాలనో చూసేస్తున్నారు జనం. వరల్డ్…

15 hours ago

సుకుమార్ జోక్‌గా చెప్పినా అది సీరియస్సే

నిన్న ‘పుష్ప-2’ సక్సెస్ మీట్లో చాలామంది ప్రసంగాలు చేశారు. అందులో సుకుమార్ స్పీచే హైలైట్‌గా నిలిచింది. ఎవరో పెద్దగాయన్న అన్నారంటూ…

16 hours ago

కిరణ్ రాయల్ పై రచ్చ.. ఎంతగా టార్గెట్ అయ్యారంటే?

శనివారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. జనసేనకు చెందిన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్.. నగరానికి చెందిన…

16 hours ago