Trends

చరిత్రలో తొలిసారి ఈనాడులో అలా జరిగిందట

ఊహించని పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కరోనా. యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా చేయటంలో ఈ మాయదారి వైరస్ తీరు వేరుగా చెప్పక తప్పదు. ఒక్క బుల్లెట్ పేలకుండా.. ఒక్క బాంబు విసరకుండా ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ లోకి వెళ్లిపోయేలా చేసిన ఘనత కరోనాకే దక్కుతుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోని పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన మీడియా సంస్థలకు ఈనాడుకున్న వ్యత్యాసం ఏమంటే.. తమ ఉద్యోగులకు ఇచ్చే జీతాల్ని నెలాఖరులోనే ఇచ్చేస్తుంటారు.

కొన్ని సందర్భాల్లో అయితే.. నెల చివరి రోజు ఆదివారం అయితే.. ఒకట్రెండు రోజుల ముందే జీతాలు ఇచ్చేయటం జరుగుతుంది. ఈ విషయాన్ని ఈనాడు ఉద్యోగులు మహా గొప్పగా చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే..నెలాఖరుకు మూడు నాలుగు రోజుల ముందే జీతాలు ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి.

అంతే తప్పించి.. క్యాలెండర్లో నెల దాటిన తర్వాత ఉద్యోగుల జీతాలు వేయటం అన్నది లేదు. నాలుగైదేళ్ల క్రితం ఒకసారి సాంకేతి కారణాలతో కొందరు ఉద్యోగుల జీతాలు బ్యాంకు ఖాతాలో ఆలస్యంగా క్రెడిట్ కావటం జరిగింది. అది మినహా ఎప్పుడూ ఆలస్యమైంది లేదు. ఇందుకు భిన్నంగా కరోనావేళ.. చోటు చేసుకుందని చెబుతారు. ఏప్రిల్ చివరి రోజున ఇవ్వాల్సిన జీతాల్ని.. మే పదిన కానీ ఆ తర్వాత కానీ ఇస్తామన్న మాట చెప్పినట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా మీడియా సంస్థల ఆదాయం భారీగా పడిపోవటం.. ప్రకటనలు.. లూజ్ కాపీల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడిన నేపథ్యంలో సంస్థ ఆదాయానికి భారీ ఎత్తున గండి పడిందని చెప్పాలి. ఇప్పటికే పలు మీడియా సంస్థలు జీతాల్లో కోత విధించిన వైనం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటివేళ.. నెలాఖరు రోజున కచ్ఛితంగా జీతాలు ఇచ్చే పేరున్న ఈనాడు సంస్థ చరిత్రలో తొలిసారి ఆలస్యంగా ఇస్తామన్న మాట వచ్చిందంటున్నారు. దీంతో.. జీతాలు పూర్తిగా ఇస్తారా? కొన్ని సంస్థల మాదిరి కోత పెడతారా? అన్నదిప్పుడు ఆ సంస్థలో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు.

This post was last modified on May 1, 2020 12:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

22 minutes ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

1 hour ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

1 hour ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago