మిడిల్ ఈస్ట్ దేశాలలో హత్య వంటి నేరాలకు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ క్రమంలోనే యెమెన్ లో ఓ యెమెన్ జాతీయుడిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియకు అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. జులై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. ఆమెను కాపాడేందుకు బ్లడ్ మనీ రూపంలో ఆమె కుటుంబం చేసిన ప్రయత్నాలు దాదాపుగా విఫలమయ్యాయి. నిమిషకు ఉరిశిక్ష రద్దు చేయాలని యావత్ భారత దేశం కోరుకుంటోంది.
కొందరు ముస్లిం మత పెద్దలు, కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు నిమిష ఉరి ఆపేందుకు ఈ రోజు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలిస్తాయి అన్న గ్యారెంటీ లేదు. దీంతో, ఆమెకు ఉరి తప్పదని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా నిమిష ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది.
మత పెద్దలతోపాటు పాటు భారత విదేశాంగ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలతో ఆమె ఉరి శిక్ష వాయిదా పడింది. యెమెన్ లో నిమిషను ఉరి తీయబోతున్న జైలు అధికారులతో భారత విదేశాంగ అధికారులు జరుపుతున్న చర్చలు సఫలమయ్యేలా కనిపిస్తున్నాయి. యెమెన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం మరిన్న చర్చలు జరిపి నిమిష ఉరిశిక్ష రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
యెమెన్లో 2017లో తన వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మహ్దీని హత్య చేశారని నిమిషా ప్రియపై ఆరోపణలు వచ్చాయి. దీంతో, విచారణ జరిపిన తర్వాత నిమిషకు మరణ శిక్ష విధించింది యెమెన్ న్యాయస్థానం. బ్లడ్ మనీ చెల్లించడం…అంటే మృతుడి కుటుంబానికి దాదాపు 7 కోట్ల రూపాయలు చెల్లించడం ద్వారా నిమిష ఉరి శిక్ష ఆపే చాన్స్ ఉంది. కానీ, యెమెన్లోని సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యపడలేదు.
This post was last modified on July 15, 2025 3:33 pm
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…