Trends

బ్రేకింగ్: నిమిష ఉరిశిక్ష వాయిదా

మిడిల్ ఈస్ట్ దేశాలలో హత్య వంటి నేరాలకు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ క్రమంలోనే యెమెన్ లో ఓ యెమెన్ జాతీయుడిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియకు అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. జులై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. ఆమెను కాపాడేందుకు బ్లడ్ మనీ రూపంలో ఆమె కుటుంబం చేసిన ప్రయత్నాలు దాదాపుగా విఫలమయ్యాయి. నిమిషకు ఉరిశిక్ష రద్దు చేయాలని యావత్ భారత దేశం కోరుకుంటోంది.

కొందరు ముస్లిం మత పెద్దలు, కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు నిమిష ఉరి ఆపేందుకు ఈ రోజు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలిస్తాయి అన్న గ్యారెంటీ లేదు. దీంతో, ఆమెకు ఉరి తప్పదని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా నిమిష ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది.

మత పెద్దలతోపాటు పాటు భారత విదేశాంగ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలతో ఆమె ఉరి శిక్ష వాయిదా పడింది. యెమెన్ లో నిమిషను ఉరి తీయబోతున్న జైలు అధికారులతో భారత విదేశాంగ అధికారులు జరుపుతున్న చర్చలు సఫలమయ్యేలా కనిపిస్తున్నాయి. యెమెన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం మరిన్న చర్చలు జరిపి నిమిష ఉరిశిక్ష రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

యెమెన్‌‌‌‌లో 2017లో తన వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మహ్దీని హత్య చేశారని నిమిషా ప్రియపై ఆరోపణలు వచ్చాయి. దీంతో, విచారణ జరిపిన తర్వాత నిమిషకు మరణ శిక్ష విధించింది యెమెన్ న్యాయస్థానం. బ్లడ్ మనీ చెల్లించడం…అంటే మృతుడి కుటుంబానికి దాదాపు 7 కోట్ల రూపాయలు చెల్లించడం ద్వారా నిమిష ఉరి శిక్ష ఆపే చాన్స్ ఉంది. కానీ, యెమెన్‌‌‌‌లోని సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యపడలేదు.

This post was last modified on July 15, 2025 3:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

21 minutes ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

2 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

4 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

4 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

7 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

9 hours ago