Trends

బ్రేకింగ్: నిమిష ఉరిశిక్ష వాయిదా

మిడిల్ ఈస్ట్ దేశాలలో హత్య వంటి నేరాలకు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ క్రమంలోనే యెమెన్ లో ఓ యెమెన్ జాతీయుడిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియకు అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. జులై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. ఆమెను కాపాడేందుకు బ్లడ్ మనీ రూపంలో ఆమె కుటుంబం చేసిన ప్రయత్నాలు దాదాపుగా విఫలమయ్యాయి. నిమిషకు ఉరిశిక్ష రద్దు చేయాలని యావత్ భారత దేశం కోరుకుంటోంది.

కొందరు ముస్లిం మత పెద్దలు, కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు నిమిష ఉరి ఆపేందుకు ఈ రోజు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలిస్తాయి అన్న గ్యారెంటీ లేదు. దీంతో, ఆమెకు ఉరి తప్పదని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా నిమిష ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది.

మత పెద్దలతోపాటు పాటు భారత విదేశాంగ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలతో ఆమె ఉరి శిక్ష వాయిదా పడింది. యెమెన్ లో నిమిషను ఉరి తీయబోతున్న జైలు అధికారులతో భారత విదేశాంగ అధికారులు జరుపుతున్న చర్చలు సఫలమయ్యేలా కనిపిస్తున్నాయి. యెమెన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం మరిన్న చర్చలు జరిపి నిమిష ఉరిశిక్ష రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

యెమెన్‌‌‌‌లో 2017లో తన వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మహ్దీని హత్య చేశారని నిమిషా ప్రియపై ఆరోపణలు వచ్చాయి. దీంతో, విచారణ జరిపిన తర్వాత నిమిషకు మరణ శిక్ష విధించింది యెమెన్ న్యాయస్థానం. బ్లడ్ మనీ చెల్లించడం…అంటే మృతుడి కుటుంబానికి దాదాపు 7 కోట్ల రూపాయలు చెల్లించడం ద్వారా నిమిష ఉరి శిక్ష ఆపే చాన్స్ ఉంది. కానీ, యెమెన్‌‌‌‌లోని సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యపడలేదు.

This post was last modified on July 15, 2025 3:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

9 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

49 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago