Trends

యెమెన్ చట్టానికి బలైన ఒక కేరళ నర్సు కథ !

ఒక హత్య కేసులో కేరళకు చెందిన నర్సు ఒకరు దోషిగా తేలటమే కాదు.. ఆమెకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పునకు సంబంధించి అమలు తేదీని తాజాగా ఖరారు చేశారు. అక్కడి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ నెల 16న ఆమెకు ఊరిశిక్ష అమలు చేయనున్నారు. దేశం కాని దేశంలో ఆమె హత్య చేయటానికి కారణమేంటి? ఆమెను ఊరిశిక్ష నుంచి తప్పించేందుకు ఇప్పటివరకు జరిగిన పరిణామాల్ని చూస్తే..
కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సు యెమెన్ కు 2008లో వెళ్లారు. కొన్నేళ్లు వివిధ ఆసుపత్రుల్లో పని చేశారు. అనంతరం సొంతంగా ఒక క్లినిక్ ను ఏర్పాటు చేశారు. ఆ దేశంలోని నిబంధనల ప్రకారం ఆ దేశంలో ఎవరైనా వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలంటే కచ్ఛితంగా ఆ దేశానికి చెందిన స్థానికుల్ని భాగస్వామిని చేసుకోవాలి. అయితే.. ఆమెకు 2014లో తలాల్ అబ్దో మహది అనే వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో.. అతడ్ని వ్యాపార భాగస్వామిగా పేర్కొంటూ బిజినెస్ స్టార్ట్ చేశారు.

క్లినిక్ ప్రారంభించిన కొంత కాలానికే ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. దీంతో.. అతడి తీరుతో విసిగిపోయిన ఆమె అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడు జైలు పాలయ్యాడు. కొంతకాలం జైల్లో ఉన్న అనంతరం తిరిగి బయటకు వచ్చిన అతను.. ఆమెను వేధించటం మొదలు పెట్టాడు. దీంతో నిమిషా తట్టుకోలేకపోయింది. ఆమె పాస్ పోర్టును తన వద్దే ఉంచుకున్న అతను ఇబ్బంది పెట్టసాగాడు.

దీంతో.. అతడ్ని వదిలించుకోవటానికి ప్లాన్ చేసిన ఆమె.. 2017లో ఒక ఇంజక్షన్ తో అతడ్ని చంపేసింది. పాస్ పోర్టును తీసుకొని ఇండియాకు తిరిగి వస్తున్న క్రమంలో ఆమెను యెమెన్ పోలీసులు పట్టుకొన్నారు. 2017 నుంచి ఆమె జైల్లోనే ఉంటున్నారు. ఈ కేసులో ఆమెను దోషిగా నిర్ణయిస్తూ 2018లో జీవితఖైదు విధిస్తూ తీర్పును ఇచ్చారు. అనంతరం దాన్ని మరణశిక్షగా తేల్చారు.

దీంతో నిమిషాను కాపాడుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు బ్లడ్ మనీకి సిద్ధమైంది. తలాల్ కుటుంబానికి రూ.70 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్లే విరాళాలతో ఆ మొత్తాన్ని సమకూర్చారు. అయితే.. చివర్లో న్యాయవాది అనూహ్య రీతిలో స్పందిస్తూ.. తన ఫీజు కింద 40 వేల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో విషయం మళ్లీ మొదటికి వచ్చింది. అంత మొత్తాన్ని సమకూర్చలేని నిమిషా కుటుంబం కిందా మీదా పడుతున్నరు . మొత్తం డబ్బులు ఇస్తేనే బ్లడ్ మనీ చర్చలు జరుపుతామని తేల్చి చెప్పటంతో.. నిమిషా కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు ఈ నెలలోనే ఊరిశిక్ష ఖరారు చేయటంతో నిమిషా కుటుంబ సభ్యుల్లో ఆందోళన అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

This post was last modified on July 9, 2025 3:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

12 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

34 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

4 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

5 hours ago