ఒక హత్య కేసులో కేరళకు చెందిన నర్సు ఒకరు దోషిగా తేలటమే కాదు.. ఆమెకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పునకు సంబంధించి అమలు తేదీని తాజాగా ఖరారు చేశారు. అక్కడి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ నెల 16న ఆమెకు ఊరిశిక్ష అమలు చేయనున్నారు. దేశం కాని దేశంలో ఆమె హత్య చేయటానికి కారణమేంటి? ఆమెను ఊరిశిక్ష నుంచి తప్పించేందుకు ఇప్పటివరకు జరిగిన పరిణామాల్ని చూస్తే..
కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సు యెమెన్ కు 2008లో వెళ్లారు. కొన్నేళ్లు వివిధ ఆసుపత్రుల్లో పని చేశారు. అనంతరం సొంతంగా ఒక క్లినిక్ ను ఏర్పాటు చేశారు. ఆ దేశంలోని నిబంధనల ప్రకారం ఆ దేశంలో ఎవరైనా వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలంటే కచ్ఛితంగా ఆ దేశానికి చెందిన స్థానికుల్ని భాగస్వామిని చేసుకోవాలి. అయితే.. ఆమెకు 2014లో తలాల్ అబ్దో మహది అనే వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో.. అతడ్ని వ్యాపార భాగస్వామిగా పేర్కొంటూ బిజినెస్ స్టార్ట్ చేశారు.
క్లినిక్ ప్రారంభించిన కొంత కాలానికే ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. దీంతో.. అతడి తీరుతో విసిగిపోయిన ఆమె అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడు జైలు పాలయ్యాడు. కొంతకాలం జైల్లో ఉన్న అనంతరం తిరిగి బయటకు వచ్చిన అతను.. ఆమెను వేధించటం మొదలు పెట్టాడు. దీంతో నిమిషా తట్టుకోలేకపోయింది. ఆమె పాస్ పోర్టును తన వద్దే ఉంచుకున్న అతను ఇబ్బంది పెట్టసాగాడు.
దీంతో.. అతడ్ని వదిలించుకోవటానికి ప్లాన్ చేసిన ఆమె.. 2017లో ఒక ఇంజక్షన్ తో అతడ్ని చంపేసింది. పాస్ పోర్టును తీసుకొని ఇండియాకు తిరిగి వస్తున్న క్రమంలో ఆమెను యెమెన్ పోలీసులు పట్టుకొన్నారు. 2017 నుంచి ఆమె జైల్లోనే ఉంటున్నారు. ఈ కేసులో ఆమెను దోషిగా నిర్ణయిస్తూ 2018లో జీవితఖైదు విధిస్తూ తీర్పును ఇచ్చారు. అనంతరం దాన్ని మరణశిక్షగా తేల్చారు.
దీంతో నిమిషాను కాపాడుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు బ్లడ్ మనీకి సిద్ధమైంది. తలాల్ కుటుంబానికి రూ.70 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్లే విరాళాలతో ఆ మొత్తాన్ని సమకూర్చారు. అయితే.. చివర్లో న్యాయవాది అనూహ్య రీతిలో స్పందిస్తూ.. తన ఫీజు కింద 40 వేల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో విషయం మళ్లీ మొదటికి వచ్చింది. అంత మొత్తాన్ని సమకూర్చలేని నిమిషా కుటుంబం కిందా మీదా పడుతున్నరు . మొత్తం డబ్బులు ఇస్తేనే బ్లడ్ మనీ చర్చలు జరుపుతామని తేల్చి చెప్పటంతో.. నిమిషా కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు ఈ నెలలోనే ఊరిశిక్ష ఖరారు చేయటంతో నిమిషా కుటుంబ సభ్యుల్లో ఆందోళన అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
This post was last modified on July 9, 2025 3:15 pm
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది.…
ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…
ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…