Trends

ఫ్లైఓవర్‌లో ‘ఫ్రీ కార్ వాష్’ – వీడియో వైరల్

కర్ణాటకలో కొత్తగా ప్రారంభమైన ఓ ఫ్లైఓవర్‌.. కేవలం 15 రోజులకే దారుణమైన పరిస్థితికి వచ్చేసింది. దక్షిణ కన్నడ జిల్లాలోని కల్లడ్కా వద్ద నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నుంచి భారీగా వర్షపు నీరు కిందకి కార్లపై పడుతుండటం, దాని వీడియోలు వైరల్ కావడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.

ఈ కల్లడ్కా ఫ్లైఓవర్‌ను జూన్ 2న ఆర్ట్ఎస్సెస్ నేత కళ్లడ్కా ప్రభాకర్ భట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. దాదాపు 8 ఏళ్ల పాటు నిర్మాణం జరిపిన తర్వాత, ఎట్టకేలకు ప్రజల ప్రయాణానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ.. వర్షం పడగానే ఫ్లైఓవర్‌ కింద పారుతున్న నీరు చూస్తే ఇది అంత త్వరగా ఎందుకు ప్రారంభించారో అన్న డౌట్ రాక మానదు.

ఫ్లైఓవర్ నుండి కింద పారుతున్న వర్షపు నీరు ఓ కారుపై బలంగా పడిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ‘‘ఇది ఫ్లైఓవర్ కాదు.. కెనార్ వాటర్ సర్వీస్ స్టేషన్’’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘‘ఇలాంటివి చూసి నవ్వినా.. ఇది అసలు నవ్వే విషయమా..? నిర్మాణ నాణ్యత ఎంత చెత్తగా ఉందో స్పష్టమవుతోంది’’ అంటూ మరికొందరు ఘాటుగా స్పందించారు.

ఈ ఘటనపై నెటిజన్ల ట్రోలింగ్ మరింత తీవ్రమవుతుండటంతో అధికారులు అప్రతిష్ఠ నుంచి బయటపడేందుకు వెంటనే లేటు అయిన లేపన పనులు మొదలు పెట్టారు. ఎన్హెచ్ఏఐ (జాతీయ రహదారుల సంస్థ) అధికారులు నీటి లీకేజీలను తగ్గించేందుకు తాత్కాలికంగా ప్యాచ్‌వర్క్‌ చేపట్టినట్లు సమాచారం. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని ప్రజలు అంటున్నారు.

ఈ సంఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణం కేవలం పది రోజుల్లోనే సమస్యలకూ, విమర్శలకూ గురవడం ప్రభుత్వ పనితీరుపైనే ప్రశ్నలు తీసుకొచ్చింది. ప్రజా సొమ్ముతో ఇలా తడబాటు పని చేస్తే, వర్షం కాదు.. సమాజమే ప్రశ్నల వర్షంతో ముంచెత్తుతుంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

This post was last modified on June 18, 2025 1:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

2 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

3 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

3 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

4 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

7 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

8 hours ago