కర్ణాటకలో కొత్తగా ప్రారంభమైన ఓ ఫ్లైఓవర్.. కేవలం 15 రోజులకే దారుణమైన పరిస్థితికి వచ్చేసింది. దక్షిణ కన్నడ జిల్లాలోని కల్లడ్కా వద్ద నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నుంచి భారీగా వర్షపు నీరు కిందకి కార్లపై పడుతుండటం, దాని వీడియోలు వైరల్ కావడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
ఈ కల్లడ్కా ఫ్లైఓవర్ను జూన్ 2న ఆర్ట్ఎస్సెస్ నేత కళ్లడ్కా ప్రభాకర్ భట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. దాదాపు 8 ఏళ్ల పాటు నిర్మాణం జరిపిన తర్వాత, ఎట్టకేలకు ప్రజల ప్రయాణానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ.. వర్షం పడగానే ఫ్లైఓవర్ కింద పారుతున్న నీరు చూస్తే ఇది అంత త్వరగా ఎందుకు ప్రారంభించారో అన్న డౌట్ రాక మానదు.
ఫ్లైఓవర్ నుండి కింద పారుతున్న వర్షపు నీరు ఓ కారుపై బలంగా పడిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ‘‘ఇది ఫ్లైఓవర్ కాదు.. కెనార్ వాటర్ సర్వీస్ స్టేషన్’’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘‘ఇలాంటివి చూసి నవ్వినా.. ఇది అసలు నవ్వే విషయమా..? నిర్మాణ నాణ్యత ఎంత చెత్తగా ఉందో స్పష్టమవుతోంది’’ అంటూ మరికొందరు ఘాటుగా స్పందించారు.
ఈ ఘటనపై నెటిజన్ల ట్రోలింగ్ మరింత తీవ్రమవుతుండటంతో అధికారులు అప్రతిష్ఠ నుంచి బయటపడేందుకు వెంటనే లేటు అయిన లేపన పనులు మొదలు పెట్టారు. ఎన్హెచ్ఏఐ (జాతీయ రహదారుల సంస్థ) అధికారులు నీటి లీకేజీలను తగ్గించేందుకు తాత్కాలికంగా ప్యాచ్వర్క్ చేపట్టినట్లు సమాచారం. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని ప్రజలు అంటున్నారు.
ఈ సంఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణం కేవలం పది రోజుల్లోనే సమస్యలకూ, విమర్శలకూ గురవడం ప్రభుత్వ పనితీరుపైనే ప్రశ్నలు తీసుకొచ్చింది. ప్రజా సొమ్ముతో ఇలా తడబాటు పని చేస్తే, వర్షం కాదు.. సమాజమే ప్రశ్నల వర్షంతో ముంచెత్తుతుంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
This post was last modified on June 18, 2025 1:57 pm
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…