కర్ణాటకలో కొత్తగా ప్రారంభమైన ఓ ఫ్లైఓవర్.. కేవలం 15 రోజులకే దారుణమైన పరిస్థితికి వచ్చేసింది. దక్షిణ కన్నడ జిల్లాలోని కల్లడ్కా వద్ద నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నుంచి భారీగా వర్షపు నీరు కిందకి కార్లపై పడుతుండటం, దాని వీడియోలు వైరల్ కావడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
ఈ కల్లడ్కా ఫ్లైఓవర్ను జూన్ 2న ఆర్ట్ఎస్సెస్ నేత కళ్లడ్కా ప్రభాకర్ భట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. దాదాపు 8 ఏళ్ల పాటు నిర్మాణం జరిపిన తర్వాత, ఎట్టకేలకు ప్రజల ప్రయాణానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ.. వర్షం పడగానే ఫ్లైఓవర్ కింద పారుతున్న నీరు చూస్తే ఇది అంత త్వరగా ఎందుకు ప్రారంభించారో అన్న డౌట్ రాక మానదు.
ఫ్లైఓవర్ నుండి కింద పారుతున్న వర్షపు నీరు ఓ కారుపై బలంగా పడిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ‘‘ఇది ఫ్లైఓవర్ కాదు.. కెనార్ వాటర్ సర్వీస్ స్టేషన్’’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘‘ఇలాంటివి చూసి నవ్వినా.. ఇది అసలు నవ్వే విషయమా..? నిర్మాణ నాణ్యత ఎంత చెత్తగా ఉందో స్పష్టమవుతోంది’’ అంటూ మరికొందరు ఘాటుగా స్పందించారు.
ఈ ఘటనపై నెటిజన్ల ట్రోలింగ్ మరింత తీవ్రమవుతుండటంతో అధికారులు అప్రతిష్ఠ నుంచి బయటపడేందుకు వెంటనే లేటు అయిన లేపన పనులు మొదలు పెట్టారు. ఎన్హెచ్ఏఐ (జాతీయ రహదారుల సంస్థ) అధికారులు నీటి లీకేజీలను తగ్గించేందుకు తాత్కాలికంగా ప్యాచ్వర్క్ చేపట్టినట్లు సమాచారం. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని ప్రజలు అంటున్నారు.
ఈ సంఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణం కేవలం పది రోజుల్లోనే సమస్యలకూ, విమర్శలకూ గురవడం ప్రభుత్వ పనితీరుపైనే ప్రశ్నలు తీసుకొచ్చింది. ప్రజా సొమ్ముతో ఇలా తడబాటు పని చేస్తే, వర్షం కాదు.. సమాజమే ప్రశ్నల వర్షంతో ముంచెత్తుతుంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
This post was last modified on June 18, 2025 1:57 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…