Trends

ఇప్పటివరకు 120 మృతదేహాలు మాత్రమే..

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్యను తెలియజేసే ప్రతి అప్‌డేట్ తీవ్రంగా కలిచివేస్తోంది. తాజాగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దుర్ఘటనలో మరణించిన వారిలో 162 మందికి సంబంధించిన డీఎన్ఏ నమూనాలు వారి కుటుంబ సభ్యుల డేటాతో సరిపోలినట్లు ధృవీకరించారు. ఇప్పటివరకు 120 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌కు సంబంధించింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే సమీపంలోని హాస్టల్ కాంప్లెక్స్‌పై కుప్పకూలింది. ఫ్లైట్‌లో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా.. వారిలో 241 మంది మరణించారు. విశ్వాస్ కుమార్ రమేశ్ అనే ఒక్క ప్రయాణికుడే ప్రాణాలతో బయటపడ్డాడు.

బీజే మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు విద్యార్థులు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు లేవని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి తెలిపారు. ఆయన ప్రకారం.. ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ట్రామా వార్డులో ఉన్న అతను క్రమంగా కోలుకుంటున్నాడు.

ఈ ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం రాజ్‌కోట్‌లో రాష్ట్ర లాంఛనాలతో జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ వంటి నేతలు పాల్గొన్నారు. ఆయన కుమారుడు రుషభ్ రూపానీ చివరి కర్మ నిర్వహించాడు. ఈ సందర్భంలో వేదికపై ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది.

ఇక ప్రస్తుతం డీఎన్ఏతో గుర్తింపైన మిగిలిన మృతదేహాలను కుటుంబాలకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాల పట్ల అనేక నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉన్నందున.. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశముంది. కానీ ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా, సమగ్ర సమాచారం ఆధారంగా వదలే ప్రయత్నం జరుగుతోందని వైద్యశాఖ తెలిపింది.

Kumar

Recent Posts

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

1 hour ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

2 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

5 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

9 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

9 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

11 hours ago