Trends

ఇప్పటివరకు 120 మృతదేహాలు మాత్రమే..

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్యను తెలియజేసే ప్రతి అప్‌డేట్ తీవ్రంగా కలిచివేస్తోంది. తాజాగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దుర్ఘటనలో మరణించిన వారిలో 162 మందికి సంబంధించిన డీఎన్ఏ నమూనాలు వారి కుటుంబ సభ్యుల డేటాతో సరిపోలినట్లు ధృవీకరించారు. ఇప్పటివరకు 120 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ ప్రమాదం జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌కు సంబంధించింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే సమీపంలోని హాస్టల్ కాంప్లెక్స్‌పై కుప్పకూలింది. ఫ్లైట్‌లో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా.. వారిలో 241 మంది మరణించారు. విశ్వాస్ కుమార్ రమేశ్ అనే ఒక్క ప్రయాణికుడే ప్రాణాలతో బయటపడ్డాడు.

బీజే మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు విద్యార్థులు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు లేవని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి తెలిపారు. ఆయన ప్రకారం.. ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ట్రామా వార్డులో ఉన్న అతను క్రమంగా కోలుకుంటున్నాడు.

ఈ ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం రాజ్‌కోట్‌లో రాష్ట్ర లాంఛనాలతో జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ వంటి నేతలు పాల్గొన్నారు. ఆయన కుమారుడు రుషభ్ రూపానీ చివరి కర్మ నిర్వహించాడు. ఈ సందర్భంలో వేదికపై ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది.

ఇక ప్రస్తుతం డీఎన్ఏతో గుర్తింపైన మిగిలిన మృతదేహాలను కుటుంబాలకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాల పట్ల అనేక నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉన్నందున.. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశముంది. కానీ ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా, సమగ్ర సమాచారం ఆధారంగా వదలే ప్రయత్నం జరుగుతోందని వైద్యశాఖ తెలిపింది.

This post was last modified on June 17, 2025 11:26 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

1 hour ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago