మొత్తానికి ఐపీఎల్కు తెరపడింది. కరోనా టైంలో ఏ ఎంటర్టైన్మెంట్ లేక అల్లాడిపోతున్న జనాలకు ఈ టోర్నీనే గొప్ప ఉపశమనాన్ని అందించింది. మామూలుగానే ఐపీఎల్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈసారి రెట్టింపు వినోదాన్నందిస్తూ ఉర్రూతూలిస్తూ సాగింది టోర్నీ. లీగ్ ఇండియాలో జరగలేదు, స్టేడియాల్లో అభిమానులు లేరు అన్న మాటే కానీ.. ఎంటర్టైన్మెంట్కు మాత్రం ఢోకానే లేదు.
ఒక్క మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్లు జరిగాయంటే.. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేనన్నిసార్లు స్కోర్లు సమం అయ్యి మ్యాచ్లు సూపర్ ఓవర్లకు దారి తీశాయంటే.. లీగ్ దశ చివరి వరకు ప్లేఆఫ్ బెర్తుల లెక్క తేలలేదంటే.. ఈ టోర్నీ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రెండు సూపర్ ఓవర్లు జరిగిన మ్యాచ్ను ఐపీఎల్ అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు.
మామూలుగా ఐపీఎల్లో ఒకట్రెండు జట్లు పేలవ ప్రదర్శనతో చాలా ముందే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుని అతి తక్కువ విజయాలతో పాయింట్ల పట్టికలో దిగువన ఉండిపోతాయి. కానీ ఈసారి అలా జరగలేదు. ఏడు విజయాలతో రెండు జట్లు ప్లేఆఫ్ చేరితే.. ప్లేఆఫ్కు దూరమైన నాలుగు జట్లూ ఆరు విజయాలతో నిలవడం విశేషం. ఇలా ఇంతకుముందెన్నడూ జరగలేదు.
ఈ ఐపీఎల్కు మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఇండియాలో ఎప్పుడు లీగ్ జరిగినా బ్యాట్స్మెన్దే రాజ్యం. బౌలర్ల పాత్ర నామమాత్రం అయిపోతుంటుంది. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఫ్లాట్ పిచ్లే కావడం, ఎక్కడా బౌలర్లకు పెద్దగా అవకాశం లేకపోవడంతో బ్యాట్స్మెన్ వీర లెవెల్లో రెచ్చిపోతుంటారు. టోర్నీ ఆద్యంతం అదే పరిస్థితి. కానీ యూఏఈలో అలా కాదు.
టోర్నీ ఆరంభంలో షార్జాలో కొన్ని మ్యాచ్ల్లో బ్యాట్స్మెన్ హవా సాగింది కానీ.. వాటిని మినహాయిస్తే బ్యాటుకు, బంతికి మధ్య రసవత్తర పోరు సాగింది. అన్ని జట్లలో బౌలర్లు అదరగొట్టారు. ఇటు పేసర్లు, అటు స్పిన్నర్లు చెలరేగారు. భారీ స్కోర్లు చేయడం కష్టమైంది. ఓ మోస్తరు లక్ష్యాల్ని ఛేదించడానికీ అవస్థలు పడ్డారు. పిచ్లు ఒక్కో మ్యాచ్కు ఒక్కోలా స్పందించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. దీని వల్ల టోర్నీ మరింత ఎగ్జైటింగ్గా సాగింది.
మొత్తంగా చూస్తే మన ఫ్యాన్స్ వెళ్లి స్టేడియాల్లో మ్యాచ్లు చూడలేకపోయారన్న మాటే కానీ.. లీగ్లో ఎంటర్టైన్మెంట్కు మాత్రం ఢోకా లేదు. టీవీల్లో మ్యాచ్లు చూసిన వాళ్లకు మజానే మజా. ఫైనల్ ఏకపక్షంగా సాగి, అందరూ అనుకున్నట్లే ముంబయి విజేతగా నిలవడం ఒక్కటే నిరాశ కలిగించే విషయమే. దాన్ని మినహాయిస్తే ఐపీఎల్ 13వ సీజన్ సూపర్ హిట్టన్నట్లే.
This post was last modified on November 11, 2020 4:48 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…