Trends

మృత్యుంజయుడు… మంటల్లో నుంచి నడిచొచ్చాడు

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు ఆవల జనావాసాలపై కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అందరూ మృత్యువాత పడ్డట్టు పోలీస్ కమిషనర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అదే అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ మరికాసేపటికే మరో ప్రకటన చేశారు. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి బతికి బట్ట కట్టాడని, అతడు ప్రమాద మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చాడని ఆయన తెలిపారు. వెరసి ఆ వ్యక్తిని ఆయన మృత్యుంజయుడిగా అభివర్ణించారు.

గురువారం మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో మరికొందరు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. ప్రయాణికులను ఎక్కించుకుని వెంటనే టేకాఫ్ తీసుకుంది. అయితే నిమిషాల వ్యవధిలో ఆ విమానం ఎయిర్ పోర్టు ఆవల జనావాసాలపై కూలింది. ఈ ప్రమాదంలో బతికి బట్ట కట్టిన వ్యక్తి కూడా అహ్మదాబాాద్ లోనే విమానం ఎక్కాడు. అయితే ప్రమాద సమయంలో ఏం అద్భుతం జరిగిందో తెలియదు గానీ… పెద్దగా గాయాలేమీ లేకుండా…ముఖానికి, చేతులకు చిన్న చిన్న గాట్లతో అతడు ఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ వచ్చాడు. అతడిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇక ఈ మృత్యుంజయుడి వివరాల్లోకి వెళితే…అహ్మదాబాద్ పరిసరాల్లోని ఓ గ్రామమో, చిన్న పట్టణానికో చెందిన రమేశ్ విశ్వాస్ కుమార్ అతడి పేరు. 20 ఏళ్లుగా ఆయన లండన్ లోనే ఉంటున్నారట. ఇటీవలే తన కుటుంబ సభ్యులను చూసేందుకు ఆయన అహ్మదాబాద్ వచ్చారు. కొంతకాలం కుటుంబంతో గడిపిన ఆయన సోదరుడితో కలిసి గురువారం లండన్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రమాదంలో రమేశ్ బతికి బట్ట కట్టగా…ఆయన సోదరుడు మాత్రం ఏమయ్యాడో తెలియడం లేదని రమేశ్ చెబుతున్నాడు.

విమానంలో రమేశ్ కు విమానం మధ్య భాగంలో 11ఏ సీటు కేటాయించారు. ఇది విండో సీటు. ప్రమాదం సమయంలో విమానం జనావాసాలపై పడగానే… రమేశ్ తన సీటుతో సహా లేచిపోయి అల్లంత దూరాన పడి ఉంటారన్న విశ్లేషణలు అయితే సాగుతున్నాయి. అంతకుమించి మరే మార్గం లేదని కూడా నిపుణులు చెబుతున్నారు. విమానం నేలకూలగానే భారీ కుదుపులకు విమానం సీటు బోల్టులతో సహా విమానం నుంచి విడిపోయి… అద్దాన్ని పగులగొట్టుకుని మరీ బయటకు వచ్చి ఉంటుందని వారు చెబుతున్నారు. ఏదైతేనేం ఇంతటి ఘోర ప్రమాదంలోనూ రమేశ్ స్వల్ప గాయాలతో బయటపడటం నిజంగానే అద్భుతమనే చెప్పాలి.

This post was last modified on June 12, 2025 9:10 pm

Share

Recent Posts

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

2 hours ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

4 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

6 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

9 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

11 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

12 hours ago