Trends

మృత్యుంజయుడు… మంటల్లో నుంచి నడిచొచ్చాడు

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు ఆవల జనావాసాలపై కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అందరూ మృత్యువాత పడ్డట్టు పోలీస్ కమిషనర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అదే అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ మరికాసేపటికే మరో ప్రకటన చేశారు. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి బతికి బట్ట కట్టాడని, అతడు ప్రమాద మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చాడని ఆయన తెలిపారు. వెరసి ఆ వ్యక్తిని ఆయన మృత్యుంజయుడిగా అభివర్ణించారు.

గురువారం మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో మరికొందరు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. ప్రయాణికులను ఎక్కించుకుని వెంటనే టేకాఫ్ తీసుకుంది. అయితే నిమిషాల వ్యవధిలో ఆ విమానం ఎయిర్ పోర్టు ఆవల జనావాసాలపై కూలింది. ఈ ప్రమాదంలో బతికి బట్ట కట్టిన వ్యక్తి కూడా అహ్మదాబాాద్ లోనే విమానం ఎక్కాడు. అయితే ప్రమాద సమయంలో ఏం అద్భుతం జరిగిందో తెలియదు గానీ… పెద్దగా గాయాలేమీ లేకుండా…ముఖానికి, చేతులకు చిన్న చిన్న గాట్లతో అతడు ఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ వచ్చాడు. అతడిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇక ఈ మృత్యుంజయుడి వివరాల్లోకి వెళితే…అహ్మదాబాద్ పరిసరాల్లోని ఓ గ్రామమో, చిన్న పట్టణానికో చెందిన రమేశ్ విశ్వాస్ కుమార్ అతడి పేరు. 20 ఏళ్లుగా ఆయన లండన్ లోనే ఉంటున్నారట. ఇటీవలే తన కుటుంబ సభ్యులను చూసేందుకు ఆయన అహ్మదాబాద్ వచ్చారు. కొంతకాలం కుటుంబంతో గడిపిన ఆయన సోదరుడితో కలిసి గురువారం లండన్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రమాదంలో రమేశ్ బతికి బట్ట కట్టగా…ఆయన సోదరుడు మాత్రం ఏమయ్యాడో తెలియడం లేదని రమేశ్ చెబుతున్నాడు.

విమానంలో రమేశ్ కు విమానం మధ్య భాగంలో 11ఏ సీటు కేటాయించారు. ఇది విండో సీటు. ప్రమాదం సమయంలో విమానం జనావాసాలపై పడగానే… రమేశ్ తన సీటుతో సహా లేచిపోయి అల్లంత దూరాన పడి ఉంటారన్న విశ్లేషణలు అయితే సాగుతున్నాయి. అంతకుమించి మరే మార్గం లేదని కూడా నిపుణులు చెబుతున్నారు. విమానం నేలకూలగానే భారీ కుదుపులకు విమానం సీటు బోల్టులతో సహా విమానం నుంచి విడిపోయి… అద్దాన్ని పగులగొట్టుకుని మరీ బయటకు వచ్చి ఉంటుందని వారు చెబుతున్నారు. ఏదైతేనేం ఇంతటి ఘోర ప్రమాదంలోనూ రమేశ్ స్వల్ప గాయాలతో బయటపడటం నిజంగానే అద్భుతమనే చెప్పాలి.

This post was last modified on June 12, 2025 9:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

12 minutes ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

1 hour ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

1 hour ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

5 hours ago