Trends

మృత్యుంజయుడు… మంటల్లో నుంచి నడిచొచ్చాడు

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు ఆవల జనావాసాలపై కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అందరూ మృత్యువాత పడ్డట్టు పోలీస్ కమిషనర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అదే అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ మరికాసేపటికే మరో ప్రకటన చేశారు. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి బతికి బట్ట కట్టాడని, అతడు ప్రమాద మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చాడని ఆయన తెలిపారు. వెరసి ఆ వ్యక్తిని ఆయన మృత్యుంజయుడిగా అభివర్ణించారు.

గురువారం మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో మరికొందరు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. ప్రయాణికులను ఎక్కించుకుని వెంటనే టేకాఫ్ తీసుకుంది. అయితే నిమిషాల వ్యవధిలో ఆ విమానం ఎయిర్ పోర్టు ఆవల జనావాసాలపై కూలింది. ఈ ప్రమాదంలో బతికి బట్ట కట్టిన వ్యక్తి కూడా అహ్మదాబాాద్ లోనే విమానం ఎక్కాడు. అయితే ప్రమాద సమయంలో ఏం అద్భుతం జరిగిందో తెలియదు గానీ… పెద్దగా గాయాలేమీ లేకుండా…ముఖానికి, చేతులకు చిన్న చిన్న గాట్లతో అతడు ఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ వచ్చాడు. అతడిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇక ఈ మృత్యుంజయుడి వివరాల్లోకి వెళితే…అహ్మదాబాద్ పరిసరాల్లోని ఓ గ్రామమో, చిన్న పట్టణానికో చెందిన రమేశ్ విశ్వాస్ కుమార్ అతడి పేరు. 20 ఏళ్లుగా ఆయన లండన్ లోనే ఉంటున్నారట. ఇటీవలే తన కుటుంబ సభ్యులను చూసేందుకు ఆయన అహ్మదాబాద్ వచ్చారు. కొంతకాలం కుటుంబంతో గడిపిన ఆయన సోదరుడితో కలిసి గురువారం లండన్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రమాదంలో రమేశ్ బతికి బట్ట కట్టగా…ఆయన సోదరుడు మాత్రం ఏమయ్యాడో తెలియడం లేదని రమేశ్ చెబుతున్నాడు.

విమానంలో రమేశ్ కు విమానం మధ్య భాగంలో 11ఏ సీటు కేటాయించారు. ఇది విండో సీటు. ప్రమాదం సమయంలో విమానం జనావాసాలపై పడగానే… రమేశ్ తన సీటుతో సహా లేచిపోయి అల్లంత దూరాన పడి ఉంటారన్న విశ్లేషణలు అయితే సాగుతున్నాయి. అంతకుమించి మరే మార్గం లేదని కూడా నిపుణులు చెబుతున్నారు. విమానం నేలకూలగానే భారీ కుదుపులకు విమానం సీటు బోల్టులతో సహా విమానం నుంచి విడిపోయి… అద్దాన్ని పగులగొట్టుకుని మరీ బయటకు వచ్చి ఉంటుందని వారు చెబుతున్నారు. ఏదైతేనేం ఇంతటి ఘోర ప్రమాదంలోనూ రమేశ్ స్వల్ప గాయాలతో బయటపడటం నిజంగానే అద్భుతమనే చెప్పాలి.

This post was last modified on June 12, 2025 9:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

1 hour ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago