ఘోర విమాన ప్రమాదానికి కారణమైన ఎయిర్ ఇండియా భారత పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇటీవలి దాకా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే నడిచేది. అయితే కారణాలేమిటన్నది స్పష్టంగా తెలియదు గానీ.. ప్రభుత్వ నిర్వహణలోని ఈ సంస్థ టాటా సన్స్ చేతిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు తన విమానం ప్రమాదానికి గురి కావడంతో పరిహారారాలను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గురువారం సాయంత్రం ప్రకటించారు.
ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం అందించనున్నట్లు చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన ఆయన…ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక విమాన ప్రమాదం కారణంగా గాయపడ్డ స్థానికులకు అయ్యే వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని ఆయన ప్రకటించారు. ఇక ప్రమాదం కారణంగా కూలిపోయిన మెడికల్ కాలేజీ భవనాన్ని తామే పునర్ నిర్మించి ఇస్తామని కూడా చంద్రశేఖరన్ తెలిపారు. ప్రమాదం కారణంగా ఇతరత్రా జరిగిన నష్టాలన్నింటినీ తాము భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే… ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ డ్రీమ్ లైనర్ రకానికి చెందినది. ఈ విమానాలు పాసెంజర్ రవాణాలో ఎంతో పేరేన్నిక గన్నది. ఇప్పుడు అహ్మదాబాద్ లో కూలిన ఏఐ 171 కూడా ఈ రకానికి చెందినదే కాగా…ఈ విమానం గత వారం రోజుల్లో చాలా దేశాలను భారీ సంఖ్యలో ప్రయాణీకులను తీసుకుని వెళ్లి… తిరిగి అక్కడి నుంచి అంతే మోతాదులో ప్రయాణికులను భారత్ కు తీసుకువచ్చింది. గురువారం కూడా ఇతర దేశాల నుంచే వచ్చిన ఈ విమానం ఆ తర్వాత లండన్ బయలుదేరి అహ్మదాబాద్ లో కుప్పకూలిపోయింది.
This post was last modified on June 12, 2025 9:21 pm
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…