ఘోర విమాన ప్రమాదానికి కారణమైన ఎయిర్ ఇండియా భారత పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇటీవలి దాకా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే నడిచేది. అయితే కారణాలేమిటన్నది స్పష్టంగా తెలియదు గానీ.. ప్రభుత్వ నిర్వహణలోని ఈ సంస్థ టాటా సన్స్ చేతిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు తన విమానం ప్రమాదానికి గురి కావడంతో పరిహారారాలను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గురువారం సాయంత్రం ప్రకటించారు.
ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం అందించనున్నట్లు చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన ఆయన…ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక విమాన ప్రమాదం కారణంగా గాయపడ్డ స్థానికులకు అయ్యే వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని ఆయన ప్రకటించారు. ఇక ప్రమాదం కారణంగా కూలిపోయిన మెడికల్ కాలేజీ భవనాన్ని తామే పునర్ నిర్మించి ఇస్తామని కూడా చంద్రశేఖరన్ తెలిపారు. ప్రమాదం కారణంగా ఇతరత్రా జరిగిన నష్టాలన్నింటినీ తాము భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే… ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ డ్రీమ్ లైనర్ రకానికి చెందినది. ఈ విమానాలు పాసెంజర్ రవాణాలో ఎంతో పేరేన్నిక గన్నది. ఇప్పుడు అహ్మదాబాద్ లో కూలిన ఏఐ 171 కూడా ఈ రకానికి చెందినదే కాగా…ఈ విమానం గత వారం రోజుల్లో చాలా దేశాలను భారీ సంఖ్యలో ప్రయాణీకులను తీసుకుని వెళ్లి… తిరిగి అక్కడి నుంచి అంతే మోతాదులో ప్రయాణికులను భారత్ కు తీసుకువచ్చింది. గురువారం కూడా ఇతర దేశాల నుంచే వచ్చిన ఈ విమానం ఆ తర్వాత లండన్ బయలుదేరి అహ్మదాబాద్ లో కుప్పకూలిపోయింది.
This post was last modified on June 12, 2025 9:21 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…