వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. “జగన్ .. నీకిదే చెబుతున్నా..” అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రాజకీయాల ముసుగులో అరాచకాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పారు. రౌడీలకు, గంజాయి బ్యాచులకు మద్దతు పలుకుతున్నారంటూ.. నిప్పులు చెరిగారు. “ఎంత ధైర్యం ఉంటే రౌడీ మూకల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్సిస్తావ్? గంజాయి బ్యాచ్ను వెనుకేసుకు వస్తావ్?!” అని ప్రశ్నించారు.
అంతేకాదు.. నేరస్తులను వెనుకేసుకు వస్తూ.. వారితో కలసి రాజకీయాలు చేయడం.. నేరస్తులకు ప్రధాన లక్షణంగా మారిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇలాంటి వారిని ఎలా లైన్లోకి తీసుకురావాలో తనకు బాగానే తెలుసునన్నారు. గతంలో తాను ఫ్యాక్షన్ను అణిచి వేసిన విషయాన్ని జగన్ తెలియకపోతే.. తెలుసుకోవాలని సూచించారు. ఇక, తాజాగా బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటనలో జరిగిన అరాచకాలను కూడా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు.
“పొదిలిలో బాధ్యత లేకుండా పర్యటిస్తావా? దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అంటారా? రౌడీలను వెంటేసుకొని వెళ్లి రౌడీయిజం చేస్తారా? శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తామంటే కుదరదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు నేను మంచిగా పాలించా. ఇక, నా ప్రతాపం చూపితే నువ్వు, నీ ముఠా తట్టుకోలేదు” అంటూ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా.. వాళ్లకు ఇంకా బుద్ధి రాలేదని, సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అమరావతిని.. ఇక్కడి ప్రజలు దేవతల రాజధానిగా పేర్కొంటే.. జగన్ ముఠా.. దీనిని వేశ్యల రాజధాని అంటూ.. మహిళలను అవమానిస్తుందా? అని ప్రశ్నించారు. తోకలు జాడిస్తే.. కత్తిరిస్తా! అంటూ.. చంద్రబాబు హెచ్చరించారు. “పవిత్రమైన రాజధానిని చూసి ఓర్వలేకపోతే.. గమ్మునుండాలి. కానీ.. ఇలా అవమానిస్తారా?” అని వ్యాఖ్యానించారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రజలు ఇక, వైసీపీ పేరు కూడా తలుచుకోకుండా చేశామని అన్నారు. ఈ మేరకు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.
This post was last modified on June 12, 2025 5:47 pm
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…